Friday, September 20, 2019

ఆలోచన

Dallas, Sept 17, 2019

"కాదేదీ కవిత కనర్హం!"" అన్నాడు ఒక మహాకవి ,!__ అంటే మనం చూసే ప్రతీ వ్యక్తీ, వస్తువు కొంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది అని అర్థం, ! కవితా ధోరణి లో చూస్తే, అది అందంగా అగుపిస్తెనే ,దృష్టి దానిపై పెట్టవచ్చు ను ,, అంటే మనసును ఆకర్షించే విధంగా ఆ విషయం ఉంటుంది,  !!ఈ రోజుల్లో కనిపించే వ్యాపార ప్రకటన ల వలే, చూస్తే చాలు, కొనాలని ఉంటుంది, అయితే తప్పు "ప్రకటనది" కాదు, మనలో కలిగే అలోచనదే తప్పు,,! అందుచేత, ప్రకృతి లోని వస్తువు,వ్యక్తుల  అందాలను, ఆనందంతో ఆస్వాదించే హృదయం లేకపోవడం ఒక రకంగా దురదృష్టం,!,5 నిముషాలు సూర్యాస్తమయం, లేదా సూర్యోదయం చూస్తూ, ప్రకృతి కాంత సోయగాల లో , పరమాత్మ వైభవానికి, దానిని చూస్తూ పులకిం చే మనసును, సమయాన్ని, అవకాశాన్ని కల్పించి న పరందామునికి కృతజ్ఞతగా నమస్కరించ లేకపోతే తప్పు మనదే అవుతుంది కదా !!, ,
కానీ అనుభవించే అవకాశం ఇచ్చినా కూడా, ఉపయోగించుకొలేకపోతే అది  మన మూర్ఖత్వమే అవుతుంది,,!
ఎవరూ మనల్ని గమనించడం లేదంటే, మనిషి ప్రకృతి , ప్రవర్తన మరో విధంగా ఉంటుంది,! తాను ఒంటరిగా ఇంట్లో ఉన్నా, బయట ఎవరూ చూడలేని స్థలం ఉన్నా కుదురుగా ఉండలేడు. ,
,,,,, ఏ పనీ లేకుండా ప్రశాంతంగా ఉండడం  ఎవరికైనా చాలా కష్టం !, ఎందుకంటే తనకి ఇష్టమైనవి విడిచి, అలవాటు లేని పరిస్తితి నీ భరించడం దుర్భరంగా, భయంగా, ఎదో పోగొట్టుకున్న విధంగా ఉంటుంది, కదా ! ఆ స్థితిలో మనసు కు నిలకడ ఉండదు,, తన వారి మీద, లేదా తాను చేయాల్సిన పనుల మీద ఆరాటం కోరిక, దిగులు తో, తప్పనిసరిగా ఆ ఏకాంతాన్ని దూరం చేసుకొనే ప్రయత్నం చేస్తాడు,! అయితే ఫోన్ లేదా టాబ్ పై గూగుల్ లో ఇష్టమైన వి చూస్తూ, చాటింగ్ చేస్తూ, పాటలు వింటూ కాలక్షేపం చేస్తుంటాడు,!" పుష్పక విమానం "సినిమాలో కమల్ హాసన్ పాత్ర వలె.. ట్రైన్ చప్పుడు లేకుండా నిద్ర పట్టనట్టు, అలవాటు పడ్డ ప్రాణం, రుచి మరిగిన దానికై కొట్టుకుంటుంది,!,,

అందుకే మనిషి తీరు, అతడు పెరిగిన సమాజం తీరుపై ఆధారపడి ఉంటుంది..
,, ఒక్కటి మాత్రం నిజం,! ఒంటరితనాన్ని భరించలేక పోవడం, పిరికితనం తో సమానం !! మనస్సు కు, శాంతిని, శరీరానికి కాంతిని ఇచ్చే, ధ్యాన యోగ సాధనా శక్తిని ఇచ్చే ప్రశాంత వాతావరణానికి , దూరంగా పారిపోవాలని అనుకోడం, కేవలం తనలో వివేక జ్ఞానం లోపించడం వల్ల నే కలుగుతుంది,!,,,

పైన, జ్ఞానజ్యోతి వలె, దివ్యంగా  ప్రకాశిస్తూ, తన దినచర్యల ను గమనిస్తూ, తన ఆయువు లో ఒక రోజు భాగాన్ని తగ్గిస్తూ ఉంటున్న  "కర్మ సాక్షి " ఆ సూర్యభగవానుని కళ్ళు కప్పలేని , పరిపక్వత కానరాని అనిశ్చిత మనిస్తితి లో ఉంటున్నాడు ఈ రోజుల్లో సగటు మనిషి..!!
తనలోన ఉంటూ తన దినచర్యలను నియంత్రిస్తూ,, గత జన్మ  కర్మానుసారంగా విధిగా , వివిధ రకాల పనులను  చేయిస్తున్న అత్మ సాక్షిని గురించి కూడా ఆలోచిం చే సాహసం చేయడు. ఎందుకంటే "అహం "అడ్డు వస్తుంది,
,, ఆ విధంగా అంతర్లీనంగా, అంతర్వాహిని గా అంతటా ఉన్న దైవ బలాన్ని గుర్తించకుండా , ఏ కార్యమైనా తన నిర్వాకం, తన ప్రజ్ఞ ప్రతిభ పాటవాల వల్ల మాత్రమే జరుగుతూ ఉన్నాయని  భ్రమిస్తూ" అత్మ సాక్షి " ప్రాభవాన్ని గురించి ఆలోచిం చే దుస్సాహసం చేయ డం లేదు,,,,
,,, అనుదినం ప్రాణుల చర్యలను పర్యవేక్షిస్తూ, తదనుగుణంగా ఉపయోగించే శక్తినీ, ప్రజ్ఞను,, అనుభవించే ఆయువును, సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్న కర్మ సాక్షిని, ఏ రోజు నా మరవకుండ తలచేవారిని, "ఏకాంతం" బాధించదు,,! అలాగే  తాను చేస్తున్న పని లో మంచి చెడులను, పాప పుణ్యాలను బేరీజు వేస్తూ, సాక్షిగా చూస్తూ, జీవన జ్యోతి లా వెలుగుతున్న అంతరాత్మ, ను ,ఆత్మ సాక్షినీ ,అంతరంగాన్ని చిత్తశుద్ది తో భావించేవారు మాత్రం  ఒంటరితనాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. !
,, అంతేకాదు, అలాంటి భగవద్ తత్వ విచారణ చేస్తూ జీవితాన్ని ఒక జ్ఞాన యజ్ఞం గా చింతిస్తూ ఉండేవారికి, చుట్టూ వందలమంది మధ్యలో పలు సమస్యలతో ఉన్నా, భయపడరు,! బాధపడ రు,! చీకాకు పడరు,,! ఎందుకంటే అంతమంది లో ఉంటున్నా వారు సచ్చిదానంద స్వరూపులై, అంతరంగం లో ఆత్మానందాన్ని అనుభవిస్తూ, పరమాత్మ వైభవం లో రమిస్తూ బ్రహ్మానంద భరితులై ఉంటారు,! ప్రాపంచిక విషయాల లో, పరమాత్మ వైభవాన్ని దర్శిస్తూ వుంటారు వారు.. ఈ ఆధ్యాత్మిక అనుభవం ,పరమానందం నిరంతర సాధన, దైవారాధన  వలన, మనో నిబ్బరం తో మాత్రమే ప్రాప్తిస్తుంది., కదా!!
,,,, బురదలో  అంటకుండా నడవడం కష్టమే,! నీటిలో తడవకుండా మునగడం కష్టమే,! కష్టాల కడలిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, పరమాత్మ పై మనసు నిలపడం కూడా కష్టమే,,!
,,,,అంతేకాదు,!,ఏకాగ్రత తో శ్రీహరిని ద్యానించ డం కష్టం!, దైవ ధ్యానం తో ఆలయ ప్రదక్షణ లు చేయ డం కష్టం ! పది నిముషాలు , నిష్టగా, దైవాన్ని చిత్తశుద్ది తో పూజించ డం కష్టం!; అంకితభావం తో అర్చన చేయలేము ,!, అంతటా, అందరిలో దైవాన్ని దర్శించే జ్ఞానాన్ని పొందలేము,!, లోన ఉన్న ఉన్న అంతరాత్మ ను గుర్తించలేము,!, పైన, చుట్టూ, అంతటా నిండి ఉన్న సర్వాంతర్యామి తత్వాన్ని అర్థం చేసుకోలేము,,!, రాగయుక్తంగా శ్రీకృష్ణ లీలలు గానం చేయలేము,! గోపాల కృష్ణ భగ వా నుని  ముగ్ధమోహన రూపాన్ని కనులారా ఏ విగ్రహం లో భావి స్తూ, హృదయంలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేము! ,, కావున, ఓ
భగవంతుడా , !అనంత గుణ సంపన్నుడ వైన నీ అద్భుత కథలను చిత్రించలేము,! కవితలల్లి నిన్ను కీర్తించలేము, కూడా,! నిన్ను ఏ రకంగా కూడా మెప్పించలేని అసమర్తులం మేము !  కేశవా,! ముకుందా, !అచ్యుత! అనంత,,! భగవన్,,!,,,, కానీ మాకు చేతన య్యేది ఒక్కటే స్వామీ,! అది,
" నారాయణా !"అంటూ చేతులెత్తి మ్రొక్క డం !! "గోవిందా "అంటూ రెండు చేతులతో తాళం వేస్తూ, ఆడుతూ, మధురంగా పాడుతూ, మేము నీ భజన చేయగలం;,! స్వామీ,! కావున మా దీనస్థితిని గమనించి, మాపై కనికరించి,, దయ ఉంచి మాకు ఆ పాటి జ్ఞానాన్ని, నీ నామ గానం తో, భజించి తరించే మహద్భాగ్యం ప్రసాదించు తండ్రీ,! నీ కడగంటి కంటి చూపు, మా పై పడితే చాలు, అదే పదివేలు! పరమేశ్వరా,! పరందామా , !పరమాత్మా,! శరణు,! హరే క్రిష్ణ హరే కృష్ణా ,!! స్వస్తి!

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...