Saturday, September 15, 2018

దుఃఖం

నేను పదవ తరగతి చదివిన రోజుల్లో.ఒక పద్యం... అందులో భర్త యుద్ధం లో చనిపోగా భార్య ను ఊర డించడానికి  ప్రక్కింటివారు. బంధువులు అంతా ఆమె ఇంటికి వస్తారు...అందరూ ఏడుస్తుంటారు.. ఆమె దీన స్థితికి.. కాని భార్య మాత్రం ఏడవకుండా మాట్లాడకుండా రాయిలా ఉండిపోతుంది... కళ్ళు నిలబడిపోతాయి.. కన్నీళ్లు పెట్టుకోవడం లేదు... లోనున్న దుఃఖం బయట పడనీయడం లేదు... పిచ్చి దానిలా ఎటో చూస్తుంటుంది.. ఎవరు ఎమన్నా దానికి జవాబు లేదు.. స్పందనా లేదు..ఇలాంటి దుర్భర పరిస్థితి చూడలేక . ఆమె తనివిదీరా ఎడవాలంటే ఏం చెయ్యలో ఎవరికీ పాలు పోవడం లేదు... అలా గంటలు గడుస్తున్నాయి.   అప్పుడు ఒక వృద్ధురాలు వచ్చి చూసింది.. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించి.... బిగ్గరగా ఏడవకుండా అలాగే ఉంటే. ఆమె ఖచ్చితంగా చనిపోతుందని గ్రహించి... దూరంగా ఉయ్యాల లో పడుకున్న  పసిబిడ్డను   ఆమె ఒడిలో ఉంచగానే.. ఆ బిడ్డ కెవ్వుమని ఏడ్వడం ...అందాకా ఈ లోకంలో లేకుండా ఏమీ పట్టనట్టుగా ఉన్న ఆ మాతృ హృదయం . లోనుండి ఒక్కసారిగా  దుఃఖం కట్టలు తెంచుకొని కన్నీళ్ళ రూపంలో ప్రవహించాయి.... బిడ్డను గుండెలకు హత్తుకుంటూ బిగ్గరగా  ఎలుగెత్తి భర్తజ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విలపించడం  ప్రారంభించింది........

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...