Wednesday, March 22, 2017

Shatamanam Bhavathi

Jan 30, 2017

శతమానం భవతు సినిమా చూశాం సంతోషంగా, బావుంది. ముఖ్యన్గా కథ, పాత్రలు చక్కగా కుదిరాయి. 
ఇద్దరు కొడుకులు, ఒక కూతురు - ఎందరు ఉన్నా చివరకు మిగిలింది తలిదండ్రులకు వేదన, ఆవేదన. ఎప్పుడు వస్తారో, వస్తారో రారో , ఎదురుచూపులు.
ఈ సినిమా కేవలం విదేశాలకు వెళ్లిన బిడ్డల గురించి మాత్రమె తీశారు, నిజమే, వాస్తవానికి దగ్గరగా ఉంది మొత్తం సినిమా.
చివరకు విషాదంగా కాకుండా వినోదంగా ముగించడానికి ప్రేమతో ముడిపెట్టి ఇండియా లో ఉండిపోయే హీరో ని పెళ్ళాడి ఇక్కడే ఉండి పోయే హీరోయిన్ ని కథ లో మాత్రం చూడగలం.
డైలాగు లు, పల్లెటూరి సన్నివేశాలు, పాటలు, హాస్యం, నటన, చక్కగా ఉన్నాయి.
 డైరెక్షన్ excellent.ప్రకాష్ రాజ్,జయసుధలు గొప్పగా జీవించారు. సీతమ్మ వాకిట్లో,  అ ఆ, మిధునం సినిమా ల కంటే బావుంది.
అమెరికా కి తమ పిల్లలను  తమకంటే పైకి  ఎదగాలని పంపిన తల్లిదండ్రుల కన్నీటి గాథ. 
ఈ  కథ - వినోదంగా చూడటానికి  సరే. కాని అనుభవానికి వస్తే మటుకు భరించలేం .
కంట నీరు పెట్టకుండా ఉండలేక పోయాను. సినిమా అని తెలుసు, ప్రక్కవాడు వింతగా గమనిస్తున్నాడు అని తెలుసు.
కాని కొన్ని సన్నివేశాల్లో  జల జలా రాలే కన్నీరు ఆపుకోలేక పోయాను నేను. 
మనవలు, మనవరాళ్ళ తో బాటు కూతురు. కొడుకులు తల్లి చేత అన్నం ముద్దలు తింటుంటే...
భార్య బిడ్డల కోసం పడే బాధ , ఆమెను ఒదులు కోడానికయిన  సిద్ధ పడి న తండ్రి... 
అందరు బాగుండాలని, తన ప్రేమను చంపుకుని బంధుత్వాన్ని పిలుపుతో కలుపుకొంటూ...
బావుండడం అంటే అందరితో కలిసి ఉండడం అంటూ, అందరినీ కలిపే ప్రయత్నం చేసే హీరోలు  నిజ జీవితంలో ఉంటారా...ఉన్నారు. ఆనిపించింది.. 
రౌడీతో కూడా  మంచి పని చేయించే  మలుపు...లాంటి సన్నివేశం చాలా  నచ్చింది. వాడిని మార్చ ఎంచుకున్నే విధానం బావుంది. 
అన్నిటి కన్నా నాకు ఇష్టం... గ్రామ దృశ్యాలు, అందమైన దృశ్యాలు, చేనులు, కాలవ గట్లు, పొలాలు అద్భుతమ్.మళ్ళి చూడాలనిపించే  సందడి!

శ్రీనివాస కళ్యాణం అందరిని కలిపింది. అన్ని సమస్యలను తొలగించి, కొడుకు కూతురి మనస్సులను మార్చింది. స్వామివారి పల్లకీ సేవ, సామూహికంగా గుడికి వెళ్ళడం, స్వామివారి దివ్య భవ్య మూర్తిని దర్శించుకోడం నిజంగా అద్భుతం!
రెండు చేతులు అప్రయత్నంగా జోడించి నమస్కరించి ఆనంద భాష్పాలు రాల్చాను. ఒళ్ళు పులకరించింది.  దేవాలయం,  సంక్రాంతి పండుగ, ముగ్గులు ఉత్సవాలు, సంబరాలు మనసును కదిలించాయి     
                   
సాలరీ కాదని, ఉన్న ఊరు విడిచి వెళ్ళే సమస్యే లేదనీ డబ్బుల కోసం నాలుగు గంటలు ఎక్కువ నైనా పనిచేస్తారు కాని మీ కోసం ఎదురు చూస్తున్న తలిదండ్రుల  చూడడానికి సమయం ఉండదు. farming is not labor, A profession - A way of life అని నేర్పరా. economics కాదు emotions నేర్పాలిరా. పిల్లలకు పిలుపుతో బంధుత్వాలు పెంచుకోడం లాంటి మంచి అలవాట్లు నేర్పిస్తుంది ఈ సినిమా..

నిజంగా అందరు అలా ఒకే చోట కలసి సరదాగా అమ్మమ్మ చేతి ముద్దలు తినే రోజు ఎప్పుడు వస్తుందో కదా ! 
ఇలా నిట్టూరుస్తూ సినిమా చూసి బయటకు వస్తుంటారు విదేశాల పిల్లల తలిదండ్రులు... సినిమా కథ సుఖాంతమే..కానీ ప్రేక్షకుల పరిస్థితి గమనిస్తే మాత్రం........!"

Maya

" ఎందుకు పుట్టామొ " -కారణం ఎవరు చెప్పగలరు ?-- ఎక్కడినుండి వచ్చామో -ఎక్కడికీ పోతామో" తెలీదు - -- జీవిత పరమార్థం అంతా " నేను దేనికీ కర్తనుకాను " ఈశరీరంతోచేసే ఏ పనితో కూడా నాకు సంబంధంలేదు "అని అనుకోడంలోనే మూలంఉంది -"మనిషిభయం "అంతా ఈ "ఆశ" మరియు " మోహం " లోనేఉంది.

చంచలమైన మనసు దేవునిమూర్తిపై నిలువదు నిజమే ! -- కానీ ఆ మనసు ఎక్కడికి పరుగులు తీసినా అక్కడ పరమాత్మ ఉంటాడు - అందుకే దైవాన్ని తప్పించుకు పోలేదు -అయన అంతర్యామి -కనుక-- ముక్తిసాధనకు మొదట దేవతా స్థూలరూపాలు అవసరం-- పూర్వకాలంలో ఇంటిలోని గోడలకు దేవతా చిత్రాలు తగిలించేవారు --పిల్లలకు దేవుళ్ళపేర్లు పెట్టుకునేవారు- ఆ రకంగా "భగవన్నామ సంకీర్తనం" చేసుకునే భాగ్యం కలిగేది .

అప్పటి ఉపాధ్యాయులకు దేవుళ్ళపేర్లుపెట్టుకున్న విద్యార్థులపేర్లురోజూ పిలవడంతో ఎంతో పుణ్యం కలిగింది - ఇప్పుడేమో "పరమశివ సారాయిదుకాణమ్ " అంటూ దైవాన్నిచులకన భావంతో పిలుస్తూ తమకుతామే అధోగతి పాలౌతున్నారు -దేవతా మూర్తుల -విగ్రహాలు -ఫోటోలు హృదయాకాశంలో చింతించాలి అనునిత్యం స్మరించాలి -అది పరమపద వైష్ణవ మార్గం -- సద్యోముక్తి అంటే అహం బ్రహ్మోస్మి" --క్రమ ముక్తి అంటే విగ్రహారాధన --కొందరు "శాలిగ్రామా"లను నిత్యము పురుషసూక్తంతో పూజిస్తారు -అందుకు విశేషమైన పరాపరఫలాన్ని పొందుతారు--నిజానికి " నాదికాదు" అనే భావనలో అనంతమైన స్వేచ్ఛ ఉంది --- కానీ దానికి నిరంతర సాధన చేయవలసి ఉంటుంది --కదా !

కోటీశ్వరుడు ఒకడు -తన దగ్గర ఉన్న ఆస్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలీక ఒక సన్యాసికి ఇవ్వచూపాడు -- దానికి ఆ సన్యాసి -- " ఆస్తి నీది " అని అనుకోడంలోనే నీ అజ్ఞానం తెలుస్తోంది -- నీది కానీ ఆస్తికి నీవు జీతం తీసుకుంటూ కాపాడు !"-- అది ఎవరికి ఎప్పుడు ఎలా చెందుతుందో ఆలోచించకు -" - అన్నాడు .


ఎన్నాళ్ళు బ్రతికామో ముఖ్యంకాదు - అంతిమ ఘడియల్లో" నారాయణ స్మృతి "కలగడం ముఖ్యము -- - అలాంటి సౌఖ్యం కలగాలంటే సాధన కావాలి - "నార" చూపిస్తే "పీచు" అంటాడు - "అణా " చూపిస్తే "డబ్బులు" అంటాడు --కానీ ఆ రెండింటినిచూసి "నారాయణ "అని భావించడు ---- మనిషిని దైవంనుండి దూరం చేసేది -మాత్సర్యము -- దానితో అతనిలో ఉన్న "సత్వమ్ "పూర్తిగా హరించుకొని పోతుంది -- విలువైనసంపద ఎంతఉన్నా పొందలేకపోవడం నిజంగా మందభాగ్యము - పవిత్రమైన భావన కలగాలంటే తినేఆహారం శుద్దమైనదిగా ఉండాలీ -- భగవన్నామస్మరణతో వండినదిగా ఉండాలి -- ఎలాంటి భావాలతో ఆహారం తయారుచేస్తే మనసులో అలాంటి బుద్ధులే పుడతాయి -- దొంగతనంచేసిన పదార్తాలతో వండిన ఆహారంతింటే దొంగబుద్ధులే పుడతాయి -సంసారం అంటే అదేదో లోతులేని సముద్రం అని కాదు - " 

స్థిరత్వం నుండి మనసు దిగజారి పోవడం "-- సమభావన అంటూ వచ్ఛేది కేవలం స్మశానం లోనే - అక్కడ అంతా ఒకటే - అందరు సమానమే - ఉఛ్చానీచాలు లేవు - తరతమ బేధాలు లేవు - నిద్రలో తిన్నట్లుగా కలవస్తే - తెలివోచ్చ్చాక - కలలో తిన్నాం కదా అని మానివేస్తామా - అలాగే ఈ మిథ్యాప్రపంచ అనుభవాలు -- నిజానికి మనం నిద్రలో పరిపూర్ణ ఆత్మానందాన్ని అనుభవిస్తాము -- బాహ్య జగత్తులోకి కళ్ళు తెరిచి చూశాక - కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు బుధ్ది చిత్థము అహంకారము - 

ఇలాంటి 24 వికారాలతో వాస్తవమని భ్రమిస్తూ ఈ మాయాజగత్త్తులో మునిగి -- ఈ అన్నింటికీ మూలకారణమైన పరమాత్మఉనికిని మన అజ్ఞానం - సంచిత కర్మల ప్రభావం వలన వాస్తవాన్ని గుర్తించ లేకపోతున్నాము -

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...