Friday, September 20, 2019

భగవద్గీత

Dallas, Sept 19, 2019

"భగవద్గీత "  అంటేనే అది కేవలం వృద్దుల కు, సన్యాసులకు, హరిద్వార్, హృశికే శ్ లాంటి ఆశ్రమాలలో, లేదా యాత్రా స్థలాల్లో,దేవాలయాల కు మాత్రమే  పరిమితం కాదు ,!పండితులచే పఠన చేయబడే "సద్గ్రంథం" అని మాత్రమే అని పరిగణించడం ఏ మాత్రం సబబు కాదు,! మనిషిగా పుట్టాక, దైవ ప్రసాదితము, అపురూపం ,, అమూల్యం, ఉత్కృష్ట ము  అయిన మానవ జన్మను సార్థకం లేదా చరితార్థం చేసుకోడానికి వినియోగించే దివ్య గ్రంథం "భగవద్గీత!!"
,,, నిజానికి  అర్జునుడు పుట్టుకతో మనిషి,, లోపాలు, బలహీనత లు ఉండడం సహజం! ప్రకృతి ధర్మం గత జన్మ కర్మ పరిపాకం !; అతడు, తన అన్నదమ్ముల తో బాటు ధౌమ్యుడు అనే గురువు వద్ద గురుకులాశ్రమం లో శుశ్రూష చేస్తూ, సకల విద్యలలో రాణించాడు!
, విలువిద్యలో మాత్రం ద్రోణాచార్యుని ఆశ్రయించి, సవ్యసాచి గా పేరుగాంచాడు,!
అయితే ఇవన్నీ, నేడు స్కూళ్ళలో, కళాశాలలో నేర్చే వృత్తి విద్యల వంటివి,! విజ్ఞాన, సాంఘిక, రాజకీయ శాస్త్రాలు నేర్చుకోవడం వంటిది! ఇవన్నీ నేర్చాడు అర్జునుడు ,,అప్పటి దర్మానుసారంగా !!,, అనుమానం లేదు,,! నేటి విద్యాలయాలలో వేమన సుమతి, భర్తృహరి లాంటి నీతి పుస్తకాల బోధన లేనట్టే,, ఉన్నా అవి  ఒంటబట్టని అర్జును నీ వలే, నేటి విద్యార్థికి కూడా, అందుబాటులో
,  నైతిక విలువలు లేవు,! జ్ఞాన కర్మ భక్తి విషాద యోగాలు లేవు,!
, మనిషి సుఖ జీవనానికి శాంతికి, భంగం కలిగించే దుష్టశక్తులను ఎదురించే సామదాన బే ద దండ ఉపాయాలు లేవు,!
, ,, అందుకే తన ముందే , కళ్ళ ఎదుటే, ఎవరి కో జరుగుతుంటే చూస్తూ, ఏమీ పట్టనట్టు గా వెళ్లి పోయేవాడు, "మహాపాపి ", అవుతున్నాడు ,,! అన్యాయం చేస్తున్నవారు ఎంత పాపాత్ము లో ,,అంతే పాపం, ప్రేక్షక పాత్ర నిర్వహించే వారికి కూడా ప్రాప్తిస్తుంది కదా,,!!
, ,,,అలాంటిది తమకే ఘోరంగా సహించ రాని, భరించలేని అన్యాయం జరుగుతుంటే, అందరూ "అయ్యో! పాపం "అంటూ జాలి పడుతూ ఉంటే, తప్పించుకు తిరగడం మంచిపనేనా,?? భావ్యమా? నిజానికి ఒకరు తన పరిస్తితి పై సానుభూతి చూపడం లేదా జాలి పడటం కంటే మించిన దౌర్భాగ్యం ,మనిషి జీవితంలో మరొకటి ఉండదు కదా,,
ఇదిగో, ఇలాంటి దురవస్థ లో పాండవులు ఉన్నారు ఇప్పుడు,,,
, "కంసుడు, పూతన" లాంటి ఘోర రాక్షసులను ఎందరినో సునాయాసంగా, తన బాల్యం లోనే హతమార్చిన గోవిందుని కి,, ఈ మానవాధములు, ఆ "దుష్ట చతుష్టయం"" ఒక లెక్కా,? చెప్పండి !!"
,,,""అన్యాయం ఎవరికి జరిగిందో, వారే దానిని నిర్జించాలి,! సొమ్ము ఎక్కడ పోయిందో అక్కడే వెదకాలి! అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించు కోవాలి,! దమ్ము లేనివాడు, పిరికితనం తో పారి పోవచ్చు , గాక !!, తనకన్నా బలవంతునితో  పోరాడవలసి వస్తే, దేవేంద్రుడు చేసే మొదటి పని యుద్ధరంగం నుండి పారిపోవడం,,! మహావిష్ణువుకు పాహిమాం రక్షమాం! ప్రభో! అంటూ శరణాగతి చేయడం"కదా,,!,,,,,,
ఇప్పుడు ఆ ఇంద్రుని కొడుకు , అర్జునుడు కూడా చేస్తున్న పని అదే. !
,,, దుష్ట శక్తులను అలానే విడిచి పెడితే, అవి ఇంకా ప్రళయ తాండవం చేస్తూ, మారణ కాండను సృష్టిస్తాయి, విధాత, శ్రీకృష్ణుడు, భూమిపై అవతరించిన ఉద్దేశ్యం ఆ పాపాత్ముల పని పట్టడానికి మాత్రమే, కదా,!
, "గీత "ఉపదేశం వింటూ, "ధర్మం ,న్యాయం, నీతి""లాంటి సూక్తులు వల్లిస్తూ,  ఒక కాషాయ వస్త్రం కప్పుకొని, సమస్యలకు దూరంగా వెళ్ళి పోవడం లాంటి "మనో దుర్బలత"ను మన భగవద్గీత నేర్పడం లేదు. అని ముందుగా మనం తెలుసుకోవాలి,,!!
, ఏ వ్యక్తికి పిరికితనం వద్దు!;, బేల తనం అసలే పనికిరాదు;, మొహమాటం, నిర్లిప్తత, అలక్ష్యం, భయం, ఇలాంటివి పనికిరావు; సమస్యలకు , భయపడుతూ, చావలెక, బ్రతకలేక,రోజూ ఘోరంగా నరకయాతన, మనో వేదన పడేవారు, సమాజాన్ని పాడుచేస్తారు , స్వామి వివేకానందుడు చెప్పింది ఇదే,, మహాకవి శ్రీ శ్రీ చెప్పింది ఇదే! ఉత్తేజం ఉత్సాహం, సంకల్పం లేని యువకులు , చావుకు సిద్దంగా ఉంటున్న ,చేతగాని ముసలివా రి తో సమానం! అన్నారు,,
,," శ్రమ పడుతూ, బాగు పడాలి,! అదే కృషి తో పదిమందికి ఉపయోగపడుతూ, వారిని బాగుచేయ్యాలి,!
,, తాము సంతోషంగా బ్రతకాలి,! ఇతరుల సంతోషానికి సహకరించాలి,!
శ్రీకృష్ణుడు సూటిగా ప్రశ్నించాడు,,
, ఓ అర్జునా,! నీకు మా చెల్లెలు సుభద్రను ఇచ్చింది, పాశుపత దివ్యస్త్రాలను ఇప్పించింది,, ఆపదల అవమానాల నుండి రక్షించింది, నీలో ఇంత దిగజారుడు తనం, చూడటానికి కాదు, సుమా!
, ఐదు ఊళ్లు చాలా?,, సన్యాసి వై మళ్లీ అదే అడవిలో కి  పోతావా,? మళ్లీ భిక్షా పాత్ర పడతావా?? నీవు
పుట్టింది క్షత్రియ వంశము, లో,,! కానీ, చూపేది జంతు ధర్మం,,! ఇది పనికిరాదు,!
లే ! లేచి నిర్భయంగా నిలబ డి వీరోచితంగా పోరాటం, చెయ్యి ! నేను ఉన్నాను,, కదా ! నీవు ఊరక ఉన్నా, నేను చూస్తూ ఉండను !వీరి అంతు చూస్తా ను,!!" అంటూ కదన రంగం లో భుజం తట్టి ఉత్సాహపరిచింది కేవలం అనాడు అర్జునుని మాత్రమే కాదు,,! ఆ బోధ, రాబోయే యుగాలకు, తరాలకు చూపించే తక్షణ కర్తవ్యం,!!
, ""దేవుడిచ్చిన ఈ శరీరంలో ప్రవహించే రక్తంలో, అంతర్వాహిని గా జ్ఞాన సరస్వతి దేవి ఉందని గ్రహిం చాలి ! అది అత్మ బోధ చేస్తూ, మనిషికి మూడవ నేత్రంగా పనిచేస్తూ,ఎప్పటికప్పుడు చేయాల్సిన పని, దైర్యం, కర్తవ్య నిష్ట, ధృఢ సంకల్పాన్ని చిత్తశుద్ది నీ, ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది,!
అందుచేత, విజయమో, వీర స్వర్గ మో తేల్చుకో, వాలి!
పోరాడితే పోయేదేమీ ఉండదు, భయం తప్ప,!
ఏడవకు!, నీ వారిని ఏడ్పించకు!,, కన్నీరు అపజయాన్ని ,,జంతు ధర్మాన్ని,, సూచిస్తే, అతడి మనో,దైర్యం, జయాన్ని , శుభాన్ని, జీవిత పరమార్థాన్ని సూచిస్తాయి,!
", ప్రాణం ఉన్న శవంగా ఉంటావా, వీరునిగా చక్కని కీర్తి తో చిరంజీవి గా పేరు తెచ్చుకుంటా వా ?? తేల్చుకో,!!
జీవితంలో పిరికితనం తో బ్రతికే వాడు, చచ్చిన వాడితో సమానం,!
జంతువు కూ, మనిషికి తేడా జ్ఞానం,!
ఆ జ్ఞానంతో "చిరునవ్వే ఆయుధం "గా, ఫలితం ఆశించకుండా, కర్తవ్య నిర్వహణ లో ప్రాణత్యాగం అయినా చేసే ధృఢ చిత్తంతో యుద్దం చెయ్యి,!,,
అని పరమాత్ముడు అనాడు చేసిన ఉద్బోధ నేడూ, మనకూ పనికి వచ్చేదే,!
నిర్వీర్యం, నిస్తేజం, నిర్లిప్తత,, ఇవి మనిషికి శోభిం చే లక్షణాలు కావు,! అత్మ విశ్వాసం, పట్టుదల,, దైవం పై నమ్మకం, మనిషి మనుగడకు సుఖ జీవనానికి కీలకం!!
,,""శ్రేయోంసి బహు విఘ్నా నీ!"", అన్నట్టుగా, ఎవరైనా ,మంచి పని చేయాలంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది,! అదే చెడు పనులు చేయడం, తలచుకొడం చాలా సులువు,!
, అందుకే , అర్జునా!"ఏది మంచి ?ఏది చెడు ?"అని చెప్పినా తెలుసుకోలేని సంకట స్థితిలో నీవు నన్ను ఆశ్రయించా వని నాకు  తెలుసు,"! అందుకే నీ హితం కోరుతూ, యుద్దం చేయ మంటున్నాను,,!""
,అంటూ పలికిన భగవానుని వాక్యాలు , , మానవాళికి, సదా సర్వ కాలాల్లో శిరోధార్యం,! అనుసరణీయం,! ఆచరణీయం!, పరమ పద సోపానం, గీతామృతం !
ప్రపంచం లో,ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు లేని వారుండరు!, వెనకడుగు వేయకుండా, వీరుడవై నిలిచి జయాన్ని పొంద డమా,?? భీరుడ వై, జీవన సంగ్రామం లో దైర్యం కోల్పోయి వెనుదిరిగి పారిపోవడమా ?? ,, ఆ నిర్ణయం మన విజ్ఞతకే వదిలేశాడు శ్రీకృష్ణపరందాము డు,!
అర్జునుడు భారత సంగ్రామం లో గెలిచింది శ్రీకృష్ణుని తన ముందు నిలుపుకొని,! ప్రస్తుతం, ఈ  ,అదే శ్రీకృష్ణుని మన మనసులో ధ్యానిస్తూ, అంతరంగం లో నిలుపుకొని ఎదుట సవాలు చేస్తూ ఉన్న సంసార సంగ్రామం లో గెలిచి చూపించాలి ;!!, అతడు అనుగ్రహించే అద్భుతమైన ఆత్మవిశ్వాసం తో ఆత్మానందం తో,, సదా రక్షకుడు గా కాపాడుతూ ఉంటాడన్న పరిపూర్ణమైన ధృఢ చిత్తం తో, నిర్భయంగా, నిశ్చింతగా, నిరా పే క్ష భావంతో సుఖవంతమైన, ఆనందమయ మైన జీవితాన్ని గడ పాలి !!
సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణాల ను నిరంతరం స్మరిస్తూ, అతడు ప్రసాదించిన అమరము, అద్భుతం, అపురూపం, అమోఘం, అద్వితీయం,, బ్రహ్మానంద కరము, పరమ పావనం, భుక్తి ముక్తి దాయకం, సకల పాప శాప తాప శమనం, అత్యంత మధురం, కడు రమణీయం కమనీయం,,మహనీయమ్, మనోహరం, గా వర్దిల్లుతూ, మన బ్రతుకుల ను ఉద్ధరించే భగవద్గీత సారాన్ని ,సారాంశాన్ని పరమార్థాన్ని అర్థం చేసుకు నే ప్రయత్నం చేద్దాం!, అలాంటి సద్భావన, సత్సాంగత్యం, సనాతన సదాచార సంప్రదాయాన్ని అనుసరించి ఆచరిస్తూ, రాబోయే తరానికి మార్గదర్శకులు గా ఉందాం!, గీతాచార్యు డు  నిర్దేశించిన సన్మార్గం లో పయనిస్తూ, ఆ భావన లో, అదే స్మరణ లో జీవిస్తూ తరించు దాము!
హరే క్రిష్ణ హరే కృష్ణా !
స్వస్తి !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...