Thursday, May 19, 2016

భగవంతుని శరణుకి ఆరు నియమాలు

మనం భగవంతునికి శరణు వేడుకోడానికి ఆరు నియమాలు ఉన్నాయి -
1- భగవంతుని శాసనం -మేరకు మన పనులు -కర్మలు పరిమితం కావాలి !--మనం ఆయన సేవకులం మాత్రమే --ఆయన మనకు ప్రభువు !-సేవకుని విధి యజమాని ఆజ్ఞలను పాటించడమే !- కష్టం అయినా -సుఖం అయినా - భగవంతుని లీలగా -అనుగ్రహంగా -ప్రసాదంగా స్వీకరించడం చేయాలి - ఒక ఎండిన ఆకు గాలి వీచడం వలన క్రింద పడినా -తనను తిరిగి చెట్టు కొమ్మ పైకి చేర్చ మని అడగదు - అలాగే భగవంతుని విధివిధానంలో ఎలా జరిగినా సంతోషం -సంతృప్తి పొందాలి ! శరణు కోరడం అంటే ఇదే ! 
2--భగవంతుడు ఇచ్చిన దానితో మనం త్రుప్తి పడాలి -అది మన పూర్వ జన్మల కర్మల ఫలితంగా భావించాలి --ఎంత ఇవ్వాలో-ఎప్పుడు -ఎలా ఇవ్వాలో అతడికి తెలుసు -మనకున్న సంపద -ఐశ్వర్యం -కేర్తి వినోదం -సుఖాలు భగవద్ అనుగ్రహాలు -అది గుర్తించ కుండా ఏ కొంచెం కష్టం కలిగినా "-నాకే ఈ కష్టం భగవంతుడు ఎందుకు కలిగించాలి ?"అని నిందిస్తూ ఉంటారు -జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు సంభవించినా భగవంతున్ని తప్పు పట్టడం -మనం చేసే మరొక తప్పు 1 అతని ప్రేమ అందరికి సమానమే !అందరు అతని పిల్లలే -అందులో హెచ్చు తగ్గులు ఏ కన్నతండ్రి అయినా చూపిస్తాడా ! అలా భావించి పరమాత్ముని మనసారా శరణు వేడాలి 1
3- మనలను అన్ని విపత్తులలో రక్షిస్తాడని -భగవంతుని పై నమ్మకం లేకపోవడం -మన యుక్తులే మనకు రక్షణ అనుకోవడం మన అజ్ఞానం !-పరిజ్ఞానం లేకపోవడం దురదృష్టం ! అతడు మనకు శాశ్వతంగా జన్మ జన్మలకు తండ్రి! -ఈ సృష్టిలో సకల జీవరాసులను సదా సంరక్షిస్తుంటాడు -కోట్ల కొలది చీమలకు ఆహారం అవసరం -- అందులో వేల చీమలు ఆహారం లేకుండా చనిపోతూ ఉండటం మనం గమనించామా !అలాగే ఏనుగులకు పెద్ద మొత్తంలో ఆహారం తింటాయి ప్రతి రోజు -వాటికి కూడా భగవంతుడు తగిన విధంగా సమకూరుస్తాడు -ఒక తండ్రి తమ సంతానాన్ని ఎంతో ప్రయాసపడి వారికి కూడు -గుడ్డా -గూడు - సమకూర్చి పోషిస్తాడు-కదా !జగత్తును శాసించే వాడు -పాలించేవాడు తన బిడ్డలను పోషించకుండా ఉంటాడా !అతని రక్షణలో మనం సురక్షితంగా ఉండగలమని విశ్వాసం కలిగి ఉండటం కూడా శరణాగతి అవుతుంది 
4- కన్నతండ్రి పట్ల కుమారునికి వినయ విధేయతలు ఉండాలి -అలా కాకుండా -"అతని తండ్రి అతన్ని పోషించాడు -అలాగే నన్ను మా తండ్రి పోషించాలి -"అని కృతజ్ఞతా భావం లేకుండా ఉండటం -తప్పు కదా ! అలాగే -జగద్రక్షకుడు - పోషణ కర్త -పరమాత్మునికి మనం కృతజ్ఞత చూపక పోవడం కూడా అజ్ఞానం -అవివేకం -అపరాధం అవుతుంది 1 కర్త -కర్మ క్రియ అన్నీ నీవే స్వామీ 1అన్న భావంతో శరణు కోరాలి 1 
5-మన సంపద బంధువులు వనరులు -అన్నీ మనకు భగవంతుడు అనుగ్రహించినవే -మనం జన్మించడానికి ముందు ఉన్నాయి -చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి -అందువల్ల అన్నింటికీ నిజమైన యజమాని భగవంతుడు మాత్రమే- అందులో కొన్ని మనవి అనుకుంటే తప్పు !-ఇతరుల ఇంటిలో జొరబడి అతని అనుమతి లేకుండా -అతని దుస్తులు -ఆహారం- పడక వాడుకోవడం లాంటిద్ ఇవన్నీ మనవి అనుకోవడం 1అందుచేత జగత్తులో ఉన్నప్రతీదీ భగవంతుని వస్తువే అనుకోవడం -అలా భావించడం కూడా శరణా గతి 1
6-మనం చసిన మంచి పనులకు మనం కర్తలమని గర్వించడం -కూడా తప్పే !"-భగవంతుని దయవలన ఆ పని చక్కగా జరిగింది -లేకపోతే నేను చేయగలిగే వాడిని కాదు !"-అని అనడంలో నిజమైన గొప్పదనం ఉంటుంది - అతడి మనం ఒక పరికరాలం మాత్రమే !- శివుని ఆజ్ఞలేనిదీ చీమ అయినా కుట్టదు -అలాగే మనం చేసే కర్మలు అతని ప్రేరణ వలన జరుగుతాయి అంతే కాని --"నేను చేశాను !- నా వల్లే ఇది జరిగింది! - నేను గొప్పవాడిని !"- - ఇలాంటి భావాలు అహంకారాన్ని -అహం పెంచుతాయి -ఫలితంగా భగవంతుని దయకు -కరుణకు -దూరం అవుతాం -
" అన్యధా శరణం నాస్తి ! త్వమేవ శరణం మమ ! తస్మాత్ కారుణ్య భావేన రక్ష -రక్ష- పరమేశ్వర ! " అంటూ మన విధిని మనం సక్రమంగా నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించకుండా పరమేశ్వరార్పణం గా చేస్తూ నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ సాగి పోవడమే జన్మకు సార్థకత -ఇదే నిజమైన సిసలైన శరణాగతి !

NOV 23, 2015

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...