Friday, April 19, 2019

ఆత్మ జ్ఞానం

April 2019
""ఆత్మజ్ఞానం,, !!"" అంటే  ఆత్మను గురించిన జ్ఞానం,,! గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవాను డు భగవద్గీత లో సూచించిన ప్రకారం, ఆత్మకు చావు లేదు,,!పంచభూతాలు , ప్రకృతి శక్తులు ఏవి కూడా ఆత్మను ప్రభావితం చేయలేవు .! అది శాశ్వతం,!, ఏ వాసనలు, కర్మలు దానినం టవు ,! అవన్నీ జీవుని లక్షణాలు!", అంటూ  జీవిలో ఉండే అద్భుతంగా  "ఆత్మ మహాత్మ్యం" వివరించాడు , !అలా మనలో ఉండి మన జీవితాన్ని నడిపిస్తూ, దానికి కావాల్సిన శక్తి యుక్తులను, చైతన్యాన్ని సమ కూరుస్తూ , జీవిని వదలకుండా ఉండే రక్షణ కవచం, ఈ ఆత్మ !!, ఇక అనాత్మ అంటే ఆత్మ కాని ఈ దేహం. ను అనాత్మ గా చెప్పుకోవచ్చు !. నేను ఎవరిని, ? ఆ నే పరి ప్రశ్నకు సమాధానం, ఖచ్చితంగా ఇది అని చెప్పలేము, కాని ఆత్మ పరిశీలన  ,అత్మ  విచారణ చేసుకోవడం ప్రతీ జీవునికి అత్యావశ్యకం,! ఇలా  జీవించడం ఎవరికోసం?,, జీవితం అంటే ఏమిటి,? ఈ జీవి ఎవ్వరువాడు,? ఎక్కడినుండి ఎక్కడికి అతడి ప్రయాణం?, ఇలాంట వేదాంతి ప్రశ్నల కు జవాబులు ఎవరికీ వారే, ఆత్మ శోధన చేస్తూ తెలుసు కో వాల్సి ఉంటుంది..,! జీవుడు అంటే మనసు,! అందులో " నేను "అనే అహం ఉంటుంది,! ఇక  పరమాత్మ అంశ ఆత్మ! దాని లో చిత్తశుద్ది కలిగిన బుద్ధి,, ఉంటుంది ,! అలా అని జీవాత్మను వేరుగా చూడలేము,, శరీరమంతా వ్యాపించి ఉంటాడు జీవుడు,, దానితో శరీరం చేసే పనుల కు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కూడా !!జీవుడు ఆత్మ లేకుండా మనుగడ సాధించలే డు ,, నిజమే , కాని, జీవుడు గతజన్మ కర్మ ఫలాలను అనుభవించే విధంగా  దానికి అనుగుణంగా , ఈ ఆత్మ బుద్దిని ప్రేరేపి స్తు , ప్రబో దిస్తూ  ఉంటుంది . ఇక ఈ శరీరంలో ఉన్న జీవుడు బందీ యై, తన కోరికలను తీర్చే ప్రయత్నంలో ప్రాకులాడుతూ , కూడా కర్మ జ్ఞాన ఇంద్రియాలను ఉపయోగిస్తూ తాను ఒక ""సర్వ స్వతంత్ర,, స్వేచ్చా జీవిని!" అని భావిస్తాడు,, కాని అది అజ్ఞానం,! అవివేకం ! అవిద్య,! అమాయకం!, అహంకారం కూడా,,! ఇలాంటి శరీరాలు ఎన్నో ధరించి, అందులో బందీయై, కర్మఫలం పూర్తి గాకుండా బయటపడే మార్గం కానరాక,, విధి చేత లలో చిక్కి,,, కుక్క నక్క పాము, పురుగు క్రిమి కీటకాల ఉపాధి తో దుర్భర జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. జీవికి ఈ శరీరం ఒక సాధనం మాత్రమే, ! దానిని ఒక కర్మాగారం లా చూస్తూ అనుక్షణం జాగ్రత్తగా  వాడుకోవాలి ..! అలా కాక,, నిర్లక్ష్యం తో ఇది నా ఇల్లు! నా ఇష్టం !" అనే అజ్ఞాన భావనతో, సక్రమంగా ఉపయోగించు కోకుండా ఉంటే మాత్రం  అది  ఏ మాత్రం పని చేయ కుండా పోతుంది,, !అంటే చనిపోతుంది!, అంటే ప్రాణం,, పోతుంది,,! అప్పుడు, లోన బందీ గా ఉన్న జీవుడు , గత్యంతరం లేక,,ఆత్మ సహాయం తో వాయు రూపాన దేహాన్ని విడిచి ఎగిరి పోతాడు,,! ఎక్కడికి అనేది మాత్రం ఎవరికీ  తెలియదు, ! దీనినే  మరణం అంటాము,! అది దేహానికి మాత్రమే మరణం,! అలా  ఒక ఉపాధి కోల్పోతాడు జీవుడు,,! అలాగే జననం కూడా ! జీవుడు ఒక వాయు రూపంలో మాతృ గర్భంలో ఉన్న పిండంలో  ప్రవేశిస్తాడు,!, స్త్రీ లోని అండం, పురుషుని శుక్ల కణం, రెండూ సంయోగం చెంది పిండంగా మారడం, , ఆ ఉపాధిని వెతుక్కుంటూ జీవుడు అందులో కి రావడం ,9 నెలల వ్యవధిలో ,ఈ బయట ప్రపంచం లోకి అడుగు పెట్టడం, ఇదంతా వింతైన విష్ణు మాయ.!. జగన్మా తల్లీ కడుపులో ఎలా అజ్ఞానం , తో, దైవాన్ని తెలుసుకోకుండా ఉంటాడో, అలాగే బహ్యప్రపంచం లో కూడా అదే మాయ,,! అదే మూర్ఖత్వం,! అదే అజ్ఞానం! ఎవరికీ ఎన్నటికీ, ఎంతకు అంతు చిక్కని సృష్టి రహస్యం, , ఈ జీవన వలయం, సృష్టి స్థితి లయ,,ఈ  విధంగా జీవుడు, ఉపాధిని వెతుక్కుంటూ రావడం పోవడం.! ఎవరు కూడా  ఊహింపలేని   యుగ యుగాలుగా నిరంతరం  సాగుతున్న జగన్నాటకం,! ఈ జీవులను పావులుగా చేసి, సంసారమనే చదరంగం లో వింతగా చిత్రంగా భగవంతుడు ఆడుతున్న ఆటల పరమార్థం ,, మాత్రం  ,,వేదాలకు, శాస్త్రాలకు, మహా ఋషులకు అర్థం కా నీ, మహ మహా విన్యాసం, అద్భుత లీల, గా విచిత్రంగా మిగిలిపోయింది. !జీవు డు ఆనందంగా బ్రతుక డానికి, అందుబాటులో   పంచేంద్రియాలు, ఉంటున్నాయి, చాలామంది చక్కని క్రమ శిక్షణ తో శరీరాన్ని మనసుని నియంత్రిస్తూ, ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంటే, తమ శరీరాన్ని ఒక అందమైన గృహం లా తీర్చి దిద్దుతారు, అలా రోగాలు, నొప్పుల బాధలు లేకుండా ఎక్కువకాలం  బ్రతకవచ్చును. ఇది మనసు చెప్పినట్టు శరీరాన్ని  నియంత్రిస్తూ జీవుడు విజ్ఞాన దిశలో కొనసాగించే ఒక జీవనవిధానం! , ఇక మరో కొత్త మలుపు మార్గం కూడా జీవునికి విదించ బడి  ఉంది, !!అది జీవుడు తన శరీరాన్ని దేవాలయంగా భావించే దివ్యమైన భావ సంపద..!  గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా, "నీ మనసే నీకు శత్రువు!, మిత్రువు కూడా, !""అంటే మనం భావించే విధానాన్ని బట్టి పరిస్తితి మారుతుంది, ప్రతీ రోజూ దైవభక్తి కలవారు 24 గంటల్లో కనీసం ఒక పావుగంట అయినా తమ ఇష్టదైవాన్ని పూజించు కుంటు తమ భక్తిశ్రద్ధలు  కనబరుస్తూ  కుంటారు,,! తమ కున్న అంత పెద్ద ఇంటిలో దేవుని కోసం ఒక చిన్న గది,shelf, లేదా ఒక గూడును" పూజా గది""గా మార్చి, గోవిందుని కి , నిత్యం అర్చన, నివేదన చేస్తున్నట్టు గా , తమ రోజువారీ కార్యక్రమాల్లో కొంత సమయాన్ని,, దైవారాధన కు ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి అది యాంత్రికంగా చేసే పని, !ఒక సినిమా, ఒక షాపింగ్, ఒక ఆఫీస్, ఒక బంధువు ఇంటిని దర్శించడం ఎలాగో , ఆలయానికి వెల్లడం కూడా అంతే అవుతోంది,! అంటే భావంలో తేడా లేదు, భగవంతునితో అనుబంధం లేదు..! హాస్పిటల్ కు వందల సార్లు వెళ్తాం ,,కాని, ఆలయానికి వెళ్ళడానికి మాత్రం  సమయం దొరకదు,, ! పాప క్షాళన చేసుకోడానికి !! దేవుడు జీవునికి రెండు మార్గాలు అనుసరణ కు  అనుగ్రహించాడు .. మనసుతో శరీరాన్ని ఇల్లుగా మార్చుకుంటా వో. లేక, చిత్తశుద్దితో శరీరాన్ని నడిచే దేవాలయంగా భావిస్తూ, బ్రతుకును పునీతం చేసుకుంటావా, అది జీవుని కి వదిలేశాడు పరందాముడు! , అన్నీ ఇచ్చాడు,,! అలాగే వాటిని  వాడుకునే అవకాశం బుద్దిని  కూడా ఇచ్చాడు,! ఇక జీవుని కర్తవ్యం తనకు ఏది యుక్తమో, జీవన్ముక్తి దాయకమో,నిర్ణయించుకోవడం ,! శరీర సౌఖ్యం, అస్తి, బందువులు , ఇలా దేవుడిచ్చిన ప్రసాదం ఉపయోగిస్తూ , అతడిని మరచి, కృతజ్ఞత చూపకుండా, మోహం చాటేస్తు ఉంటాం ,! ఏదో మొక్కుబడిగా రోజూ గంట పూజలు చేస్తున్నానని,,, పూలు పండ్లు పాలు, భోజనాలు నైవేద్యాలు గా సమర్పిస్తూ ఉన్నానని భావిస్తూ ఉంటాం ,, కాని అద మాన ఆలోచనలోి పొరబాటే అవుతుంది,,! నీవు స్వామికి ఇచ్చేదంతా, నీవు అనుభవించే దంతా, అతడి సొమ్మే కదా,,! పరమాత్మకు కావల్సింది నీ మనసు,, నీ ద్రవ్యం కాదు,, త్రికరణ శుద్ధిగా భావించి తపించి , చిత్తశుద్ది తో సేవించే నిర్మలమైన భావం , దైవా నికి ప్రీతికరం అని భక్తియోగం లో స్వామి చెప్పాడు కదా,, కృష్ణయ్య !! మనం  ఒక బంధువు ఇంటికి వెళ్తే అక్కడ పరిచయాలు, బంధుత్వం, స్వాగత సత్కారాలు విందులు వినోదాలు ఉంటాయి. కాని ఆలయంలో దైవం తో అలాంటి ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం, వ్యాపారం ఉండవు కదా, అందుకే ఆలయం లో, యాత్రలో, వ్రతాల లో నిత్య పూజా విధానంలో కూడా సంసార విషయాలు జ్ఞాపకం వస్తుంటాయి,, ! నిజానికి దైవం ముందు నిలబడి నీవు చేయాల్సింది అత్మ సమర్పణ మాత్రమే, అంటే నీవు హృదయ పూర్వకంగా శతకోటి వందనాలు సమర్పించు కుంటే చాలు,,, చేసిన తప్పులు, పొరబాట్లు, అపరాధాలు పశ్చాత్తాపంతో ఒప్పు కుంటే చాలు. ! , ఇక ముందు అలాంటి తప్పులు చేయనని , మాట ఇస్తూ,,దైవం ముందు నీ బలహీనత లను చెప్పుకోవడం చేయాలి,! దేవుడు నీకు ఇది ఇవ్వాలని కోరకుండా, నీవు దైవానికి ఏమివ్వగల వో,, చెప్పుకో !! వివేకంతో, బుద్ధికుశలత తో శిరసు వంచి, చేతులు జోడించి ఆర్ద్రత తో, అనందం తో, గోపాల కృష్ణుని సుందర విగ్రహ దర్శనం భాగ్యం అనే అమృతపానం ఆస్వాదిస్తూ ఆనందభాష్పాలు రాలిస్తే చాలు, అది నిజమైన నిష్కళంక నిస్వార్థ ము గా విన్న వించే  పూజ అవుతుంది, !!లోనున్న జీవాత్మ కు ఎదురుగా నిలిచిన పరమాత్మకు అనుసంధానం మనకున్న ఈ ఆత్మజ్ఞానం, వల్ల మాత్రమే సాధ్యం అవుతున్నది,!, అందుచేత, కేవలం పూజా మందిరంలో నే గాకుండా, అన్ని చోట్లా, అన్నివేళలా, అంతటా, ఆ కరుణామయుని అనందనిలయంగా  భావించడం ఉత్కృష్టమైన మానవజన్మ ను సార్థకం చేసుకోవడం అవుతుంది  !! అదే మన పరమార్ధం ,,!"అర్థం కూడా  !!!!""  స్వస్తి !?! కృష్ణ హరే కృష్ణా. !"".

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...