ప్రయాగ క్షేత్రం - గంగా యమునా అంతర్వాహిని సరస్వతీ ఈ మూడు పవిత్ర నదీ ప్రవాహాల త్రివేణీ సంగమస్థానం లో వేణీ దానం చేస్తారు - ఈ మూడు నదుల సంగమ స్థానం లో దంపతులు ఇరువురు పవిత్ర స్నానాలు చేసిన తర్వాత - భర్త స్వయంగా తన భార్యను తన ఒడిలో కూర్చోబెట్టుకుని- చక్కగా ఆమెకు తానే స్వయంగా - జడను మూడు పాయలుగా (అవే ఈ మూడు పవిత్ర నదుల సంగమ ప్రవాహాలు ) విడదీసి నిదానంగా జడను వేసి- పూలు పెట్టి -బొట్టు పెట్టి -చేతికి గాజులు -కాళ్ళకు పారాణి అలది - పట్టాగోలుసులు అమర్చి - వెలికి బంగారుఉంగరం ఉంచి -ఆమెను మహాలక్ష్మిలా అలంకరిస్తాడు - తర్వాత బ్రాహ్మణుల మంత్రోచ్చారం ద్వారా -ఆమె జడ చివర కొంత భాగాన్ని కత్తిరించి -ఆ కేశాలను అదే త్రివేణీ సంగమం లో విడుస్తారు -ఈ విధానాన్నే వేణీ దానం అంటారు - ఒక్కసారి మాత్రమే ఈ విధంగా దంపతులు చేయవలసి ఉంటుంది - ఆ నదీమ తల్లుల ఆశీస్సులు పొందడం వలన వారికి సకల సౌభాగ్యాలు కలిగి -పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగి - సత్సంతానము -దైవానుగ్రహము -ప్రాప్తిస్తాయి -ప్రయాగ క్షేత్రంలో వేలాది జంటలు రావడం - పవిత్ర స్నానాలు చేయడం -దర్శించుకోవడం వేద కాలం నుండి వస్తున్న సాంప్రదాయం -
Thursday, May 19, 2016
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Mar 28, 2020 "తీరని ఆపద ,ఘోర విపత్తు ""కరోనా వ్యాధి రూపంలో ప్రపంచం అంతటా ఒకేసారి వచ్చి పడింది! ఒకరికి మరొకరు సహాయం చేసుకునే...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
May 27, 2020 ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది? భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇ...
No comments:
Post a Comment