మా అమ్మ అరటిపండు ను ముక్కలు చేసి అందరికి ఇస్తూ చివరికి మిగిలిన భాగాన్ని నోట్లో వేసుకునేది... పళ్లకు అంటకుండా.. చూస్తే నోరూరి తినాలని అనిపించే మామిడి పండ్లని బ్రహ్మణుడికో ముత్తైదువ కో పిల్లలకు ఇచ్చేసేది... ఉంచుకోడం లోకన్నా,, పంచుకోడంలో ఎక్కువగా ఆనందాన్ని తృప్తినీ పొందేది. పరమాత్మ తత్వ చింతనతో.మనసు పండితేనే అలాంటి నిష్కామ ప్రవృత్తి అలవడుతుంది కదా .హరే కృష్ణ.......
No comments:
Post a Comment