Sunday, May 5, 2019

మనసు ,బుద్ధి, మరియు అత్మ,

May 5, 2019

"మనసు ,బుద్ధి, మరియు అత్మ, ఇవి మూడు మన శరీరానికి ధాతువులు. అనగా జీవునికి ప్రమాణాలు.

ఇక, మనసు అంటే జీవుడు ! ఈ. జీవుడు దేహమంతా వ్యాపించి ఉంటాడు!, కాలికి ముల్లు కుచ్చితే " అయ్యో!!" అంటూ బాధతో విల విల లాడుతాడు, కొంతసేపు,!!"", నేనే ,ఈ దేహమై ఉన్నాను !!"" అన్న అహంభావంతో జీవుడు " మనసు" అనే ఆయుధంతో నిరంతరం ప్రశాంతత ను, సంతృప్తిని కోల్పోయి, సంచరిస్తూ ఉంటాడు , జీవుడు  ఒక్క నిద్రా స్థితిలో తప్ప, మనసు నిల xxకడగా ఉండదు, కదా... ! .

ఇక "బుద్ది" అనేది మెదడు లో స్థిరంగా ఉంటుంది, మనసు తో ఆలోచించి, సంకల్పించి జీవుడు బుద్ధి  కుశలత తో కార్యాన్ని అనుకున్నది సాధిస్తూ ఉంటాడు.!. అస్తి ఐశ్వర్యాలు, బంధు బలగం, సంసార జీవితం సాగించడం, ఇదంతా మనసు బుద్ది ఏకమై తగిన ప్రణాళిక రూపొందిం చి, సంపాదిస్తా యి, ఇదే జీవితం, ఇదే అనందం, ఇదే గమ్యం, అనుకుంటాడు జీవుడు తన నిజ స్వరూపం ఏమిటో తెలుసుకోకుండా, అర్థవి హీనం గా బ్రతుకు జంతువు లా ఈడుస్తూ ఉంటాడు.

,ఇక మూడవది"అత్మ!" అది పరమాణువు కంటే అతి సూక్ష్మ రూపంలో గుండె కు దగ్గరగా ఉంటుంది అని పురుష సూక్తం చెబుతోంది,! అత్మ, పరమాత్మ వలె అగోచ రము, అవినాశము,, కోటి సూర్యప్రకాశ ము, అవిచిన్నము, అద్భుతము కూడా,,! జీవుడు పొందే ఆనందము ఆత్మానుభూతి పొందితేనే తప్ప అనుభవం కాదు,, కదా! ఈ జీవునికి కలిగే దుఃఖము, తో ఆత్మకు ఏ మాత్రము సంబంధం లేదు,! పైగా కేవలం సాక్షి లా చూస్తూ ఉంటుంది!, అత్మ లేకుండా జీవుని మనుగడ లేదు, నిజమే,, కాని ఈ అత్మ వైభవం తెలిసేది కేవలం మనిషికి మాత్రమే..! ఇతర ఏ ప్రాణికి అనందం తెలియదు .నాశము లేనిది,ఆనంద మయము, ప్రశాంత నిలయ ము, సచ్చిదానంద స్వరూప ము,, పరమాత్మ అంశము అయిన ఈ ఆత్మానుభవం  , అద్భుతమైన ఆత్మానందం, అది కేవలం అనుభవైక వెద్యము, మాత్రమే! ఆ బ్రహ్మానందం, ఆ,,పరమానందం,, దైవానుగ్రహము వల్లనే లభ్యం అవుతోంది ఎవరికైనా, వారి భక్తి తత్పరత ను బట్టి,,!

అయితే ఇంతటి అద్భుత అలౌకిక అపురూప అద్వితీయ మైన, ఆనంద స్థితిని జీవుడు పొందాలంటే, మనసును, బుద్దిని కుదురుగా, ఆత్మలో నిలిపితెనే, సాధ్య పడుతుంది! అలా, ఎంత సేపు దృష్టిని ఏకాగ్రతతో, దృశ్యం పై నిలిపితే అంతే అనందం అనుభవానికి  వస్తుంది.! .

కొడుకు పుట్టాడని ఆత్మానందం పొందుతాడు మనిషి, అనగా జీవుడు  . ఆ ఆనందంతో జీవుడు  ఆత్మతో మమేకం అయ్యి,, అనగా జీవాత్మ సంయోగం తో ఆనందాన్ని పొందుతాడు, అదే విధంగా తీరని నష్టం గానీ కష్టం గానీ వస్తె,  జీవుడు  మనసును ఆశ్రయిస్తాడు,, బుద్దిని కాదు,! అలా జీవుడు ఆత్మకు దూరమై, అత్మ విచక్షణ కోల్పో తాడు. అలాంటి ఈతి బాధలు, కష్టసుఖాలు కేవలం దేహానికి, అనగా, మనసుకి  కానీ₹ ఆత్మకు కాదు !"అన్న వివేకం కోల్పోతాడు,

జీవుడు, దేహాన్ని ఆశ్రయించి ఉన్నా అది తాను కాదు, అది తనది కాదు కదా!, బట్ట చిరిగిన వెంటనే దానిని పారవేసి కొతబట్ట వేసుకున్నట్టు, దేహంతో ముడివడిన జీవుడి "కర్మ పరిపాకాలు!", అన్న జ్ఞానంతో, శరీరాన్ని ఒక పనిముట్టు లా ఉపయోగిస్తూ, అత్మ ఉద్దారణ కోసం జీవుడు, తాను శరీరాన్ని కాదు అన్న వైరాగ్య భావన తో తపించాలి, !అందుకు జీవుడు అంటే మనిషి, కోరికలు అంటే మనసును నియంత్రిస్తూ, దేవుడిచ్చిన మెదడు లోని బుద్దిని, తదనుగుణంగా ప్రభావితం చేయాలి,

"ధియో యోనః ప్రచోదయాత్,!" అని గాయత్రి మంత్రం లో చెప్పబడి నట్లుగా," ఓ భగవంతుడా!, నా బుద్దిని, జ్ఞాన దిశలో, నిన్ను తెలుసుకునే మార్గంలో, నిరంతరం నన్ను నడిపించు తండ్రీ !""అంటూ అనునిత్యం విధిగా త్రికరణ శుద్ధితో దైవాన్ని ప్రార్థించాలి,, ఎందుకంటే దైవకృప లేనిదే ఎంతటి మహానుభావులు అయినా,జీవితసత్యాన్ని తెలుసుకోలేరు కదా! అదుపు చేయలేని, నిలకడ స్థితి ఎరుగని" పరుగు గుఱ్ఱం ""లాంటి మనసు మాట వింటూ బుద్దిని ప్రాపంచిక మార్గంలో నడిపిస్తూ,, ధ్యేయం పరమార్థం లేకుండా, దైవా న్ని మరచి, విలువైన మానవ జీవితం వ్యర్థ భోగాల విలాసాల కోసం గడపాలా,?, లేక, అదే బుద్దిని ఆత్మతో సంయోగం చెందిస్తు,, అత్మ విచారణ తో, మనసును, దేహాన్ని, బుద్ది చెప్పిన దారి వైపు మళ్ళిస్తు, పారమార్థిక దృక్పథం తో, దైవభక్తి తో, ఆత్మను పరమాత్మ తో అనుసంధానం చేస్తూ, జీవితాన్ని సార్థక ము చేసు కోవాలా ?? అన్నది జీవుడు వివేకంతో విచక్షణతో, సద్గురువుల ఆశ్రయం తో, సత్సంగ ముతో, దీక్షతో, తపనతో, ఆర్తితో, దైవారాధన తో నిర్ణయిం చి తేల్చుకోవాల్సిన విషయం,! 

"విజ్ఞానం" అంటే గోచరము అయ్యే పదార్థ ము గురించి తెలుసు కోవడం, అనీ,, "జ్ఞానం "అంటే అగోచర ము,, శాశ్వతము, సత్యము నిత్యము,, అయిన ఆ పదార్థ మూలాన్ని, అనగా యదార్థ మును, జీవిత పరమార్థాన్ని, పరంధా ముని సర్వాంతర్యామి తత్వాన్ని, గ్రహించడం అన్నమాట,, !

అలా దేవుడు ప్రతీ జీవునికి, అపురూపం, అద్భుతమైన వివేకాన్ని, జ్ఞానాన్ని, "పలుకు" తో పాటు,ఇస్తూ, దానిని వినియోగం చేసుకునే అవకాశం కూడా మనిషికి అంటే ఈ జీవునికి అనుగ్రహించాడు ,! కావున, మనం, మనకున్న పరిజ్ఞానం తో, మనం రోజూ చేసే జపము, అర్చన, పూజా, స్మరణం, భజన, కీర్తనం, సేవనం, ధ్యానం, గానం, భావన, ఆరాధన, పురాణ శ్రవణం, భగవద్గీత మొదలగు సద్గ్రందాల పఠనం,, ద్వారా, ఇవన్నీ, పరమాత్మ గురించిన,జ్ఞానం పై, చిత్తశుద్ధిని కలిగించి, మనసును దైవంతో లగ్నం చేయడానికే చేసే ప్రయత్నం, మాత్రమే,, కనుక, లక్ష్య సిద్దికై, శ్రమ చేద్దాం, ఈ సంకల్ప సిద్ధికి తోడ్పడే వి, గురుకృప దైవానుగ్రహం తో బాటు, మన అలుపెరుగని, వెనుతిరగని, ధ్యేయం మరువని నిరంతర సాధన  సత్పురుషుల సాంగత్యం, అవసరం!,

గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా," దేహం అనిత్యం, !"అత్మ అంటే బ్రహ్మం నిత్యం,!"అని భావిస్తూ, శరీరం, పాంచభౌతిక స్వరూపంగా, అనుకుంటూ, దైవాన్ని హృదయం లో అంటే అత్మ లో ప్రతిష్టిం చుకుందాం,,

అలా ఆ,సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైన ఆ పరమాత్మ వైభవాన్ని హృదయం లో దర్శించడానికి తగిన స్ఫూర్తిని, భావసంప దను, సాధనా పటిమను అనుగ్రహించమని,, ఆ రాధాకృష్ణునీ, నవనీతచో రుని, బృందావనవిహా రుని, గోపికామనోహ రునీ,,, యశోదాకిశోరుని, నందనందనుని,, వేణు గానవిశారదుని,, గోవర్ధన గిరిధారిని, కాళీయ మర్ధనుని, జగన్నాటక సూత్రధారినీ,, లీలా మానుషవేషధారినీ, శిఖి పింఛమౌళిని,, కస్తూరీ తిలకధారి నీ, కౌస్తుభా లంకారిని, పీతాంబరధారి నీ, నగుమోము గలవాడిని,, ఆ నల్లనయ్య, నీ, ఆపద్భాందవు డిని, విజయసారధిని,, ఆశ్రిత జనవత్సలుని, ఆనందనిల యుని, బాహ్యంలో దుర్లభము, ఆత్మానుభవం వల్ల హృదయ అంతరాళం లో మాత్రమే దర్శింప గల అపురూప సుందర ఆనందకర ము,

జగన్మోహన,మంగళకరమైన దివ్యమైన, శ్రీకృష్ణ భగవాను నీ చరణాల ముందు," శరణం మమ!"" అంటూ భక్తి వినమ్రతతో సాగిలపడి, సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, అనునిత్యం, అనవరతం, అనుక్షణం, ఆ పరందాముని ప్రార్థించి, ఆ భావ సంపదలో, ఆ ధ్యాన తత్పరత తాదాత్మ్యం తో, పరమేశ్వర ప్రసాది తమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకుందాం,,!

ఓమ్ నమో నారాయణాయ! నారాయణా, విశ్వంభర, విశ్వే శా, విశ్వనాథ, ప్రభో, శరణు, ! శ్రీకృష్ణా శరణు!,, దీన జన బాందవా, శరణు,! స్వామీ శరణు!"""సర్వే జనాః స్సుఖినో భవంతు! సమస్త సన్మంగాళాని భవంతు,!"ఓం శాంతి శాంతి శాంతిః!! స్వస్తి!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...