పుట్టిన ప్రతి మనిషి - ముగ్గురికి రుణ పడి ఉంటాడు --జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు -- ధార్మిక మైన జీవనం గడపడానికి -శాస్త్రాలని అందించిన ఋషులకీ--మరియు ప్రాణుల్లో కెల్లా అతి ఉత్కృష్ట మైన మనిషి జన్మ ప్రసాదించి --అందమైన ప్రకృతిని అనుభవించి ఆరాధించడానికి -కారకుడు అయిన ఆ పరమాత్మ కు రుణపడి ఉంటాడు -!
1 -- తలిదండ్రులు సజీవులుగా ఉన్నపుడు వారిని సేవించుకోడం ద్వారా - వారు గతించాక శ్రాద్ధ కర్మల ద్వారా వారికి ఋణం తీర్చుకుంటాం
2 -- ఇక రామాయణాది శాస్త్ర గ్రంధాలు పఠించి - సాంప్రదాయం -సంస్కారం నేర్చుకుని గీత లో చెప్పినట్లుగా మానవ జన్మను సార్ధకం చేసుకోడం ఎలా ? జగద్గురువులు ఆది శంకరాచార్యులు లాంటి వారు వ్యాస వాల్మీకి ఋషులు- మన భారత భూమిలోనే ఆవిర్భవించి ఆవిష్కరించారు - మనిషి ధార్మిక జీవనానికి ఉపకరించే -విధంగా ఎన్నో స్తోత్రాలు కృతులు - -అందజేశారు--! చదివి -మననం చేసుకుని - ఆలోచించి ఆచరించి తరించడానికి -- అమూల్యమైన అద్భుతమైన సంపదను మన భారత జాతికి అంద జేశారు - అవి లేకపోతె మనం లేము --
చరిత్ర లేని మనిషికి మనుగడ లేదు --అట్టి మహా ఋషుల ఋణం --వారు అందించిన సశాస్త్రీయమైన అనుకరించి -అన్వయించుకుని --ఇహపరాలను సాధించడం ద్వారా --ఋషుల ఋణం తీర్చుకోవాల్సి ఉంటుంది -- గోత్రం ప్రసాదించింది ఋషులే !గోత్రాభి వృద్ది రస్తు ! అంటే-
ఋషుల దీవన వల్ల మన బ్రతుకు ధన్యమౌతుంది
సంద్యావందనంలో --ఆ ఋషుల సంస్మరణ ఉంటుంది --వారు మనకు జ్ఞానం ఇచ్చిన తోలి గురువులు - గురువు కరుణ వల్లే మన దారి సుగమం అవుతుంది -- హరితస -ఒక మహర్షి - యవనాశ్వ మరొకరు -అంబరీషుడు మూడవ మహర్షి !
౩-- ఇక దైవ ఋణం -- అనుదినం ఇస్తా దైవాన్ని స్మరించుకోడం -- ఆలయాలకి వెళ్లి -- మరువకుండా మదిలో నిలుపుకోడం -- పూజలు - నోములు --వ్రతాలు -యజ్ఞాయాగాది క్రతువులు -చేయడం --పవిత్ర నదుల్లో స్నానం చేయడం --ప్రముఖయాత్రా స్తలాలను దర్శించడం ద్వారా దైవ ఋణం తీర్చుకో వచ్చును
సర్వే జనాః స్సుఖినో భవంతు --సమస్త సన్ మంగళాని భవంతు -- ఓం శాంతి !శాంతి ! శ్శాంతి !
--------- శ్రీ శుభమస్తు ----
No comments:
Post a Comment