Wednesday, March 25, 2020

కరోనా కష్టాలు !

Mar 23, 2020
మనిషి కి ఉన్న  అనేక దుర్గుణాలలో  పేర్కొన దగినవి , ముఖ్యంగా  రెండు !!
మొదటిది ,,
""తాను అన్నిటికీ అతీతు డను,అనుకోడం ,! అంటే,ఎవరో ఎవరో చస్తారు ,,కానీ ,నేను మాత్రం ఇక్కడే ఉంటాను అన్న మూర్ఖం  అజ్ఞానం !
మృత్యుభయం,, పాప భీతి,, ఉంటే , ఏ మనిషి కూడా ఒక్క తప్పు చేయడు కదా !
ఇక రెండవది ,!
ఎన్నడూ ఒక్క తప్పు లేదా పాపం  కూడా చేయలేదని  అనుకోడం !!,
అందర్నీ వేలెత్తి చూపిస్తాడు ఏ తప్పు ఎవరెవరు చేశారో చెబుతాడు !
కానీ తన తప్పులు చెప్పడు ,
తెలిసినా కూడా ఒప్పుకో డు!!
భగవంతుడు మనిషికి దేహంతో బాటు ,ఎటువంటి రోగాలనైన తట్టుకునే రోగ నిరోధక శక్తిని ,, ఆంటీ బాడీస్ నీ ఇచ్చాడు
కానీ చిన్న రోగానికి కూడా  తట్టుకోలేక తొందరగా తగ్గాలని  ఆంటీ బయోటిక్స్ నీ విరివిగా వాడుతూ ,తనలో సహజంగా ఉంటున్న ఆంటీ బాడీస్ , తెల్ల రక్త కణాల సంఖ్యను శక్తిని తగ్గించు కుంటు ,ఉన్నాడు
ఫలితంగా , ఈ కరోనా వంటి విష రోగాల వ్యాప్తి నీ అడ్డుకునే శక్తి సామర్థ్యం కోల్పోయి , మరణా న్నీ కోరి తెచ్చుకుంటున్నారు
గ్రహ బలం తప్పి పోవడం అంటే ఇదే ,కదా !!
సూర్య చంద్రు ల సంచారం మనం గుర్తిస్తూ ఉన్నాం ,!
సూర్య  చంద్ర కాంతి ప్రభావం సమస్త జీవకోటి మనుగడకు ఆధారం గా కూడా గమనిస్తున్నాం !!
అలాగే మిగతా ఏడు గ్రహాల ప్రభావం భూమిపై గల మనపై  ఉంటుంది కూడా ,!!
గ్రహ సంచారం లో ఉండే అవకతవకలు మానవ జీవనం పై ,సమస్త ప్రాణికోటి పై ఉండి తీరుతుంది!
ఇప్పుడు ఉన్న ""కరోనా వైరస్ ""దుష్ట శక్తి ప్రభావం ఈ, గ్రహ సంచార దోషమే !!
ప్రస్తుతం రాహు గ్రహం ,,ఆరుద్ర నక్షత్రం తో కలిసి సంచరిస్తూ నీచ స్థానం లో  ఉన్నాడు !
ఆరుద్ర  నక్షత్రం నీలకంఠు ని కంఠ స్థానం!!
,,అది విష తుల్యము,!
ఈ రాహు గ్రహం,, ఆ ఆరుద్ర నక్షత్రాన్ని విడిచి ,దీని తర్వాత  మృగశిర  అనబడే అమృత తుల్యమైన నక్షత్రం స్థానానికి కదిలి వెళ్లేవ రకు  మనం ఓపిక పట్టాల్సిందే ,! ఏప్రిల్ నెల ఆఖరు వారం లో ఈ దుష్ట పీడ తగ్గుతుంది ,!
!అంతవరకు ఈ బాధలు తప్పవు !!
దైవారాధన వల్ల తొలగని బాధలు ఉండవు !!
అయితే ఈ కరోనా వైరస్ బారి నుండి కొంత ఉపశమనం పొందాలి అంటే  ,,పరిశుభ్రత ,పర్యావరణ కాలుష్య నివారణ,,స్వీయ గృహ నిర్భంధం  , వ్యక్తులకు వస్తువులకు దూరం ఉండడం , లాంటిచర్యలతో బాటు ,సత్వర పరిష్కార మార్గం కేవలం  ""దైవారాధన ""ఒక్కటే ,, తప్ప మరో మార్గం  కానరావడం లేదు  కదా!!
ఈ గ్రహచార సంచార బలం  అనుకూలంగా లేకపోతే ఎంతటి వారైన విధి ముందు తల వంచాల్సిందే కదా !!
ఒకసారి పరమశివుడు  అనుకోకుండా శని దేవుని చూడటం జరిగిందట !
""ప్రభూ !!""ప్రణామాలు !మీరు
నన్ను క్షమించాలి!! ఈశ్వరా !,
కొన్ని ఘడియలు నా దృష్టి మీ పై ఉండబోతోంది!""
మీరు జగత్ పాలకులు !కనుక మీకు ముందే తెలుపడం ఈ దాసుని ధర్మం !!""
అని వెళ్ళిపోయాడు శని !!!
భోళాశంకరుడు అయోమయం లో పడి , తనపై ,ఆ శని ప్రభావం పడకుండా ఉండేందుకు ,అడవిలో ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో ప్రవేశించి ,,గాలి వెలుతురు చొరలేని చీకటి లో దాక్కున్నాడు !
తర్వాత బయటకు వచ్చి ,తన వెండి కొండపై గౌరీ దేవి తో బాటు సమస్తపరివారం తో  కైలాసం లో కొలువు దీరా డు శివయ్య !!
అప్పుడు శని దేవుడు వచ్చి ""మహాదేవా ,!నేను మిమ్మల్ని అవహించి, బాధపెట్టినందుకు మీరు  నన్ను క్షమించాలి !!""అంటూ సాగిలపడి ప్రణామాలు చేశాడు
శివుడు మందహాసం చేస్తూ
""నేను నీకు  కనబడకుండా ,, నీకు దొరక్కుండా దాక్కున్నాను కదా,!!
మరి ,, నీ ప్రభావం నా మీద ఎలా పడినట్టు ?"
చెప్పు ,!!అన్నాడు సాంబశివుడు!
""మహాదేవా ,!, దేవాది దేవా  !!
హే సదాశివ !  ,,నేను మీకు చెప్పగలిగే జ్ఞాని ని కాను! కానీ,
ఎంతటివారైనా గ్రహచారం అనుకూలించక పోతే , శని దేవుడు అంటే నా చూపు పడింది అంటే ,,,కష్టాలు పడక తప్పదు  !!
, ఆ సమయంలో నా ప్రభావం వల్ల ,,వారి కున్న వివేకము, జ్ఞానము అన్నీ శూన్యం అవుతాయి , శంకరా ;భక్త వశంకరా !!
అందువల్ల వెండి కొండ పై గౌరీ దేవి సహితంగా ,ప్రమథ గణాలతో ఆనందంగా కైలాసగిరి పై  ఉండాల్సిన మీరు ,ఎక్కడో కీకారణ్యంలో అడవిలో ,చెట్టు తొర్రలో , చీకటిలో , నా భయం ఆందోళన లతో  గడిపిన ఆ కొన్ని ఘడియలు , మీ కింకరుడ ను అయిన ఈ శనైశ్చరు ని నీడ సోకడం వల్లనే ప్రభూ !"
అని నమస్కరిస్తూ ఉన్న శనిదేవు ని చూసి,
నిజమే !, నీ ప్రభావం నా పైననే ఇంతగా చూపితే ఇక సామాన్యుల గతి ఏం కాను ?!"
ఔరా !ఎంత ఆశ్చర్యం !
గ్రహాల సంచార ప్రభావం ఇంత ఘోరంగా ఉంటుందా !""
అనుకుంటూ శని దేవుడిని ఇక ముందు శనై శ్చరుడు అంటే శని కూడా మహేశ్వరుని  అంశగా గుర్తించేలా  అనుగ్రహించాడు
,,ఇప్పుడు కూడా , ఆ శనిదేవుడు  ఈ కరోనా మహమ్మారి   రూపంలో  వచ్చి ,ఈ మానవాళి ని పట్టి ,,పీల్చి  పిండి చేస్తూ ఉన్నాడా ,!?
అనిపిస్తూ ఉంది! మనకు,,!
గ్రహచారం తప్పిన అంతటి మహావీరులు పంచ పాండవులు కూడా , విధికి తల వంచి ,,,అడవుల్లో పన్నెండు ఏళ్లు, ఆకులూ అలములు తింటూ అరణ్యవాసం చేయాల్సి వచ్చింది !!
సీతా దేవి , లంక లో రావణుడి నిర్బంధంలో  సంవత్సరం దీనంగా దుఖిస్తు గడపాల్సి వచ్చింది
""అకటా !గ్రహచారం తప్పి వచ్చి నన్ !!""
అనుకుంటూ ,నూరుగురు కొడుకులు ఉన్న దృతరాష్ట్రుని కి  ఇంత పిండం  కూడా పెట్టడానికి ఒక్క కొడుకు కూడా జీవించి లేడాయే కదా !; దిక్కు లేని గ్రుడ్డి బ్రతుకు ఆయే గదా !!
అంటూ వాపోయాడు గ్రుడ్డి రాజు !!
అప్పటి సంఘటన లు దాకా  ఎందుకు ?
కష్టాలు పడని వారెవరు ??
విధిని తిట్టని వారెవరు ?  ఇప్పుడు ఈ  కరోనా కష్టాలు కూడా  అంతే గా !!
ఏదైనా అన్ని  రోజులు  ఉండవుగా ,,,!!,
అందుచేత హరినామ భజన చేద్దాం !
భగవద్గీత శ్లోకాలు చదువు కుందా ము !
, విష్ణు సహస్ర , లలితా  సహస్ర నామ పారాయణ చేద్దాం !
లేదా
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ,,,!లేదా ,ఓమ్ నమో నారాయణాయ!! ,ఓమ్ నమః శివాయ , అంటూ 108సార్లు అందాం !!
సత్ సంకల్పంతో ,సద్ భావనతో ,జీవిస్తూ సద్గతి ని పొందే ప్రయత్నం చేద్దాం ,!
ఒక్కొక్కరూ విడిగా చేసే ప్రార్థన కన్నా ,సామూహికంగా  అందరూ  కలిసి చేసే  ప్రార్థన కొంచెం అయినా మిన్న యే కదా !
ఈ రోజున కొట్టే చప్పట్లు కూడా దుష్ట శక్తులను తరిమువేసే శక్తిని ప్రకంపనాలు కలిగిస్తాయి !!
అందుచేత కరోనా నునిగ్రహించే శక్తి యుక్తులను అనుగ్రహించమని జగదంబ విశ్వపా లిని మాత ను ప్రార్టించుకుందాం!!
స్వస్తి/
హరే కృష్ణ హరే కృష్ణా!!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...