Thursday, November 12, 2020

రామ్మూర్తి

Sept 23, 2020
రామ్మూర్తి  ఇక లేడు అన్న విషయం   చాలా   బాధ గా  ఉంది ,
మనకే ఇంత బాధగా ఉంటే ,పాపం. అతడి సతీమణి , 90 ఏళ్ళ పెద్దమనిషి  తండ్రి గారు , శ్రీమాన్ పాపయ  గారు , పిల్లలు ఎంత బాధగా ఉంటుందో ఊహించలేము కదా
జగన్నాథుని సన్నిధిలో  ఉంటూ ,స్వామి కొలువులో పూజా భిషేక  దూప దీప నైవేద్యాలతో   శ్రీవారి సేవకై ,,భార్యా సమేతంగా  కుటుంబ యుక్తంగా  తమ జీవితం   అంకితం చేసిన వేద మూర్తులు పాపయ గారికి  జగన్నాథుని అనుగ్రహం   ఈ విధంగా ఉంటుందని ఎవరమూ ఊహించలేదు
వృద్ధాప్యం లో భార్య పోవడం ,ఇపుడు ఎదిగిన ,తోడు నీడై ఉంటున్నా కొడుకు పోవడం   కష్టంగా ఉంటుంది
తలిదండ్రులు  తమ కళ్ల ముందు పిల్లలు చల్లగా  వర్ధిల్లాలని కోరుకుంటారు , అలాంటి కొడుకు   ,తనను ఇలా  నిస్సహాయంగా విడిచి, తొందర పడుతూ __ఆ జగన్నాథుని లో తన కన్నా ముందే  వెళ్ళి  ఐక్యం కావడం  , అనేది
ఏ తండ్రికి తల్లికి జరగ కూడదు ,
హే జగన్నాథ ,
రామ్మూర్తి  మంచివాడు నవ్వుతూ నవ్విస్తూ  ఉండేవాడు ఉత్తముడు  అలాంటి వాడిని   , తీసేసుకోవడం , నీ హక్కు
నిజమే
కానీ
అతడి పై ఆధారపడి ఉన్న భార్య పిల్లలు  వృద్ధుడైన తండ్రి  బాగోగులు చూడటం కూడా నీ బాధ్యత గా స్వీకరించు  స్వామీ _!
జగన్నాథ ప్రభూ ,
ఇక ముందు నీకు     కైంకర్యాలు , సేవ యాత్రలు ,  పూజలు ఎవరు చేయాలో కూడా  ఆ అనుగ్రహం  నీవే చూడాలి   తండ్రీ
ఎందుకయ్యా మంచివారిని ఎన్నుకుంటావు ,, నీతో సదా  ఉండడానికి  ?
   జగన్నాటక సూత్ర దారీ
  నీ లీలలు కనలేము
తెలియలేము
తండ్రి
నీ రథచక్రాల గమనం ఎటు వైపు ,ఎప్పుడూ ,ఎలా వెళ్తూ ఉంటుందో  ఎవరి కెరుక
ప్రభూ
  అంతా నీదే
కానీ
  రామ్మూర్తి ఆత్మ కు ప్రశాంతత ను
అతడి కుటుంబానికి యోగ క్షేమాలు ,నీ ఆలయ   నిత్య పూజ విధానాలు  ఇవన్నీ చక్కగా   సవరిస్తూ , సంతోషం సంతృప్తిని ప్రసాదించు 
  హే పరమాత్మ
శరణు

""మేథో మథనం _!"

Sept 22, 2020
"మనిషి అనేవాడు మనస్సు  అనే ఇంధనంతో  జీవిస్తూ ఉంటాడు _!
కేవలం ప్రాపంచిక దృక్పథం తో చూస్తే  __మనస్సు కు ఉన్న  పటుత్వం సడలి పోతుంది _!
అప్పుడు మనిషి సగటు మనిషిగా నే మిగిలి పోతాడు _!
కానీ ఎపుడైతే 
అదే మనస్సును  ,పరమార్ధం వైపు మళ్ళిస్తు ఉంటాడో ,__ అతడు  ఉన్నతమైన , ఉత్కృష్టమైన  స్థాయి గా ఎదిగి పోతూ  ""మనీషి  ""
గా    దివ్యమైన ఆత్మ ప్రకాశం తో   ,, ఒక యోగి రాజు లా ,వివేకానంద  స్వామి వంటి , సమున్నత ఆధ్యాత్మిక వేత్తగా , వైతాలికునిగా , సమాజ ఉద్దరణకు సిద్దం అయిన సంఘ  సంస్కర్త గా  ప్రభవిస్తూ ఉంటాడు __!
__మనసు కు  కూడా  స్వరూపాలు దేవుని వలె అనంతము ,_!
ఏ  రూపమై నా కూడా  ఇట్టే _క్షణంలో మారుస్తూ,, అవే గుణాలు  మనిషి శరీరంలో  ఉద్దీపన చేస్తుంది ,_!
  ఎక్కడో అమెరికా లో ఉన్న సోదరుని గూర్చి ఆలోచిస్తూ అతడి ఆకారాన్ని స్వభావాన్ని పొందుతూ ,తన అంతరంగంలో సోదర ప్రేమను నింపుకొని ఆనందాన్ని పొందగలిగె అద్భుతమైన , అసాధారణ మైన శక్తి __ మహత్తు , దైవిక శక్తి ,,మనిషి లోని మనసుకు ఉంది _!
అందుకే మహాత్ములు _  ఋషులు , సనాతన కాలంలో తమ   త పః  ప్రభావం తో , పొందిన  అద్భుత శక్తితో ,,దివ్యదృష్టి తో __"ఎక్కడ ఏం  జరుగుతుందో , కళ్ళు మూసుకొని యోగ ప్రక్రియ ద్వారా ,  తాము , ఉన్న చోటు నుండి  కదలకుండా  గ్రహించేవారు  _!
అందుకే మనసు  చెడు భావిస్తే __ దెయ్యమై పీడించ గలదు ,
దైవ స్వరూపంతో   పరమాత్మను ఆరాధిస్తే _  జీవుడిని , నేరుగా దేవుడి  పరమ దామాన్ని  చేర్చ గలదు_!
   అంతట మహిమా న్విితమైన , అద్భుత అమోఘమైన శక్తి చైతన్య ప్రభావం గల  ,మనసుని నియంత్రిస్తూ   ,శిక్షణ అందించే నేర్పు మనిషిలో  ఉండాలి _!""అంటే,,   అతడి  ఆధ్యాత్మిక జ్ఞానం  మాత్రమే   ఆ పరమావధి ని సాధించగల దు  _! దానికోసం__  గురు కృప , సద్ గ్రంథ శ్రవణ పఠన అధ్యయనాలు అత్యావశ్యకం _!!
ఆ విధంగా మనసు ఏది భావిస్తే మనిషి  క్షణంలో , ,ఆ స్వరూపంగా మారి పోతూ ఉంటాడు _! ఉదాహరణకు ,, అదుపు చేయలేని , కోతి చేష్టల స్వభావం కలిగిన మనస్సు చేసే దుష్ఫలితాలు  గురించిన   అందరికీ తెలిసిన  చిన్న కథ _!!
___ఒక బాటసారి    ప్రయాణంలో అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమిస్తాడు ,
", అయ్యో  _! నాకు దాహంగా ఉంది కొన్ని మంచినీళ్లు ఉంటే బాగుండును ,""! అనుకున్నాడు
__వెంటనే  పెద్ద పాత్రలో  చల్లని  స్వచ్చమైన నీరు అతడి ముందు  అగుపడింది , _!
అతడికి ప్రాణం లేచి వచ్చినట్టు గా అనిపించి
""ఆహా_!  అనుకుంటూ ఆ నీరు   తాగి   దాహం తీర్చుకున్నాడు _! అలసటతో చెట్టు నీడన
పడుకున్నాడు ,,,కాస్సేపటికి లేచి చూసేసరికి , పొద్దు పోయింది ,_!
అతడికి ఆకలి  వేసింది _!
""ఏవైనా తినడానికి దొరికితే  బావుండును __!"",అని  తలంపు రాగానే ,,చటుక్కున  ఎదుట   పళ్ళెంలో చక్కని ఆహారం తయారుగా కనిపించింది ,
__ బాటసారి ఆనందంతో ఆరగించి ఆకలి తీర్చే సుకున్నాడు
,  __ఇప్పుడు అతడికి తెలిసిపోయింది ,తాను కూర్చున్నది కల్ప వృక్షం చెట్టు క్రింద అని ,_ ఎది కోరితే అది ఇస్తుందని _!!"
ఇంకేం ,మనసు సంతోషంతో    పొంగి పోతూ ఉండగా , ""పడుకోడానికి మంచం , చక్కని ఇల్లు దాసీ జనం__"" ఇలా ఏది అనుకుంటే అవి ప్రత్యక్ష మౌ తూ ఉన్నాయి _!
  ఎదురుగా ఒక నౌకరు అతడికి వింజామర తో వీస్తు ఉంటే ,  బాటసారికి  అకస్మాత్తుగా  భయం వేసి ,,,వీడు   దెయ్యం గా మారి నన్ను 
చంపేస్తాడే మో _!?"",అన్న  భావన రావడం ఆలస్యం ,__వెంటనే , అలా జరిగి పోవడం  ,అంతా క్షణాల్లో జరిగి పోయింది _!
__ అంత వేగవంతంగా ఉంటుంది మనసు యొక్క సంచలన తీవ్రత ,_!;
వాయు వేగం కంటే  ఎన్నో రెట్లు అమిత వేగం తో  ప్రయాణించే అసాధారణ శక్తి గలది మనిషి లో ఉన్న మనసు _!
మనసుకున్న శక్తిని బట్టి మూడు గుణాలు గా  అది వర్తిస్తూ ఉంటుంది _!
_1_ మంచి  మనసు కలవాడే మనిషి __ అది సత్వ గుణం
_2__ అమితంగా  కోరికలు తీర్చుకునే  విధంగా  మనసు చరిస్తూ ఉంటే , ఆ మనిషి రజో గుణ సంపన్నుడు అవుతాడు
  _3 _ ఇక కోపము ద్వేషము పగ ప్రతీకారము ,శాడిస్టు లాంటి  రాక్షస ప్రవృత్తి తో హింసా మార్గంలో _ మనసు చలించే  ప్రకృతిగలవాడు __తామస గుణ ప్రధానంగా సంచరిస్తూ ఉంటాడు  అని
ఈ విధంగా మనిషి  ఈ  మూడు గుణాలతో తయారు చేయబడుతా డు  అని గీతాచార్యుడు భగవద్గీత లో   చక్కగా  వివరించాడు _
__ ఆ విధంగా ,_  మనసు ఆకలి ని భావిస్తే ,దేహానికి ఆకలి స్పురిస్తూ ఉంటుంది ,_!  మనసు  వేరే ధ్యాసలో లేదా పనిలో ,గానీ  పడితే మనిషికి  ఆకలి వేయదు _!
అలాగే దాహం గా ఉండడం , కూడా వేయదు కదా  _!
ఈ విధంగా  మనిషికి  ""ఏదైనా చెయ్యాలి ,,,తినాలి ,, ఎటైనా   వెళ్ళాలి  _!"",అనుకునే   ఏ పని అయినా మనసు తోనే జరగాలి ,,_!"
నిద్రావస్థ లో _ ఈ చంచల మైన  మనసు ఆత్మలో లయం అయిపోతుంది ,_!! ఈ దశలో ,,దానికి ఉనికి ఉండదు _!
__ అదే అఖరు నిద్ర అయితే ఇక "మనసు " అనేదే ఉండదు _!
  అదృష్టం ఉండి, నిద్ర నుండి మేల్కొని లేస్తే__ చాలు  ,వెంటనే మనసు కూడా లేచి ,,   ఎదుట కనిపించే ప్రతీ పదార్థం,పరిసరాలలో తానే ఆవేశించి ,తన ప్రతిభను చాటుతూ"" ,నేను ఉన్నాను ,నాకు ఇది కావాలి ,__!""అంటూ తన అస్తిత్వం చాటుతూ , ,కోరికల చిట్టా విప్పుతూ పోతుంది _!!   ఈ  మనసుకు  ఒక పేరు ""నేను,", మరో పేరు ""అహంకారము "", ఇతరాలు _""జీవుడు"" అనీ,""ప్రాణము"" అనీ ,, కూడా  భావిస్తారు _!
మనసు  అనేది దేహంలో ని జీవుడి నీ , సదా  ఆశ్రయించి ఉంటుంది  _!,,
కానీ   జీవుడు  ,దేహి  కాదు కదా _!
   శరీరం మరణిస్తే__ జీవుడు దీనిని విడచి మరో శరీరం వెదుక్కుంటూ వెళ్తాడు _!
  అందుకే   ఈ శరీరం ను  ఒక అద్దె కొంప _ అంటారు_!
  దాని ఆయువు తీరితే , , రిపేర్ చేసే అవకాశం కోల్పోతే     జీవుడు ,అంటే మనసు  , మరో బండి ,అంటే వాహనాన్ని ,చూసుకుంటాడు _!!
ఈ మనసు యొక్క  ప్రకృతి ఎంత వికృతి గా,, విచిత్రంగా ఉంటుందో చూడండి _!!,
తన ఆత్మీయుడు ఎవరైనా మరణిస్తే , మనసుకు   ఆకలి నిద్ర , ల పై మనసు పోదు కదా,,_!
  ఎందుకంటే ఆ చనిపోయిన వాడు__ ఈ మనసుకు  చాలా చాలా ఇష్టమైన వాడు ,_! అందుకే  , అంత తొందరగా  తిరిగి రాదు ,_! వేరే స్థితి పై మనసు పోదు _!
పరధ్యానం లో పడి పోతాడు _!
   తాను  ఇష్టపడితే , అంటే  దానిపై మనసు పడితే ,,  గట్టిగా  పట్టుకుని   విడిచి పెట్టదు _!
ఇక  దానికి ఇష్టం గానీ  లేకపోతే ,  మనసు లగ్నం కాకపోతే , దాని జోలికి పోదు కదా _!   పరమ అసహ్యం గా చూస్తుం ది
__"" నాకు ఇది కావాలి ,ఇది తినాలి __!",అనిపించ  క పోవడానికి 
కారణం __మనసు వాటి గురించి ఆలోచన చెయ్యడం లేదు  _!
  అన్న మాట__ _!!"మన  ,గీతాచార్యుడు__ శ్రీకృష్ణ భగవానుని అద్భుతమైన  ఉపదేశ సారం  కూడా ఇదే _!"
""  నీ మనసే నీకు శత్రువు_!, మితృవు కూడా_! _!
యద్భావం తద్భవతి ,__! అన్నట్టుగా
!_"" భాగ్యం కానీ __దరిద్రం కానీ కేవలం భావన తోనే ముడిపడి ఉంటుంది _!!
  ఒక్క"" తలంపు"" తోనే  సకల  జగత్తు  స్పురిస్తు ఉంటుంది,_!
సృష్టి మొత్తం , మనసుతో పుడుతుంది __! మనసుతో స్థితి పొందుతుంది ,_!అదే _మనసులో లయం అవుతుంది , __! కావాలంటే పునః  ఆవిర్భవిస్తుంది _!!
__ మనసు లేని మనిషి పిచ్చి వాడు గా పరిగణింప బడతాడు  కూడా _!!"
"" ఆ  అబ్బాయి  నల్లగా ,వికారంగా  ఉన్నాడు  _! అతడిని నీవు ,ఎలా మెచ్చావ్ _?! ఎలా  ప్రేమించావే , పిచ్చి దానా _?!"" అని  పొరబాటున ఎవరైనా ఒక యువతిని   అడిగితే ,, వెంటనే , ఆమె అంటుంది  కదా _!
ఓ తాతా _!
""నా కళ్ళు పెట్టుకొని  చూడు_!; అతడు   నీకు ఎంత అందంగా కనిపిస్తూ  ఉంటాడో  ,,అప్పుడు   తెలుస్తుంది _ నీకు !; అని అనందంగా జవాబు వస్తుంది __!
అందుకే _""తాను మెచ్చింది రంభ _!
తాను మునిగింది గంగ _!"
అంటారు ,
అది నా  మనసుకు ఇష్టం  అయ్యింది _! అంతే _!!"" అడగడానికి నీవెవరు _?!"
ఇలా ఉంటాయి మనసు చేసే పిచ్చి చేష్టలు  కొంటె పనులు _!"_;""
ఎందరు మనుషులను_' మన చుట్టూ  చూస్తూ ఉన్నామో ,__అన్నిరకాల భిన్నమైన  మనసు లను  తత్వాలను  కూడా చూస్తూ ఉంటాము
""లోకో భిన్న రుచిః _!  అంటారు ప్రాజ్ఞులు  _!,
  మనసు ప్రవర్తించే తీరు గురించిన మరో  చిన్న కథ _!! చూద్దాం
___
ఒక గ్రామంలో , ఒక  గృహస్థు,, సంసారం  లో బాధలు పడలేక_ విరక్తి తో ,   యోగిగా   బ్రతకాలని నిశ్చయించు కుని _ ఇంట్లో చెప్పకుండా   బయట పడి ,వెళ్ళి ,,ఒక సాధువు ను ,,కాళ్ళా వేళ్ళ పడి__ బతిమాలి _ ఎలాగో  ఒప్పించి ,, అతడి ఆశ్రమంలో చేరాడు
  కొన్ని రోజులు ఆశ్రమంలో ఉన్న కట్టుబాట్లు  ,పాటిస్తూ , సన్యాస జీవితం   సాగించాడు __!
  రాను రానూ, ఇప్పుడు ,,, అతడికి సంసారం కంటే సన్యాసం కష్టంగా  అనిపించింది, _!
అంతా మౌనం_! ధ్యానం , జపం _!
, వేరే మాటలు లేవు _!!,ధ్యానం లో ఉంటే భార్యా పిల్లలు తరుచూ  గుర్తుకొస్తు  మనసు  వికలం అవుతూ ఉంటే ,పాపం , అతడు  కుదురుగా ,ప్రశాంతంగా ఒక చోట  ఉండలేక పోతున్నాడు ,,_!
ఇది గమనించి _ ఆశ్రమంలోని  ,ఒక  సన్యాసి అడిగాడు _ అతడిని __!
""ఎందుకు నీవు  ఈ ఆశ్రమంలో చేరావు ?""
    ""ఏం చేయను నేను  _?! భార్యా పిల్లలతో , ఇంట్లో ఉంటే, రాత్రి పగలు  మనసుకు ,దేహానికి  విశ్రాంతి లేకుండా  నేను పని చేయాల్సి వస్తోంది అక్కడ__!"" _ విసుగు వచ్చింది ,_! అందుకే తప్పించుకొని  పారి పోయివచ్చాను నేను _!  అన్నాడు ,
""పని తప్పించు కోడానికి ఇక్కడ చేరావా ,_?!""
  _""అవును ,ఇక్కడ  హాయిగా ఉంది నాకు ,_!!""
  ""ఏ పని చేయకుండా  ఇలా ఉండడం  నీకు బావుందా _?!
   " అవును మరి__! ఏ రంధి లేకుండా  , వేళకు కమ్మగాతింటూ  హాయిగా  నిద్ర పోవచ్చు కదా ఇక్కడ  _!  పైగా ఎవ్వరూ ఏమీ అనరు కూడా _!""
అన్నాడు
  ""ఈ ఆశ్రమం ముఖ్య ఉద్దేశ్యం నీకు తెలుసా ?_!""?
_  గురువు గారు  నాకు ఏమీ  _చెప్పలేదు  మరి _!""
  __""ఈ రోజు వారు మరొక ఆశ్రమానికి వెళ్తున్నారు__ వారు తిరిగి  వచ్చాక _ అప్పుడు నీకు తెలుస్తుంది_!""
అని వెళ్ళాడు
  ఆత ని మాటలు ,మన ఈ సంసారి కి ఏమీ అర్థం కాలేదు ,
__  సాధారణంగా , గురువు గారు ఆశ్రమం లో ఉంటేనే__ వంట చేస్తారు _!
  ఆయన లేనప్పుడు ఉపవాసంతో సమాధిలో ధ్యాన ముద్రలో_  గడుపుతారు శిష్యులు _!
  ఆ రోజు  ఉపవాసంతో గడిచింది _!
మరుసటి రోజున సాయంత్రం వచ్చాడు గురువు గారు__!
  ఆయన జపము తపము ముగిసే సరికి రాత్రి అయ్యింది
__మనవాడికి   కడుపులో ఎలుకలు పరుగెడుతూ ,ఆకలికి నక నకలాడి పోతున్నాడు  __
శోష వచ్చి పడి పోతున్నాడు కూడా _!!
చివరకు గురువు గారు__ రాత్రి  భోజనానికి  వచ్చి  కూర్చున్నాడు _!
పదార్థాలు వడ్డించారు అందరికీ _!
ఈ శిష్యుడి కి _ విస్తరిలో వడ్డించిన  అన్నం చూస్తూ__ తినకుండా  ఉంటే __  ప్రాణం లేచి పోతోంది ఆకలికి ,_!
__గురువు గారు భోజనం ప్రారంభం చేస్తెగాని __ ,శిష్య  బృందం తినడం కుదరదు __!
అది నియమం _!
అటూ ఇటూ  తేరిపార చూస్తూ,  చేతిని విస్తరిలో  పెట్టకుండా దిక్కులు చూస్తూ ఉన్న గురువు గారిని  అడిగాడు ఉండబట్టలేక _!!
_""అయ్యా__; మీరు నిన్నటి నుండి ఏమి తిన లేదు కదా __!!,మీకు ఆకలి వేయడం లేదా _??" ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు _??""
ఆయన అన్నారు _
నాకు ఆకలి ,లేదు _!""
   కానీ ,నాకు మాత్రం  విపరీతంగా ఆకలి వేస్తోంది స్వామీ,_!!""
  ""  ఏమిటి, భోజనం చేయకుండా ఉండలేవా రెండు రోజులు?""
""  అమ్మో ,ఇక ఒక్క నిముషం ఆలస్యం అయితే చచ్చి పోతాను _ స్వామీ _!""
అయితే  ఆలస్యం ఎందుకు _??  చావు _!""
అన్నాడు ,
_""అదేమిటి స్వామీ __ అలా అంటున్నారు __??""
__" బ్రతుకు మీద మనసు రోసి__   నీ భార్యా పిల్లలు  ఎవరు లేరు అనుకుని_ వైరాగ్యం తెచ్చుకుని , అన్నీ విడిచి ,,ఇక్కడికి  వచ్చాక కూడా  ,ఇంకా నీకు  తిండి పై  యావ పోలేదు ,_!!
భగవద్ ధ్యానం లో   ఉంచే బదులు.  నీవు నీ మనస్సును , ఎక్కువగా ఆకలి పైనే  లగ్నం చేస్తున్నావు ,,_!
ఇంద్రియాలను చిత్తాన్ని మనసును ,దేహాన్ని  అంతః కరణం అదుపులో ఉంచుకోలేని. నీవు ఈ ఆశ్రమంలో ఉండటానికి అనర్హుడ వు   ,_!!  వెళ్ళి పో,,నాయనా __!""
అంటూ బయటకు  పంపించాడు _!
    అందువల్ల , ఈ చిత్ర విచిత్రమైన స్వభావం గల  మనస్సును నిబ్బరం చేసుకోవడం,    కట్టుబాటు లో ఉంచడం ,, సామాన్య విషయం కాదు _!
ఎంతో  సాధన  చేయాలి _!
భగవద్గీత గ్రంధాన్ని  నిరంతరం  అధ్యయనం చేసేవారికి ,వారి  మనసుని ,కొంత వరకు తమ ఆధీనంలో ఉంచగలిగే సౌలభ్యం ఉంది
__కళ్ళ ముందు జరిగే పరిణామాల ను సాక్షిగా చూస్తూ ఉండడం ఒక పరమ , యోగి _ ఉత్తమ సాధకుని లక్షణం_!!
      నిజానికి సంసార జీవితంలో   ఉండే భోగాలు అనుభవిస్తూ    హాయిగా గడపడం చాలా సులభం_గా భావిస్తాము !""
ఎండమావుల వంటి ,  ఆ సుఖాల కోసం ,అదే శాశ్వతంగా భ్రమిస్తూ ,భావిస్తూ ,వాని వెనుక దాగిన కష్టాలను, ఎంత ఘోరంగా అనిపించినా కూడా ,మనసు పెట్టీ ,ఎంతో  ఇష్ట పడుతూ   ఉన్నట్టుగా నటిస్తూ  ఉంటాం _!, ,అదంతా పరమేశ్వరుని   కృప గా  కృతజ్ఞత చూపకుండా ,  అజ్ఞానంతో  జీవితాన్ని వ్యర్ధం , చేసుకుంటూ  ఉంటాం _!
__మనసును కట్టుబాటు లో ఉంచకుండా  విచ్చలవిడిగా విడిచి పెడితే  ,,జీవుడికి దుర్గతి పడుతుంది ,
, తన  ఆనంద సాగరం గా , భావిస్తూ ఉంటున్న ఈ  సంసారం లో   నిత్య కర్మలు చేస్తూ కూడా  __కర్మ ఫలం ఆశించ కుండా , నిరాపెక్ష భావంతో యోగిలా , సన్యాసి వలె గడపడం _ అనేది ,  నేటి సాంకేతిక యుగంలో  అత్యంత   కటినతర మైన విషయం _!
__ సన్యాసి సుఖి,సంసారి దుఃఖి అంటారు ,,_!
కానీ ,,
  సంసారం లో ఉంటూ కూడా యోగి లా బ్రతుకుతూ ___ తామరాకు పై నీటి చుక్క లా,విషయ సుఖాలకు  , దేనికీ అంటకుండా ,,,మనసూ శరీరము  దైవ చింతన లో గడిపే వారు  లేక పోలేదు ,
___ అలా ,జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడుతూ  పారిపోయే సన్యాసి కన్నా ,అదే సమస్యల వలయంలో ఉంటూ, భయపడకుండా పోరాటం సాగిస్తూ  ఉంటున్న సంసారి యే ,సన్యాసి కన్నా గొప్పవాడు ,
__ కాకపోతే  , అందమైన సంసార జీవితాన్ని , అందించి ,  మన  జీవితాన్ని  ఆనందమయం చేస్తున్న  ఆ పరమాత్ముని కృపను ఏ  మాత్రం  మరచిపోకుండా__ఉండాలి _!     అనుక్షణం  పరమార్థము యొక్క   పర తత్వాన్ని  గుర్తుచేసుకుంటూ  ఉండాలి _!!, 
ఇంతటి  మహా వైభవాన్ని  దయతో ఉదారంగా ప్రేమతో మనకు   ,అనుగ్రహించిన  ఆ   దైవానికి   సదా  కృతజ్ఞత సమర్పిస్తూ ఉండాలి _!
__ఎంతటి విద్యావంతు డైనా,ఎన్ని క్షేత్రాలు దర్శించినా , పుణ్య కార్యాలు చేసినా ,, గొప్ప పదవిలో ఉంటున్నా ,  మనిషిలో మానసికంగా పరివర్తన  చెందాలి _!
, తన  ఋజు ప్రవర్తన తో  __ఆ  మార్పును , నిత్య జీవనంలో   ఆచరణ  ద్వారా  నిర్వహించే ప్రయత్నం చేయాలి _!
లేక పోతే , అలాంటి వారి వ్యయ ప్రయాసలు డాంబి క జీవన విధానం  __వృథా ,అవుతాయి _!  ఉత్తమమైన
మానవ జన్మ _కూడా వ్యర్ధం అవుతాయి _కదా _! అన్న జీవిత  సత్యం ,, పరమార్థం  ,తెలిస్తే ,,చాలు _!
ఇదే  జ్ఞానం _!
ఇదే ధర్మం _!
ఇదే వివేకం _!
_ఇదే , మానవత్వం _!
ఇదే జీవిత ధ్యేయం _!
ఇదే గమ్యం _
ఇదే పరమాత్మ  అనుగ్రహం కూడా _!
స్వస్తి _!"
   హరే కృష్ణ హరే కృష్ణా _!""

కష్టం అంటే _?!"

Sept 21, 2020
"మనసు బాధ పడటం , వలన కష్టంగా  అనిపిస్తూ వుంటుంది _!""
"" _మనసా ? అంటే ఏమిటి _??"" అదెక్కడుంటుంది ??
__""మనసు అంటే  నేను ,అనే అహంకార __జీవ భావం _!""
_"" మరి , బాధ పడటం అంటే ఏమిటి _?"
  "" తాను  అనుకున్నట్టుగా జీవితంలో  జరగక పోవడం వలన  , రోగం జ్వరం , ముసలి తనం ,నష్టం రావడం  లాంటి పరిణామాల  వలన  బాధలు  కలుగుతాయి !""
""కష్టాలు రాని వారు ,లేని వారు ఉంటారా _?"
"" ఉండరు _!  కష్టాల కు అతీతులు ఎవరూ కారు _!  జన్మించిన ప్రతి ప్రాణి కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది  _!""
""ఎవరికి వస్తాయి కష్టాలు _?""
""మనిషి అన్న ప్రతివాడికీ వస్తాయి కష్టాలు _!""
"" ఎవరి కష్టాలు ఎక్కువ _? ఎవరివి తక్కువ _?""
""  ఎవరి కష్టాలు వారికే  క ఎక్కువగా,, ,ఇతరులవి తక్కువ అనిపిస్తాయి _!
""ఎందుకు ,, అలా ఒకే కష్టం  ఒకరికి ఎక్కువా మరొకరికి తక్కువగా  అనిపిస్తాయి ?"
"" ఎందుకంటే ఇతరుల కష్టాలు టీవీ,లో సినిమాలో చూస్తున్నట్టుగా చూసి మరచి పోయే వీలు ఉంటుంది _!,, కానీ తాను కష్టం లో ఉంటే ఇతరులు చూసి "" అయ్యో_! పాపం _! ,అని సానుభూతి తెలిపేందుకు వస్తుంటే  భరించలేక  కోపం ,ద్వేషం ,అసూయ , బ్రతుకు పై నిరాశ ,కలిగి చివరకు చావడానికి కూడా సిద్ధపడతాడు _! తన కష్టాన్ని  విపరీతంగా ఊహిస్తూ , పిచ్చి వాడై పోతూ ఉంటాడు _!"" అందుకే
ఏదైనా తన దాకా వస్తేనే తెలుస్తుంది కదా _!"అంటారు విజ్ఞులు _!!""
""మరి   కష్టం వస్తె _ఏం చేయాలి _?
_"" వచ్చిన   కష్టాన్ని  భగవద్ అనుగ్రహంగా  ఎంతో ఇష్టంగా స్వీకరించాలి ,_! సుఖం వస్తే తనకు  ఎంత సంతోషం అనిపించిం దో __అలాగే కష్టం కూడా సుఖమే, అనుకోవాలి _!
  "" కొందరికే   కష్టంగా ఎందుకు అనిపిస్తుంది ,,_? 
  ,ఎందుకు అలా అనిపిస్తుంది _? ,కష్టాల్లో కూడా  తేడా లు ఉంటాయా !"??
   ""ఉంటాయి  అనుకుంటే ఉంటాయో _! అసలు ఈ కష్టం  ఎందుకు వచ్చింది,,అనేది కేవలం  అత్మ విచారణ చేస్తే , నే తెలుస్తుంది,_!!
అత్మ  అంటే ఏమిటి _?అదెక్కడుంది _?
  అత్మ ,జీవుడితో కలిసి ఉంటుంది, _!అందరిలో జీవాత్మ  ఉంటుంది ,_! ,జనన మరణ చక్ర వలయంలో  తిరుగుతూ  జీవాత్మ  ఇలా కష్ట సుఖాలు అనుభవిస్తూనే ఉంటుంది _!"" _
"" అసలు ఎందుకు కష్టాలు వస్తాయి _?""
""  చేసే ప్రతీపనిలో ఫలితం కోరడం వలన ,, అది  కష్టం ,సుఖం రూపంలో  లభిస్తూ ఉంటుంది _!!, ఆ ఫలితం అనుకూలంగా ఉంటే సుఖం  గానూ ,,,ప్రతికూలంగా ఉంటే కష్టం గానూ ఉంటుంది _! ""
   _"" మరి ,అందరి కష్టాలు ఒకేలా ఎందుకు ఉండవు ?""
__" ఉండవు ,వారి స్వభావం గుణాలు కర్మలను బట్టి , కష్టాల తీరు మారుతూ ఉంటుంది _! వారి ఆకారం వలెనే ,వారి ఆలోచన _అదృష్ట దురదృష్ట అనుభవాలు కూడా  భిన్నంగా ఉంటాయి _!
,"అలా ఎందుకు  ఉంటాయి ,అందరం మనుషుల మే కదా _!"
అవే కాళ్ళు,,అవే  చేతులు,అదే  ఆకారం కదా_??"" _!"
   "" నిజమే _!  కానీ , గత జన్మలో చేసిన పాప ఫలాలు ఈ జన్మ లో వేధిస్తూ , ,జీవుడిని ఆ ఫలితాన్ని అనుభవించే లా చేస్తుంది _!_!""
__ ఏమిటీ _?గత జన్మ  ప్రభావం ఇప్పుడు_ ఈ జన్మలో  ఉంటుందా ? నేను నమ్మను _!""
సృష్టి నియమాలు అవి ,, , పుట్టక తప్పదు ,చావక తప్పదు ,కర్మలు చేయక తప్పదు ,అలాగే వాని ఫలితం మంచి అయినా చెడు అయినా ఎవరికైనా , రాముని కైన ,కృష్ణుడైన , మానవ జన్మ ఎత్తాక  అనుభవించక తప్పదు _!!""    ,మనం__"అందరం మనుషులమే అన్నావు కదా _ నీవు _!
మరి , అందరం అందంగా ఒకేలా ఆకారంలో స్వభావాల లో ఒకేలా ఎందుకు ఉండటం లేదు _! అంటే సృష్టి నియమాలు మనల్ని మన జీవన చర్యల్ని నియంత్రిస్తూ ఉన్నాయి ,అనగా నీవు స్వతంత్రుడ వు కాదు , ,_! ఉదాహరణకి ,,మనలో కొంతమంది గ్రుడ్డి వారు __, కుంటి ,అవిటి ,చెవిటి ,అంగ వైకల్యం తో ,వికారంగా కొందరు ,అందంగా కొందరు , కుబేరులు కొందరు ,దరిద్ర నారాయణ చక్రవర్తులు కొందరు ,పొట్టిగా ,పొడుగ్గా ,ఎర్రగా నల్లగా , అనిపిస్తూ ఉంటారు _!   ఇలా ఎందరు మనుషులు_ ఎన్ని దేశాల్లో , భూమిపై ఉన్నారో ,,వారిలో అన్ని  తేడాలు ఉన్నాయి,_!! అంతెందుకు __?!_ ఒక్క తల్లి కడుపులో పుట్టినవారు కూడా ఎన్నో  రకాల ఆకారాలు ,స్వభావాలు ,అనుభవాలు  కలిగి ఉండటం మనం చూస్తున్నాం కదా ,_!""
   " కష్టాలు  ఒకసారి ఎక్కువగా తక్కువగా , ఎందుకు అనిపిస్తాయి ?
,_"",ఎందుకంటే,ఇతరుల తో  పోల్చుకోవడం వల్ల  కష్టాల్లో హెచ్చు తగ్గులు అనిపిస్తూ ఉంటాయి _!
  __ ఎందుకు అలా అనిపిస్తాయి _??"
   __ కష్టాలు పడేవారు ,,తనకన్నా ఎక్కువ కష్టాలు పడేవారితో పోల్చుకుంటే , తమ కష్టాలు చిన్నగా అవుతాయి ,క్రమంగా ,, మరిచి పోతారు కూడా _!   ,,,కానీ ,వచ్చిన చిక్కే మంటే ఎప్పుడూ  ,తనకన్నా తక్కువ కష్టాలు పడే వారితో నే  పోల్చు కుంటాడు_ చిత్రమైన తత్వం గల  ఈ మనిషి _!_!""
  ,_"" కష్టం అనేది  రాకుండా ,కష్టం తెలియకుండా ,ఎవరైనా  ఉండవచ్చా ?"
__  ,"" బహుచక్కగా ఉండవచ్చు _!  కానీ దానికి నిరంతర సాధన అవసరం ఉంటుంది _!"
  ,""ఎలాంటి సాధన _ అది_? సులభమా  _? కష్టమా _??
  ___""   ,  చెప్పానుగా  కష్టం సుఖం  అనేది ,మన భావనలో ఉంటుంది అనీ_! ఈ కష్టం దైవారాధన కోసం వినియోగిస్తే అది  నీకు శాశ్వత సుఖాన్ని ఇస్తుంది _! కష్టం తొలగాలి అనుకుంటే , పరమాత్ముని ఆశ్రయించడమే , దారి_! వేరే మార్గం లేదు _!
"" అలా చేస్తే _ ఇక కష్టాలు రావా _? గత జన్మ కర్మ ప్రభావాలు  మనల్ని , బాధించవా _??"
    ,__  వచ్చే కష్టాలు  లేదా సుఖాలు అనుభవించక తప్పదు దేవుడైన సరే _!;  ఆ వ్యవస్థ ను దేవుడు కూడా మార్చలే డు , _!_ ప్రతివాడు విధిగా అనుభవించాలి  _, _ఎవరికైనా ,ఎంత భక్తుని కైన  తప్పదు __!
  "",అంతేనా _?  కష్టాలు తగ్గించలే ని ఆ   పరమాత్ముని  ఇక ఎందుకు పట్టుకోవడం ,_చెప్పండి _?""
""" ఇక్కడే ఉంది  మనిషి జన్మలో  తెలుసు కోవాల్సిన   అసలు కిటుకు __!""
""ఏమిటా కిటుకు _?  అంత రహస్యమా _?
""రహస్యమే ,_! అది బ్రహ్మ పదార్థం ,_!,ఎవరికి ఎన్నడూ ,ఎప్పుడూ కనపడని బ్రహ్మ రహస్యం _అది _!
""దయచేసి చెప్పండి _! నాకు కష్టాలు అంటే భయం ,, అవి రాకుండా చూసు కోవాలి నేను , దయచేసి , అపాయం తప్పించే  ఆ ఉపాయం చెప్పండి _!_""
   __ చెబుతాను ,, అక్కడకే వస్తున్నా __!మనిషికి జంతువుకు మధ్య తేడా ఏమిటి _ చెప్పండి ?
_   "" జ్ఞానం _!  భగవంతుడు దయతో మనిషికి అనుగ్రహించిన అమూల్యమైన అపురూపమైన వరం ఈ జ్ఞానం _!!"""
  ""అవును కదా _!  మీరు చెప్పినట్టుగా _ మనిషిలోఆ  జ్ఞానం పాళ్లు కాస్తా  ఎక్కువగా ఉంటాయి _!అయితే ఆ జ్ఞానాన్ని మానవుడు  తన ప్రయత్నం తో ,దాన్ని ఎంతైనా పెంచు కోవచ్చు ,,_! జంతువుల్లో ఆ సౌలభ్యం  లేదు _!,అందుకే మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటారు _!
నిజమే _! కానీ   సహజంగా తనలో నిబిడి అణగి అజ్ఞాతంగా ఉన్న ఈ  జ్ఞానం ఎలా  పెంపొందాలి  _!?
__ జ్ఞాన సముపార్జన కొరకు , సత్సంగం  చేస్తూ ,,సద్గ్రంద పఠనం కావిస్తూ, , సద్గురువుల ఆశ్రయం ,పొందాలి _; అలా,, సత్వ గుణ  సాధనతో ,  భక్తిమార్గం లో పయనించే వారికి వచ్చే  కష్టాలు,, దూది పింజ ల వలె చాలా  తేలిక అవుతాయి _!
""అంటే వారికి  జీవితంలో ఇక కష్టాలు రావా _? __"వస్తాయి కానీ , ఆ కష్టాలను పరమాత్ముని ప్రసాదంగా భావిస్తూ  వారు ,,  ఆ భారాన్ని అతడికే వదిలేస్తారు  ,,
""అంటే _ !?
ఆ  దేవుడే  దిగి వచ్చి వీరి పాప భారాన్ని ,ఈ కష్టాలను  భరిస్తా డా _?
_""లేదు ,  ఎవరు చేసిన కర్మను వారే అనుభవించక తప్పదు _!, కానీ ""జ్ఞానం"" అనబడే అగ్ని కణం తో కష్టం ,సుఖం ,పాపం పుణ్యం_ అనబడే గడ్డి కుప్పల ను భస్మం చేసే ప్రతిభ ,లభిస్తూ ఉంటుంది ,
   అవునా _?ఎలా __కాస్తా వివరంగా చెప్పండి _?
నేనుశరీరాన్ని ,కాదు ,_! నేను ,ఆత్మను ,_! అనడం తో ఏ కర్మలు నిన్ను బాధించవు _;  అత్మ సత్యం_!  ,,దీనికి  చావు పుట్టుకలు కష్ట సుఖాలు ఉండవు , నేను చేస్తున్న ,లేదా చేసిన కర్మల ఫలితాలు నేను త్యజిస్తూ ఉన్నాను ,,కష్టం అనేది శరీరానికి ,నాకు కాదు ,నేను పరమాత్ముని స్వరూపాన్ని ,,  నాలో పరమాత్ముడు  కొలువై ఉన్నాడు ,అతడు ప్రసాదము ఈ జన్మ ,ఈ శరీరం , ఈ ఆకారం , ఈ ప్రకృతి సంపద ,ఈ బంధువులు ఈ  అనుభవాలు ,, తినే అన్నం తాగే నీరు ,పుట్టిన స్థలం , భార్యా భర్తలు పిల్లలు తలిదండ్రులు అన్నీ ఆ దేవాది దేవుని అనుగ్రహం వల్లనే ప్రాప్తించాయి , ,దేవుడు ఎలా సాక్షిగా  చూస్తూ  ఉన్నాడో ,అలాగే  దైవ స్వరూపమైన నేను కూడా సాక్షిగా  వచ్చే పోయె  కష్ట సుఖాలను సాక్షిగా గమనిస్తూ  ,, కర్మలు చేస్తూ కూడా ,దానితో  సంబంధం లేకుండా ఉంటాను ,
""వాస్తవంగా "" కష్టం అంటే ,  నన్ను నేను  తెలుసు కొకపోవడం _! అన్నది  కష్టానికి సరియైన  నిర్వచనం _!""
  ఇక "సుఖం ""అంటే నా లోన __,నా చుట్టూ ఉన్న పరమాత్ముని తెలియ డమే _!
   ""_ ఎవరికి గోచరించనీ _  నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపుడైన ఆ  పరమాత్ముని మనం ఎలా తెలుసు కోవాలి , స్వామీ"? _?
  _""   ఆర్తితో ,ఆరాధిస్తూ ,,ఆవేదనతో  స్వామి దర్శనాన్ని  ఆపెక్షిస్తూ ,  నిరంతర  సాధనా ప్రక్రియ ద్వారా _ అణువణువున నిండి ఉన్న_ ఆ జగన్నాథుని ,, ఆ   పరమాత్ముని  అంతరంగంలో   అంతః శుద్ధితో దర్శించాలి __!ఈ మాంస నేత్రాలతో    పరమాత్మను చూసే వీలు లేదు _! ఎందుకంటే ,ఇది పరిమితం _!, ఇంద్రియాలు కూడా పరిమితాలు ,_; 
""అపరిమితం ,అనంతము అఖండమైన_ ఆ బ్రహ్మాండ నాయకు ని దర్శించాలి అంటే _ఆత్మ శోధన ,,ఆత్మ జ్ఞానం, ద్వారా ,నిరంతర సాధన ద్వారా ,, అకుంఠిత భక్తి మార్గంలో   అంకిత భావంతో,శరణాగత తత్వంతో , పట్టుదలతో  మాత్రమే సాధ్యం అవుతుంది _!; _మానవ జన్మ సార్థకం చేసుకోవాలి  అంటే ,,అతడికి ఉన్న జ్ఞానం  వినియోగించాలి _!
అలా చేయకుండా బ్రతికితే ,,  ఇవే కష్టాలు ,ఇదే జన్మ పరంపర ,ఇదే యాంత్రిక జీవనం , ""_! అంతా వృధా_! మనం పడుతున్న వ్యర్థ ప్రయాసలు, వృధా _!
  అందుకే ,,
""జాతస్య ధృవో మృత్యుః__!""__
అని భగవద్గీత లో గీతాచార్యుడు ఉపదేశ అనుసారం గా ,
""తస్మాత్ జాగ్రత్త _!""
""మళ్లీ మళ్లీ రాదు ఈ మానవ జన్మ _!"
ఉన్నపుడే తెలివిగా_ నీ జీవన విధానాన్ని పరమార్థ చింతన కోసం  ఉపయోగించు కో _!"
ప్రతీ క్షణం భగవంతుని సేవకు స్మరణకు , భజనకు , వినియోగించు _!
"" నీవు భావించే , ఆ కష్టాలు__ నీవు చేస్తున్న  సంగత్వం తో నే  వస్తాయి ,_!;అనగా  చేసే పనుల ఫలితాలకు నీవు  అంటుకు పోతే   అదే  నీకు విడదీయరాని బంధంగా  , తొలగించలేని కష్టం గా _ అవుతోంది ! అనగా కష్టాలు అనేవి నీ స్వయం కృతా పరాధా లు గా   నీకు సంక్రమిస్తు  ఉన్నాయి _!
  అందమైన ,, సుమధుర ,పుష్పాన్ని  చెట్టునుండి కోసి ,ప్రేమతో ,నీవు , నీ  భార్యకు ఇస్తే  అది స్వార్థం అవుతుంది _!
పరమాత్ముని చరణాల ముందు ,లేదా గురువు ఫోటో ముందు భక్తితో  సమర్పిస్తే _ అది _"పరమార్థ చింతన అవుతుంది
ఇక్కడ నీ చేతి లోని  పూవులో మార్పు లేదు _; _!
చేసే విధానం లో భావన లో  _ సమర్పణ భావం లో ,మార్పు ఉంటుంది
__ అందుచేత ,,మనం అనుకునే ఈ  కష్టాలు__ మనలోని  గుణాల వలన , చేస్తున్న  ,కర్మల వలన  కలుగుతాయి _!
  పరమాత్మ భావన తో  ఆ కర్మలు చేస్తే  _ బంధ విముక్తి కలుగుతుంది ,,_!
అవి మనల్ని అంటవు _! ఎందుకంటే  సాక్షి వలె ,  వాటిని అంటకుండా ఉన్నాం కనుక _!!
ఇక ఏ కష్టమూ నిన్ను  బాధించదు ,,_! 
   కష్టం నీకు వచ్చినా, నీ బంధువులకు వచ్చినా,నీవు  ఏడుస్తా వు కదా _!
ఉచితంగా ఉదారంగా ప్రేమగా , ఇన్ని  సౌకర్యాలు కల్పించి అనందంగా జీవించమని పంపించిన ఆ పరమాత్ముని కోసం ఎపుడైనా ఏడ్చావా _? , అయ్యో_! నేను ఎంత పాపిని _!;"అతడిని సేవించలేక పోయాను గదా ,_?? భక్తితో  భజన ,స్మరణ తపన , భావన , అత్మ సమర్పణ చేసు కొలేక పోయాను కదా , _!!"అయ్యో  __! రామా _!! విలువైన కాలాన్ని  _ వ్యర్ధం చేస్తూ ,,సంసారసుఖం కోసం వెంపర్లాడటం కోసం వృధా  చేశానే ,,,కానీ ,,  జన్మ  బుద్ది జ్ఞానం వైభవం సంపదలు  ఎన్నో  ప్రసాదించిన  ఆ భగవంతుని  గురించి   ఆలోచించ లేక __ మూర్ఖంగా అజ్ఞానంతో  గడిపానే  అంటూ  ఎప్పుడైనా బాధ పడ్డావా _!?  కృష్ణుని నీల మేఘ శ్యామ సుందర రూపం  దర్శించలేని మంద భాగ్యుడను  అయ్యాను కదా _! కళ్ళు ఉండి కూడా కన్నయ్యను  గుర్తించలేని గ్రుడ్డి వాన్ని అయ్యాను కదా _!! ఈ విధంగా పరితపిస్తూ, ,
__ వృద్దాప్యం వచ్చాక చింతించే దౌర్భాగ్య స్థితి దాపురించక ముందే ,_ నీలో దాగిఉన్న సహజమైన జ్ఞానంతో  ___ తత్వమ సి అను తత్వ జ్ఞానం ద్వారా,,  ""నీవు  ఎవరివో ,, తెలుసుకునే ప్రయత్నం చేయాలి _!!"
__""గడచిన కాలం ముందుకు రాదు _!, నడుస్తున్న కాలం నీవు  ఆపలేవు ._! వర్తమానం లో బంగారు భవిత కు _పునాది వేసే ప్రయత్నం చెయ్యి _!
నీ ముందు ఉన్న కాలాన్ని_ శక్తిని జ్ఞానాన్ని ,భక్తితో,, జ్ఞాన సముపార్జన కొరకై ,పరమాత్ముని సన్నిధానం లో జీవితాన్ని గడపడానికి  ఉపయోగించాలి ,_;
   మనమందరం కూడా __అలాంటి అద్భుత వైభవ భావ సంపద ను అనుగ్రహించమని  , కోరుకుందాం _!
_""అతడి సేవయే సుఖం_!
ఆ యోగం కోల్పోతే కష్టంగా భావించాలి__!""
_""హే   సర్వేశ్వరా _!
"నేను ఆశక్తు డను _;!అఙ్ఞాని ని _!
అహంకారి ని _! మహా పాపిని , స్వామీ _!" నారాయణా _!""
నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయని
నా  ఘోర అపరాధం దయతో కనికరించి  క్షమించు  తండ్రీ _! కృపా నిది_! ఆశ్రిత జన వత్సలా _! ఆపద్బాంధ వా __!;
   అపురూపమైన ,, అమోఘమైన  వరప్రసాదంగా  నాకు అనుగ్రహించిన , ఈ జన్మకు   తగిన యోగ్యతను, జ్ఞానాన్ని , అనుగ్రహించి. నన్ను నీ దరికి చేర్చు కో _!  ఈ దీను ని మొర ఆలకించి , ఈ జన్మకు  నీవే  విలువ కట్టి_ _ దానికి _ సార్థకతను    అనుగ్రహించు  ప్రభూ _!
శరణు  ఈశ్వరా _!
శరణు  పరాత్పర_!
శరణు  పరమేశ్వరా _!
శరణు శరణు శరణు_!
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా_!!"

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...