Tuesday, June 11, 2019

మానస సరోవరం

మనిషికి తల వలె,భారతదేశానికి బ్రహ్మే మానస సరోవరం , కూడా తల వంటిది,! అందులో నీ  మెదడు,పరమేశ్వరుని గూర్చి భావించి, చింతించి, తరించే యోగ్యత ను కలిగి ఉంటుంది! , అందుకే తల శ్రేష్టము, అలాగే ఈ పవిత్ర దేవ భూమి కూడా జీవన్ముక్తి కి ఆధార భూత మై పరమ శివుని విహార స్థలంగా అలరారు తోంది..జగత్తులో సృష్టి కార్యం చేయడం కోసం, తగిన శక్తి సామర్థ్యాలు పొందడం కోసం ,  తపస్సు చేసుకోడానికి పరమశివుని నివాస స్థలంగా  ఎన్నుకొని బ్రహ్మ గారు ఈ మానస సరోవరాన్ని నిర్మించాడు,, ఇందులో ప్రతీ పున్నమి రాత్రి, బ్రహ్మ ముహూర్తం లో దేవతా గణం వచ్చి స్నానం చేస్తుంటారు కాని వారిని మహా పాపులు అయిన మానవులు చూడలేరు,!మంచుపర్వత ప్రాంతంగా , తెల్లని దుప్పటి పరచినట్టుగా , తపస్సు కు అనుకూలమైన ఏకాంత ప్రాంతంగా భాసిస్తు ఉంటున్న అపర కైలాస పర్వతం , కూడా  ప్రపంచంలో ఎత్తైన హిమాలయ శిఖరం గా ప్రసిద్ది పొందింది ,, ఇక్కడ చూసేవి , చేసేవి,,రెండే రెండు,! ఒకటి బ్రహ్మ మానస సరోవరం, లో స్నానం!  రెండవది కైలాస శిఖరం దర్శనం ! అంతే ! కాని  ఇది ముక్తి ధామం ! పాండవుల నిర్యాణం ఇక్కడ ఉండే యమ ద్వారం నుండే జరిగింది ..! నిజానికి "బ్రహ్మం "అనేది పరమాత్మ స్వరూపం,! దానికి ఆకారము ,గుణాలు ఉండవు,! అందుకే నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన స్వరూపుడిగా పరమాత్మ ను భావిస్తూ ఉంటారు.! ఇక మానస సరోవరం అంటే, మనసు అనే భావనా సరోవరం, !మనసు ను చూడగలమా,! కదలకుండా పట్టగలమా, !హద్దుల్లో పెట్టగలమా,! అంటే" లేదనే చెప్పాలి,! మనసు అనేది కేవలం ఒక భావన, !సర్వ ప్రాణుల లో ఉన్న శక్తి యొక్క అపురూపం, అమోఘం అద్భుతం అయిన చైతన్య శక్తి స్వరూపం అది !! మనసు హద్దులు గల ఒక  భావనా సరోవరం కావాలంటే దాని చుట్టూ  పదార్థం ఉండకూడదు. !యదార్థం, అంటే సత్యము ,నిత్యము, ఆనందకర ము అయిన పరబ్రహ్మ స్వరూపం తో అవరింపబడి  ఉండాలి,! నాకు బ్రహ్మ మానస సరోవర సందర్శన భాగ్యం శ్రీవెంకట రమణు నీ అనుగ్రహము సాంగత్యము, వలన లభించింది. ! కైలాస శిఖర దర్శన భాగ్యం  అత్యంత సమీపం నుండి లభించింది, కాని కైలాస శిఖర పరిక్రమన భాగ్యానికి నోచుకో లేక పోయాను, శివానుగ్రహం అంతవరకే ఉంది ! ఆ సరోవరం లో చిన్న చిన్న చేపలు, అడుగున కనిపిస్తూ ఉంటాయి ,,అవి మనలో నిరంతర ము  కదిలే కోరికలు అనుకుందాం.! సముద్రం లో లాగా హోరుమనే ఉవ్వెత్తున లేచి పడే కెరటాల ,అలల ఘోష లా , వినపడ డం కాకుండా , చల్లని శీతల పిల్లగాలుల కు మెల్లిగా హాయిగా ప్రశాంతంగా, సరోవర జలాల ఉపరితలం పై జలకన్య, ఒయ్యరంగా కదలాడుతూ నాట్యం చేస్తూఉంటు న్న  రీతిలో  అగుపిస్తూ ఉంటుంది.! ఇప్పుడు ఈ సరోవరం సమాధిలో ఉన్న మన మనసు అనుకుంటే , దానికి ఆ పరమావధి, సిద్దించాలి అంటే ,,దాని చుట్టూ ఉన్న వాతావణం పరిశుద్ధంగా పవిత్రంగా పరమానంద భరితంగా ఏర్పడాలి,! అలాంటి ప్రశాంత వాతావరణం అక్కడ నేను అనుభవించాను ,! ఆ భావ సంపద మనలో కలిగితే, చాలు,,మనసు, తో బాటు బుద్ది, జ్ఞానం, అన్నీ అత్మ లో విలీనమై , మన హృదయ పద్మం  పరమేశ్వరుడు  కొలువుం డే కైలాస క్షేత్రం అవుతుంది,! కాని  అందుకు యోగ్యత కావాలి, !అంటే బాహ్య ప్రపంచం శూన్యం కావాలి.! అనగా బ్రహ్మ మానస సరోవరం చుట్టూ ఉండే ప్రశాంత వాతావరణం ఏర్పడాలి!. అక్కడ చెట్టూ చేమా, పచ్చదనం, ఈగ దోమ క్రిమి కీటకాధులు, నదులు, కొండలు, గుట్టలు, జన సంచారము , పశు పక్ష్యాదు లు , ఇవి ఏమీ మన కంటికి  కానరావు, !కనపడేది, రాత్రి అయితే చంద్రుడు, !పగలు అయితే సూర్యుడు,! అల్లంత దూరాన సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ధవళ కాంతులతో దశ దిశల్లో , మెరిసి పోతూ, సాక్షాత్తూ  కైలాస నాథుని పరందా మము అయిన కైలాస పర్వతం దివ్యంగా భవ్యంగా అద్భుతంగా యాత్రికులకు పరమానంద  భరితంగా ఆగుపిస్తూ ఉంటుంది, ! సిద్దులు, యోగులు, దేవతలు, కిన్నర కిపురుష ,, గంధర్వ యక్ష కాది దివ్య పురుషులు, శివ, విష్ణు భక్తులు, దివ్య శరీరాలతో , అదృశ్యరూపంలో  అక్కడ తపస్సు చేస్తూ సంచరిస్తూ ఉంటారు, !నిజానికి అది యమ ద్వారం,!పరీక్షిత్తు వలె ,, మనిషి కూడా తాను చావబోయే ముందు , ఈ స్థలాన్ని దర్శించి,,, శేష జీవిత ము లో  ,హరి గాథలు వినడం, హరి నామ స్మరణ చేయడము, సత్సంగాన్ని ఆశ్రయించడం లాంటివి చేస్తాన నె సత్సంకల్పం, ధృఢ నిశ్చయంతో ఇంటికి,, తిరిగి రావాలి, !శరీరం ఇంటికి వచ్చినా, మనసు మాత్రం బ్రహ్మకు ఆలవాలమైన పవిత్రమైన పరమానంద కరమైన , పరమ ప్రశాంతమైన సరోవరం గా మారి తీరాలి!.లేకపోతే ఒక వినోద యాత్ర చేస్తూ,, సర్వాంతర్యామి అయిన పరందామాన్ని అవహేళన చేయడం అవుతుంది. !అది  అందరూ అమాయకంగా, అజ్ఞానంతో అనుకునే సామాన్యమైన స్థలం కాదు,! దేవ భూమి,! దేవతలు ప్రచ్చన్నంగా దైవారాధన చేస్తూ ఉండే, పరమ పవిత్ర కైలాస గిరి పరిసర ప్రాంతం,!, రక్తం గడ్డ కట్టించే, శీతల వాతావరణం అక్క డి ప్రత్యేకత  !, తట్టుకొని నిలిచావా,, ,నీ జన్మ  సార్థక ము అవుతుంది,,! అదే పరమేశ్వరుని పరమ ధామం !అక్కడ నే కాదు ,, దానికి వందల కిలోమీటర్లు దూరం లో ఉంటూ చూస్తే కూడా ఆ మహోన్నత హిమగిరి శిఖరం,, దేదీప్యమానంగా కోటి చంద్ర ప్రభలతో, కన్నుల పండువుగా దర్శించు కొనే భాగ్యం,,, పరమశివుని కృపతో కలుగుతుంది,! నిజానికి అలాంటి అద్భుత అపురూపమైన శివసాన్నిద్యంలో మనం   కాలు మోపాలంటే శివానుగ్రహం కావాలి..! ఇలా శివయ్య తత్వం తెలిస్తే, తెలుసుకుంటే తప్ప, ఆ బ్రహ్మానంద స్తితి నీ పొందలేము,,! మరి ఏమీ లేని చోట ,ఏముందని బ్రహ్మ గారు ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు ? అంటే మానస సరోవరం చుట్టూ ఉన్నవి వస్తు గోచరం కాదు,! అంటే  ఉండేవి జీవపదార్థాలు కాదు,! అనగా యదార్థ జ్ఞానం తో, అత్మ పరిశీలనతో, ఆత్మావలోకనం చేస్తూ, ఆత్మ పరిశోధన చేసుకుంటూ పొందే చిదానంద పరబ్రహ్మ గురించిన అనుభవ స్థితి.. అది!  అక్కడ చూడటానికి ఏమీ లేదు, !ఏమి చూడాలి , ?!ఎక్కడ చూడాలి ?? అంటే  కళ్ళతో చూడటం  కాదు, !అవి హద్దులు గల మాంస పూరిత చక్షువు లు!. శరీరం లో నీ సర్వాంగ ములకు అందము ,ఆనందము అనుభవ జ్ఞానం తో బాటు హద్దులు ఇచ్చాడు,, భగవంతుడు,, అతడు సర్వజ్ఞుడు. అతడిని దర్శించాలంటే , ఒక్క మనస్సుతో మాత్రమే  వీలౌతుంది.. అది కూడా కళ్ళు మూసుకొని,, మనలో అంతర్యామిగా ఉంటూ,, ఆత్మలో తిష్ట వేసుకుని ఉన్న పర దైవం గురించి అన్వేషణ చేస్తూ ఉండాలి.. అప్పుడు ఈ మనస్సు,, అనబడే మదపు ఏనుగు తనను బంధించిన సంచిత కర్మ బంధాలు అనే బలమైన తీగలను , తెంపి,ఈ హద్దులు, బంధాలు, శారీరిక,ప్రాపంచిక,, లౌకిక వాసన లు కూడా దాటి పోగలదు! ఇది జీవునికి నిజమైన స్వేచ్ఛ లభించింది అనుకోవాలి..! అయితే,, ఇది కేవలం ఆత్మానుభవం తో, నిరంతర సాధనతో, పరమాత్మ పై అనురక్తి తో, దైవ భక్తితో మాత్రమే సాధ్యం!, అనగా" సత్" అనగా సత్యము ,నిత్యము, శాశ్వతము, అనీ "చిత్" అనగా పరమాత్మ ను గురించిన జ్ఞానము అనీ, "ఆనందము "అంటే పరబ్రహ్మ తత్వ బ్రహ్మానంద అనుభవాల పరాకాష్ట స్థితి అనీ భావించాలి,! ఇక్కడ సత్యము ,నిత్యము, శాశ్వతము గా ,,, మనకు అల్లంత దూరాన కనుచూపు మేరలో అగు పిస్తున్న కైలాస పర్వతం గా భావించాలి, !ఎందుకంటే సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత , యుగ యుగాల పర్యంతం, ఉండేది ఆ భవ్య ము, దివ్యము అయిన శివస్వ రూపం ఒక్కటే. !ఇక రెండవది చిత్, అంటే జ్ఞానం !, ఇది ఆత్మ ప్రకాశం తో మూడవ నేత్రం తో దర్శింప గలిగేది.! కళ్ళ ఆటు కైలాస నాథుడు అయిన హరుడు,! ఇటు,  శ్రీహరి!  శ్రీమన్నారాయణ మూర్తి , సూర్య భగవానుని రూపంలో,  దర్శించ వచ్చును , తన తేజోవంతం అయిన తన కిరణాలతో సకల జగత్తుకు, ప్రాణికోటికి నూతన తేజాన్ని వెలుగును ఐశ్వర్యాన్ని ప్రాణ శక్తిని , ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తూ, జీవుల జీవన చర్యలను ప్రభావితం చేస్తూ ఉన్న  ఆ సూర్య భగవానుని , శ్రీహరి, విశ్వరూప ప్రదర్శన సందర్శనా వైభవాన్ని , అత్మ జ్ఞానంతో గ్రహిస్తూ,, హరి హరుల అభేదా న్నీ అనుభవ పూర్వకంగా అర్థం చేసుకొన వచ్చును.! ఇక మూడవ అంశం,, అనందం !.ఇది అక్కడి పరిసరాలలో యాత్రికుల పాలిట  తరగని పెన్నిధి వ లె  అణువణువునా నిక్షిప్తం అయి ఉంది.! మనసుకు ఆహ్లాదాన్ని, హృదయానికి ప్రశాంతత ను, ఆత్మానుభవం ద్వారా ఆస్వాదిస్తూ, ప్రతిస్పందిస్తూ ఉండేది మనలోని అనందం. అనే మధురానుభూతి ! ఇదే సత్యం,! అంటే శాశ్వతం,! ఇదే శివం !అంటే జ్ఞానం!, ఇదే సుందరం!, అంటే అనందం!.. జీవుడు తన మనస్సు ను ఆత్మలో నిక్షిప్తం చేస్తూ ఆత్మానుభవం తో ,నిశ్చల స్థితిలో ,తదేకంగా దైవారాధన చేస్తూ  పోతూ ఉండే ,సాధనా సంపత్తినీ,, దైవానుగ్రహం తో మాత్రమే సంపాదించు కోవచ్చును.! భగవద్గీత లో మన గీతాచార్యుడు చెప్పినట్టుగా,,"" మన్మనా భవ మద్భక్తో, మద్యాజీ మాం నమస్కురు,! మామే వైష్యసి యుక్య్యై వం, ఆత్మానం మత్పరాయాణః ,"" అనగా ,,""! ఓ అర్జునా ! నాయందే నీ మనసును  లగ్నము చేయుము!. నా భక్తుడవు కమ్ము.! నన్నే పూజిం పుము.! నాకు నమస్క రింపుము.! ఈ విధముగా,ఆత్మను నా యందే నిలిపి మత్పరాయనుడ వైనచో, నీవు నన్నే పొందగలవు.!"" అంటూ శరణాగతి తత్వాన్ని, ఆత్మ సమర్పణ విధానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సవివరంగా బోధించాడు. ఆ విధంగా, ఆత్మలో బ్రహ్మ పదార్థాన్ని ఆవిష్కరిస్తూ ఉంటే, జీవుడు , అలౌకిక ఆధ్యాత్మిక,సచ్చిదానంద అనుభవ స్తితిని పొంద గలడు ! ఇది మానస సరోవర సందర్శన భాగ్యం పొందిన పుణ్య యాత్రికు లు ,,తమ భావ సంపదను పెంపొందిస్తు, జీవునికి  పరమాత్మ తో అనుబంధాన్ని దృఢం చేసుకోవాల్సిన సదవ కాశాన్ని ,భగవంతుని కారుణ్యం గా ఆస్వాదించాలి !,,,శంకరాభరణం  సినిమాలో ,శంకరశాస్త్రి గారు  తన "నిద్రాస్తితి లో కూడా, అంతరంగం లో ఆత్మానుభవం ద్వారా ఆత్మానందం పొందుతూ, "మానస సంచరరే ,,! బ్రహ్మణి,, మానస సంచరరే ,,,!  అంటూ భావ రాగ తాళ యుక్తంగా ఆలపించడం ,అతడి నవనాడులు రాగభావ తాళ యుక్తంగా ప్రతి స్పందిస్తూ, బ్రహ్మానంద స్థితిలో  పరవశిస్తూ ఉండడమే,! అంతే కాదు, తన నాదో పాసన శక్తి వలన , మనసును పరబ్రహ్మ స్వరూపం లో సంచరింపజేస్తూ , లయింపజేస్తూ," అనందో బ్రహ్మ" లా జీవించాడు, ,, అతడు తన హృదయంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ ,శిఖిపించమౌళి, నీ రూపాన్ని,,.,మహనీయమైన కృష్ణ కపొలాల కాంతులను, శ్రీకృష్ణ ప్రియ లక్ష్మీ దేవి అందాల, ఆనందాల, శృంగార రస వాహిని లో ఓలలా డడం చూస్తూ  ,,ఆత్మానందం పొందుతూ ,, ఆ భావం లో రమిస్తూ, దర్శిస్తూ,  ఆనందించాడు !.నాద బ్రహ్మ గా భాసిల్లే శంకర శాస్త్రి గారి లాంటి భక్త శిఖామణి ,  నిజమైన ఒక పరమహంస,,!. రామకృష్ణ పరమహంస. లాంటి ఉపాసకుడు, !పరమాత్మకు సన్నిహితుడు,!, బాహ్య ప్రపంచం తో సంబంధం లేనివారు,! ఈశ్వరుని కూడా శాసించే స్థాయికి ఎదిగినవారు..! దీని ద్వారా మనం గ్రహించ వలసింది, ఏమంటే, మనిషి ఘోరమైన సంసార మునందు, ఉంటూ కూడా నిత్య కర్మ లు చేస్తూ , తామరాకు పై నీటి బుడగ లా ,, జీవిస్తూ , మనసును పరమాత్మ పాదాల యందు స్థిరంగా ఉంచవచ్చు ను! ఇదే భావాన్ని, ఆటు విష్ణువు, ఇటు శివుడు తన తత్వాల ద్వారా సూచిస్తూ ఉన్నారు.!. విష్ణువు తన పడక పానుపు గా చేసి పవలించేది కాలసర్పం పై,,! శివుడు మెడలో పూలమాల గా ధరించేది ఇదే కాల సర్ప మును ! అలాగే ఈ జీవుడు కూడా పుడుతూనే" మరణం" అనే కాలసర్పాన్ని తలపై ఎత్తుకొని , మెడలో వేసుకొని, అది ఎప్పుడు తనను కాటేస్తుం దొ  కదా !""అని భయంతో జీవిస్తూ ఉన్నాడు, ఇక విష్ణువు ఉండేది పాల సముద్రం లో, శివుడు ఉండేది స్మశానంలో, అయితే ఈ  జీవుడు ,, ఉండేది సంసారం అన బడే భవ, దుఃఖ సాగరం లో,,!! ఇదే సుఖమని, భ్రమలో జీవిస్తూ, భావిస్తూ, గమ్యం లేకుండా జనన మరణ చక్రంలో చిక్కుకొని జీవుడు భ్రమిస్తూ నే ఉంటున్నాడు.! దానికి ముగింపు జీవుని చేతిలోనే ఉంది,! మనసును ఇహలోక సుఖాల వైపు కాకుండా, అంతర్ముఖం చేస్తూ," పరం" వైపు దారి మళ్లించా లి,,! "కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు ,! అన్నది పరమ సత్యం ! వేద వాక్కు కూడా ! వారు మహా పురుషులు,పరమహంస లు మహాత్ములు , కూడా అవుతారు !!""  వేదభూమి, కర్మభూమి, పుణ్య భూమి గా కీర్టించబడి, భారత మాత గర్వించదగిన ఎందరో మహానుభావుల జన్మస్తలం గా , శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి దివ్య పురాణపురుషు లు జన్మించిన పవిత్ర భూమిగా పేరు పొందింది మన దేశం !  వారు పరమాత్మను ఆరాధించి , ఆ ఆధ్యాత్మిక అలౌకిక శక్తి తో అనుకున్నది సాధించారు,! ప్రయోజనాన్ని తోటివారికి, మానవాళి అభ్యున్నతికి అందించి , భారతీయుల  హృదయాలలో    చిరస్థాయిగా నిలిచారు.! అందుకే  మనం జీవుడి తరఫున మనసును వెడుకుందాం!!" ఓ మనసా! ఈ జన్మలో ఈ జీవుడు, తన కర్మ బంధాలను తొలగించుకొని సద్గతి పొందడాని కి , నీ సహాయం, అవసరం,! కావున మా ప్రార్థన మన్నించి, దయచేసి దీన హీన స్థితిలో దిక్కు తోచక విచ్చలవిడిగా చరిస్తూ ఉన్న ఈ , జీవు డు ఉద్దరించ బడాలంటే, నీవు ""పరమాత్మ పాద కమలాలు "అనే బంగారు పంజరం లో పరమహంస వలె తిరుగుతూ ఆ చరణ ద్వయ ధ్యానామృతాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉండు ! ఇది నా మనవి ! ఓ మనసా ! నిన్ను శాసించే శక్తి యుక్తులు లేని వాడను,, వేడుకోవడం తప్ప ఏమీ చేయలేని అసమర్థుడ ను,,, నీవు అలాంటి యోగ్యత సంపాదిస్తే ,నా జన్మ ధన్యం అవుతుంది ,!"" అంటూ మనసుని అనున యించాలి,,! అలా ముక్తిని చేరుకునే ప్రయత్నం సాధనా చేయాలి ,!.. దానికి పరమాత్మ కృప, తోడు కూడా కావాలి,!, దైవ బలం లేనిదే జీవుడు ఉద్దరింప బడడు !అందుకు ,,""ఓ పరమేశ్వరా ! అన్యధా శరణం నాస్తి ! త్వమేవ శరణం మమ !, !""అంటూ శరణాగతి చేయాలి ,! ఈశ్వర తత్వం చింతిం చాలి! మదిలో హృది లో దేవుని నిలపాలి!,, జీవునిలో దేవుడు కొలువై ఉండాలంటే అందుకు తగిన అర్హత యోగ్యత భావ సంపద ను అనుగ్రహించమని పరందాము నీ ఆశ్రయించాలి ,!!అందుకోసం ,,""తండ్రీ! చరాచర జగన్నాథ!, పాహిమాం,! హే ప్రభో ,,రక్ష మాం !""అంటూ ఆత్మ నివేదన చేయాలి,! నారాయణా , గోవిందా ! శరణు !  నిన్ను అలా భావించి , ఆరాధించి,,సేవిం చే ,శక్తిని ,స్ఫూర్తిని యోగ్యతను, నీపై అనురక్తి నీ,అనుగ్రహించమని కైలాస నాథుని,, మానస సరోవర గౌరీ మాతను,! గోపాలకృష్ణ భగవానుని, భవా నీ, సరస్వతీ, మహ లక్ష్మీ మాతల ను ,మనసారా త్రికరణ శుద్ధితో , వేదుకుందాం ! హరే క్రిష్ణ హరే కృష్ణా ! స్వస్తి !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...