Thursday, December 20, 2018

గోపికల భక్తి

Dec 21, 2018

దైవభక్తి లో గోపికల భక్తి అత్యుత్తమం .అంటారు  !.ఎందుకంటే  "తనువు, మనసు ,ప్రాణము "" సర్వమ్ కృష్ణమయమే !అనుకుంటూ శ్రీకృష్ణుని స్మరిస్తూ ,దర్శిస్తూ భావిస్తూ ,సేవిస్తూ శ్రీకృష్ణ నామం జపిస్తూ. అహం కృష్ణా ! నేనే కృష్ణుణ్ణి ! అంటూ శ్రీకృష్ణ సాన్నిధ్యంలో ,కృష్ణ పరిశ్వంగంలో తన్మయులై తరించారు !ఉన్నట్టుండి ఒకేసారి ,తమ ప్రియతమ నాయకుడు, కృష్ణుడు కనపడకుండా పోతే , గోపికలు పిచ్చివాళ్ళవలె , ఉన్మాదంతో ,,శ్రీకృష్ణ విరహాన్ని , తాపాన్ని ,భరించలేక  అంతటా వెదికే ప్రయత్నంలో నవవిధ భక్తులతో కృష్ణజీవనం అనుభవించారు ! ,కృష్ణుని రూపగుణ వైభవాలను ,మాటలను, చేష్టలను బాలకృష్ణుని లీలలను , నటిస్తూ , అభినయిస్తూ, తామే కృష్ణుని గా భావిస్తూ  ,రసవంతంగా కృష్ణసౌందర్య అమృతతుల్య వైభవాన్ని వర్ణిస్తూ  ,తన్మయతతో  పారవశ్యతను అనుభవించారు. శ్రీకృష్ణ ఆధరామృతం గ్రోలాలని ఉవ్విళ్లూరారు. అంటే శ్రీకృష్ణుని పెదాలపై ముద్దు పెట్టాలన్న వాంఛతో కాదు..! శ్రీకృష్ణుని ఆధరాలు మధురం!. అధరాలపై కదిలే చిరునవ్వు మధురం..! రూపం , భావం ,శిఖిపించం. అన్నీమధురాలే..!కృష్ణయ్య నోటినుండి వచ్చే తీయని పలుకులు.. వాగామృతం కదా ! పండితులు వేదాంతులు కూడా మెచ్చుకుని ఆనందించే శ్రీకృష్ణలీలామృతం కూడా కన్నయ్య ఆధారామృతం కదా ! మరీ మరీ త్రాగాలనిపించే శ్రీకృష్ణ గానామృతం మధురం ! మధురాతిమధురం"! ముక్తిదాయకము ,సకల దుఃఖశమనము ,సర్వ పాపహరణము కృష్ణయ్య అనే పిలుపు లోని మధురభావన ! యోగులు సిద్ధులు ,పౌరాణికులు ,జ్ఞానులు ఇలా ఎందరో మహానుభావులు వెవేనోళ్ళ కొనియాడారు నందకిశోరుని చరితలను ,లీలలను భాగవతం లోని దశమస్కంధం లో బాలకృష్ణుని  అద్భుతమైన బాల్య లీలలను వర్ణించి దర్శించి ,లిఖించి కృష్ణభక్తులను ధన్యులు గా చేశారు !    "నన్ను పొందాలంటే  ముందుగా భక్తులు తమ "ఆత్మ సమర్పణ" చేసుకోవాలి !.అందుకు తమ లోనున్న అరిషడ్వర్గాలతో బాటు సకల సంపదలను," నాది! నేను  !"అనే భావనలను తొలగించి, నాలో ఐక్యం చేసుకుంటాను. అందుకు యోగ్యత కోసం నేను పెట్టె పరీక్షలు  కష్టాల రూపంలో వస్తాయి. గజేంద్రుని వలె ,ద్రౌపది వలె ,ప్రహ్లాదుని వలె ఎన్ని దురవస్థల పాలైనా  కూడా ,నన్ను శరణాగతి కోరేవారు  ,,నా భక్తులలో శ్రేష్ఠులు ! ఇలా నేను వారికి దూరంగా ఉండడం వలన.. గోపికల హృదయాల్లో నిండిన పరిపూర్ణ భక్తి,వారు పొందే విరహావేదన, శోకసంద్రంలో మునగడం తో పరాకాష్ట అవుతుంది.! వారి వేదనాభరిత శోకంతో గతజన్మ కర్మలు నశిస్తున్నాయి  ! నన్ను ఆశ్రయించడానికి సంపూర్ణ సిద్ధిని ఇస్తున్నాయి !., ఇక రాధాదేవి అనుగ్రహం తో రాసలీల ద్వారా వారంతా  నా గోలోకం లో చేరగలుగు తారు.!.."" అంటాడు శ్రీకృష్ణుడు .!.నిజమే కదా..! గోపికలంతా తమ సంపూర్ణ భారాన్ని ,నల్లనయ్య కు వదిలేసి, త్రికరణ శుద్దిగా భావించి సేవించి తరించారు..,!,ప్రతీ మనిషి తమ జీవితంలో భార్య భర్తపై, భర్త భార్య పై. మంగళసూత్రధారణతో,నమ్మకాన్ని పెంచుకుంటారు ! తోబుట్టువులు సోదరులపై , రక్షా ధారణతో ,వృద్ధులు తమ సంతానం పై  మమకారం ,భరోసా తో నమ్మకం గా   మనోధైర్యాన్ని పొందుతారు ," వీరు  ,నావారు !నాకు ఎల్లప్పుడూ తోడు ఉంటూ నా యోగక్షేమాలు చూస్తారు !" అనుకుంటారు ,! కానీ ఇంతగా బందుబలగాన్ని ,ఐశ్వర్యాలను ,వీటిని అనుభవించే ఆరోగ్యాన్ని,స్తోమతను అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ పైన మాత్రం తమ జీవితభారాన్ని మోపడానికి సందేహిస్తారు. !  నమ్మరు !  ఎందుకంటే గతజన్మ సంస్కారాలు అడ్డుపడుతాయి ,వివేకం ,విచక్షణ ,దైవ భావన లను కోల్పోతారు.. పశుత్వం నుండి మానవత్వం లభించింది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ! ఇక మానవత్వం నుండి దైవత్వాన్ని పొందాలంటే అందుకు దైవాన్ని ఆరాధించాలి సాధన ,చిత్తశుద్ధి ,భావ సంపద అత్యవసరం ! దైవం మనలోనే ఉంటూ కూడా జీవితచక్రాన్ని నడిపిస్తూ కూడా ,,అది సరిపోకుండా మన,ఎదుట. తల్లిగా  ,తండ్రిగా ,కొడుకు ,కూతురు ,బంధువు ,స్నేహితులు ఇలా మన కుటుంబ పరివారం తో నిరంతరం ప్రత్యక్షంగా ఎదుట కనిపిస్తున్న వారంతా శ్రీకృష్ణ లీలావతారాలే కదా..! చెట్టు చేమలు, కొండలు కోనలు ,నదీ నదాలు సముద్రాలు ,పూవులు ,ఆకులు,, ఇలా సమస్త సృష్టికి సౌందర్య ప్రకృతికి మూలం తానై ,అద్భుతమైన ప్రకాశంతో ఆనందాన్ని పంచుతున్న పరమాత్మ ను విశ్వసించడానికి మాత్రం సంకోచిస్తున్నాం మనం...!!ఇదంతా ఈ కలియుగ మహాత్మ్యం.! దీనికి పరిష్కారం ఒకటే,,! నిరంతర హరినామ స్మరణ. సకల దోషాలను ,పూర్వజన్మ కర్మలను ,నశింపజేసి దివ్యమైన ఉత్కృష్టమైన మానవజన్మను ధన్యం చేస్తుంది !..శ్రీకృష్ణ భగవానుని భావించి సేవించే అర్హతను ఇస్తుంది..! అందుచేత ఈ క్షణం నుండి అనునిత్యం  ""హరే కృష్ణ హరే కృష్ణా !"అంటూ బాహ్యములో భావంలో శ్రీకృష్ణ నామ మంత్రంకానీ ,"మహాదేవ మహాదేవా "అంటూ శివనామాన్ని గాన్ని  జపించుదాం .!పరమాత్ముడు ప్రసాదించిన జన్మను సార్ధకం చేసుకుందాం!.. జై శ్రీకృష్ణ ! జై శ్రీరామ్ ! హరహర మహాదేవా !

Sunday, December 9, 2018

అయ్యప్పస్వామి దీక్ష

అయ్యప్పస్వామి దీక్ష నిజంగా అద్భుతం ,ఆ ఆనందం అనుభవైకావేద్యము. లక్షలాది అయ్యప్పస్వామి భక్తులు ఏటా స్వామి దీక్షలో తరిస్తూ. సనాతన హిందూ ధర్మ సంప్రదాయం నిలబెడుతున్నారు.

ఎన్నో శారీరిక మానసిక ఒత్తిడులకు, కష్టాలకు ,ధన వ్యయ ప్రయాసలకు ఓర్చి , శబరిమల దర్శనా భాగ్యం పొందడంలో కృతకృతులు అవుతున్నారంటే  అందుకు అయ్యప్పస్వామి  కరుణ ఎంతగా ఉంటుందో ఉహించుకోవచ్చును మండల రోజులు ,ఇహాసౌఖ్యాలను ప్రక్కన బెట్టి కేవలం పరం గురించి అంటే అయ్యప్పస్వామి సేవ పూజ స్మరణ చింతనతో ,తరించడం జన్మ ధన్యం చేసుకోవడమే కదా ! .

తాము ఇన్నాళ్లూ సంసారంలో ఉంటూ ఇప్పుడు దీక్షా కాలంలో ,దేనికి అంటకుండా తామరాకు పైన నీటి బిందువులా ఉండడం సామాన్య విషయం కాదు కదా ! "మనసుతో " హృదయంలో అయ్యప్పస్వామి ని ప్రతిష్టించుకొంటు." వాచా" అంటే "స్వామి శరణం అయ్యప్ప శరణం!" అంటూ శరణుఘోషతో జీవిస్తూ "కర్మణా "అంటే వేషధారణ లో నల్లబట్టలు వేస్తూ,మెడలో మాలధారణ తో ,నుదుట విభూతి ధారణ తో ,త్రికరణ శుద్దిగా ,మనసా వాచా కర్మణా , అయ్యప్పస్వామి ని  సేవిస్తూ ,జీవిస్తున్న అయ్యప్ప భక్తులు నిజంగా  ధన్యులు !పుణ్యాత్ములు కూడా ! పూజలు తెలియవు , పూజావిధానాలు అసలే తెలియవు !. శాస్త్రాలు , పురాణాలు  ,ధర్మాలు  ఇవి ,ఏవీ కూడా తెలియవు.! దేవుడు ఎలా ఉంటాడో ,ఎక్కడ ఉంటాడో?  కూడా తెలియదు..! తెలిసింది ఒక్కటే ! అయ్యప్పస్వామియే దేవుడు.!. శబరిమల అతడి కోవెల నివాసము..! గురుస్వాములే వారి మార్గదర్శకులు !.. వారిని "తూచా  "తప్పక అనుసరిస్తూ వారి ఆజ్ఞను శిరసావహిస్తూఈ మండలదీక్ష చేయడమే స్వాముల  జీవిత లక్ష్యం..! అంతే వారికి తెలిసింది ! ఎంత విశ్వాసమో మనకు అంత ఫలితాన్ని ఇస్తాడు దైవం  ! కదా !అదే ఒక్క నమ్మకం తో అయ్యప్పస్వామి భక్తులు ఏ ఆటంకం ఇబ్బంది ఎదురు లేకుండా విజయవంతంగా దీక్షలు ముగిస్తున్నారు ఏటా !! 

దేవుడు ఉన్నాడు.! నాలోనే! ,నాతోనే! నావెంటనే ,!నాయోగక్షేమాలు  చూస్తూ.! నన్ను నిరంతరం కనిపెడుతూ ఉంటాడు! అసలు ,నేనే దేవుణ్ణి !నేనే అయ్యప్పస్వామి ని  !"" అన్న నమ్మకం  ప్రతీ మనిషిలో యువతలో ,చిన్నా ,పెద్దా, ముసలి ,పేద, ధనిక బేధం లేకుండా, దీక్షలు తీసుకుంటూ చలికి చన్నీటికి ,వెరవకుండా ,ఏకభుక్తం,, పడి పూజలతో, నిత్య అర్చన పూజ లతో ఆనందంగా దీక్షను నిర్వహిస్తూ దైవకృపకు యోగ్యతను పొందుతున్న అయ్యప్పస్వామి భక్తులకు శతాకోటి ప్రణామాలు.!

ఎక్కడో ,అడవిలో, కొండల్లో, కొనల్లో ,పిలుపుకు అందనంత దూరాన ఉంటూ కూడా ,తనను నమ్మినవారిని ,తన భక్తులను అక్కున చేర్చుకుంటూ. వారి మనో వాంఛలను, శారీరిక ,మానసిక రుగ్మతలను తొలగిస్తూ వారికి కావలసిన  ఆరోగ్యాన్ని ,ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ,ధనాన్ని ,సంసారంలో అభ్యున్నతి నీ, ఇస్తూ , ఇలా శరణాగతి చేసేవారినందరిని తన కారుణ్య కటాక్ష వీక్షణాలతో సంరక్షిస్తూ.". మీకు నేనున్నాను !" ఎప్పుడూ మీకు తోడుంటాను ! భయపడే అవసరం ఏ మాత్రం లేదు  !""అంటూ తన భక్తులకు  సదా తాను స్వయంగా ,తొడునీడై ఉంటున్న  అభయప్రదాత మన అయ్యప్పస్వామి కి కోటికోటి ప్రణామాలు.! సాష్టాంగ నమస్కారాలు ఎన్ని చేసినా  ,చేస్తున్నా కూడా  ఆ,స్వామి రుణం తీర్చుకోలేం కదా ! స్వామీ , శరణు ! అయ్యప్పా శరణు ! శబరిగిరీషా శరణు! 

ఇలా నీ స్మరణ ,నీ దీక్ష ,నీ సేవ  ,నీ ఇరుముడి మోసే అదృష్టం ,నీ వేషధారణ , నీ మకరజ్యోతి దర్శనం ,నీ సుందర మంగళ విగ్రహ దివ్య దర్శనా భాగ్యాన్ని  సదా మాకు  అనుగ్రహిస్తూ, మమ్మల్ని కాపాడుకో , స్వామీ  !!అన్నెం  ,పున్నెం ఏమీ ఎరుగని అమాయక , అజ్ఞాన ,మానవ ప్రాణులం! నిత్యానిత్యం ,, సత్యాసత్యం  ,పాపం పుణ్యం ,ధర్మాధర్మాలు  ,ఇవి ,ఏవీ తెలియని మూడులము ! మూర్ఖులం! అన్నింటికీ మించి మహా పావులం  కూడా.  ! స్వామీ క్షమించి నీ సేవలో తరించే అవకాశం ప్రసాదించు ! స్వామీ ! అయ్యప్ప !  మమ్మల్ని ఇలాంటి దీక్షావైభవం  ఏటా ఇస్తూ, మా జీవితాలు పండించు ! నీపై చెదరని భక్తిని ,బుద్దిని, నమ్మకాన్ని అనుగ్రహించు ! సకల జనావళిని చల్లగా చూడు తండ్రీ ,! స్వామీ! అయ్యప్పస్వామి ! శరణు! శరణు !శరణు!

వైవిద్యం

ఒక సినిమా ,లేదా ఒక సన్నివేశం, ఒక వ్యక్తి ,సంఘటన గురించి చెప్పే అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఒకే రకంగా ఉండవు. అందరిదీ ఒకే మానవ శరీరం.. కానీ ఆలోచనలు వేరు ,అభిప్రాయాలు వేరు. ఒక్క తల్లి కడుపులో పుట్టిన కొడుకుల్లో కూతుర్ల లో ఎన్నో వైవిద్యాలు , సంపద,ఆస్తి ,సంతానం, నివాసం ,ఇలా ఎన్నో రకాలుగా ఉండడం నిత్యం చూస్తున్నాం.. అంతెందుకు. ఒక సంఘటన గురించి ఇప్పుడు చెప్పిన అభిప్రాయం రేపు మారుతుంది.. అంటే క్షణం క్షణం మనుషుల ఆలోచనల్లో తేడా , ఎందుకు వస్తోంది ? కారణం చూసే చూపు ! అనుకునే తీరు ,దృక్పథం లో తేడా ! దీనికి కారణం సంస్కారం ! గత జన్మ జన్మల కర్మ ఫలాల అనుభవాలు ఇప్పుడు దర్శిస్తున్నాము.. ఈ ఆధునికత ముసుగులో దైవ దర్శనానికి , ఇడ్లి సాంబారు జీవించడానికి తేడా లేకుండా పోయింది.. భోజన చేస్తుంటే తినే ఆహారపదార్థాల ఆస్వాదనతో కొంత రసానుభూతిని పొందుతున్న విషయం తెలిసిందే ! ఉదయం లేచిన సమయం నుండి పడుకునే వరకు ఎన్నింటినో దర్శిస్తూ ఉన్నాము. స్పందిస్తూ ఉన్నాము. భార్య ను చూసి భర్త ,పిల్లల్ని చూస్తూ తల్లిదండ్రులు, స్నేహితులతో ,బంధువులతో ఇలా చేసే ప్రతి దర్శనంతో మనసు స్పందిస్తూ, దానిని గురించిన రసానుభూతిని పొందుతున్నాము.. అందులో ఒకటి దైవాన్ని దర్శించడం.. అది జగన్మాత, కావచ్చును! రాముడు ,కృష్ణుడు ,ఎవరైనా కావచ్చును , ఆ సమయంలో కలిగే స్పందన తాత్కాలికంగా., ఉంటోంది. అందులోని  ,రసానుభూతి అంతగా  బాధించడం లేదు , అంటే మన నిత్య జీవితంలో అనుభవానికి రావడం లేదు.. సంసారంలో వెంబడిస్తూ ఉన్న జ్ఞాపకాలు ,,ఆనందాలు ,అనుభూతులు అనునిత్యం, అనుక్షణం మనసులో తిరుగుతూ ఉంటున్నాయి .కానీ దేవాలయంలో, ఇంటిలో ,క్షేత్రాలలో, యాత్రా సందర్శనంలో దర్శించున దేవతల ,దేవుళ్ళ  దివ్య వైభవ మంగళక ర రస రమ్య మూర్తుల కాంతులు మనలో మాటిమాటికి, తరుచుగా ,పదే పదే ,ఎక్కడవుంటున్నా ,ఎందుకు  కలగడం లేదు. ఎన్ని సార్లు తిరుమల వెళ్ళాము అన్నది కాదు ముఖ్యం..స్వామి మూర్తిత్వాన్ని ప్రతీ సంఘటన లో అనుభవానికి తెచ్చుకుంటూ ,ఆనందపారవశ్యాన్ని పొందడం ముఖ్యం కదా.! ఎలాంటి అసభ్యకరమైన లేదా మనోరంజకమైన దృశ్యాలను ఈ కన్నులు చూడకుండా ఉండలేవు.. ఆ దృశ్యాల్లో కదలాడే వ్యక్తుల ప్రతిబింబాల నీడల్లో స్వామి మహాత్మ్యం చూస్తూ ,రసానుభూతిని పొందితే అది స్వామి నిజమైన దర్శనం అవుతుంది కదా ! అలాగే ఇది పాపపు మనసు ! ఏది చూడకూడనిదో దానినే పంతం పట్టి చూస్తుంది  హృదయంలో దాగినకామ క్రోధ ఈర్ష్యా ది రసాలతో మనసారా గ్రోలుతుంది.. కానీ ఈ మనసును ప్రేరేపించే మూల తత్వ ము నీవే నని, అంతరంలో బాహ్యములో ఉన్న అంతర్యామిగా అందరిలో అణువణువునా ఉన్న స్వామి అనుగ్రహం తో నే ఈ ఆనందం ఈ రసానుభూతి కలుగుతున్నాయి అనే భావ సంపదతోనే   మనసు,దానితో మనిషి ధన్యం అవుతోంది కదా !ఇక కష్టసుఖాలు అనుభవించే ఈ శరీరం, స్వామి కారుణ్యం వలన ప్రసాదించబడటం వల్లనే కదా జగతిలో ఉన్న ఆనందాలు రసానుభూతులు పొందగలుగు తున్నాం.. !అందుచేత పంచేంద్రియాలను కరుణించి, మానవ జీవితాన్ని చక్కగా enjoy చెయ్యమని ,ఆనందించమని ,అనుభవించమని ఇచ్చి న పరమాత్మ కు మనం చేయవలసింది చేయ గలిగింది ఒక్కటే సర్వమ్ పరమేశ్వరార్పణ మస్తు ! రామార్పణమస్తు ! కృష్ణార్పణమస్తు ! జగదాంబ విశ్వపాలిని చరణారవిందార్పణమస్తు అన్న దైవారాధన భావం హృదయంలో ఉండాలి. ఇష్టదైవాన్ని చూసినా తలచినా కొలిచినా పాలపొంగులా ఆనందంతో ఉత్సాహంగా ఉవ్వెత్తున మనః పూర్వకంగా భావిస్తూ తన్మయత్వం తో  పరవశించాలి  .సర్వాంతర్యామి యైన పరందాముని కృపా కరుణా కటాక్ష వీక్షణాల సంప్రోక్షణ ప్రాప్తికై ఆర్తితో ఆవేదనతో ఆరాటపడాలి.. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కదా ! ఇన్ని ఇచ్చిన ఆ స్వామికి కృతజ్ఞతతో దండం పెట్టకుండా ,అంతటా స్వామిని దర్శించకుండా మరిచి పోవడం ,నిర్లక్ష్యం చేయడం కృతఘ్నత అనిపించుకొదూ !

Saturday, December 1, 2018

చలికాలం జాగ్రత్తలు

చలికాలం జాగ్రత్తలు
1 )   గోరువెచ్చని.వేడి నీరు త్రాగండి
2 )నూనెతో రెండు చేతులూ 5నిముషాలు నలపండి  తిమ్మిర్లు రాకుండా
3.) రాత్రి భోజన సగం కడుపుకు 8pm లోగా తినండి .
4 ).ఫ్రిడ్జ్ లో నీరు పాలు పెరుగు ఏదైనా త్రాగవద్దు   5) స్త్రీలు ,పురుషులు అరగంట వాకింగ్ తప్పనిసరి గా చేయాలి
6 ) వేడి భోజనం మాత్రమే తినాలి
7 ) 6am వరకు లేవాలి
, 8) వేడినీటి స్నానం తప్పనిసరి
9) పొరబాటున కూడా మధ్యాహ్నం నిద్ర వద్దు
10) టీవీ ల తో బద్దకం , నడుం నొప్పి ,కళ్ళు త్రిప్పడం లాంటి అవస్థలు తగ్గాలంటే  ఎక్కువసేపు కూర్చోవద్దు
11 )  ఫోన్లు  ,,,- అవి అనారోగ్యానికి మూలం అవుతున్నాయి ,నియంత్రణ చేద్దాం.. ముఖ్యంగా పిల్లలకు అందనీయకుండా చూద్దాం.
12 )  సంతోషమే ఆరోగ్యానికి మూలం అది దైవస్మరణ తోనే సాధ్యం నిరంతరం హరినామ చింతనతో  ఆనందంగా గడుపుదాం .
13) అందరితో తృప్తిగా కలిసి ఉంటూ . ఆలయాలకు వెళ్తూ ,,ఇంట్లో అరగంట దేవుని ముందు పూజ చేస్తూ , విధిగా భగవద్గీత  శ్లోకాలు రోజుకు కనీసం ఒక్కటైనా నేర్చుకుంటూ చదువుతూ మన పిల్లలకు మార్గదర్శకులం అవుదాం 
14)  సత్సంగాన్ని ఏర్పాటు చేద్దాం సామూహికంగా విష్ణుసహస్ర నామాలు ,లలితా పారాయణాలు అధ్యయనం చేద్దాం 
15) ! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ అంటూ ఎదైనా ఒక భజన మనకున్న తీరిక సమయాలలో  చేద్దాం

దేహమే దేవాలయం

Nov 28, 1018
భగవన్తుడు మనకు అందమైన దేవాలయం అనబడే ఈ  దేహాన్ని ఇచ్చాడు,, అనుభూతులను, ఆనందాన్ని ,ప్రశాంతత ను పొందడానికి.. ! ఎదురుగా అంతటా  తానే స్వయంగా అణువణువునా నిండి. రమణీయంగా. కమనీయంగా ,మనోహరంగా పువ్వులో ఆకులో నీటిలో నింగిలో  ప్రకాశిస్తూ "దైవం ఎంత అందంగా ఆనందంగా ప్రశాంతంగా ప్రమోదంగా , "" ఉంటుందో తెలియజేస్తూ ఉన్నాడు ! ప్రాణికోటి కి సంపదలతో బాటు సంతృప్తి ని ప్రసాదించడమే ద్యేయంగా ,ఆనందాన్ని వివిధ రంగుల్లో విరాజిల్లుతూ ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందమే ఆనందం అన్న భావనతో ,  , దైవానికి ప్రతిరూపంగా మనోజ్ఞంగా కర్మసాక్షి సూర్యభగవాను ని అరుణకిరణాల తో ఏర్పడే రంగురంగుల రంగవల్లుల సింగారాల శృంగారాల మేలిమి బంగారు కాంతులు  వినీలాకాశంలో  కన్నుల విందు చేస్తూ అగుపిస్తూ ఉంటున్నాయి. పచ్చని పొలాల్లో ఊరికి బయట అడవుల్లో మేఘాలను తాకే మంచుకొండల  దృశ్యాలు , సెలయేర్లు, వాగులు ,పచ్చని బయళ్లు ,, చెట్లూ, చేమలు, అన్నీ ప్రకృతి మాత సోయగాలే..! ప్రకృతి సంపదలే ! దైవారాధన కు నిలయాలే ! సహజ సిద్ధంగా వెలసిన స్వచ్ఛమైన పవిత్రమైన పరమేశ్వర నిలయాలుగా కొలువు దీరే దేవాలయాలే కదా !  రాధామాదవుల రాసకేళి విలాసవంతమైన అందాల బృందావనాలే  !   అద్భుతమైన చిత్ర రచనలు.ఆ ప్రకృతి సొగసులు  ! కవితకందని సాహిత్యాలు.  ఆ జగదేకసౌందర్య లావణ్యాలు ! అవి  అన్నీ మనం  భావించి పూజించి సేవించుకునే  దైవారాధన కోసం అందిస్తున్న వరాలే. !. దేవుని దయ ,కరుణ లను సూచించే మధురాతిమధుర ఘట్టాలే !మానవ జీవితాలు సరిపోవు.ఆ  నిర్గుణాకార నిశ్చల సచ్చిదానంద  ఘన స్వరూప వైభవాన్ని దర్శించి తరించేందుకు ! దైవ లీలలను వర్ణించేందుకు శక్తి చాలదు ! అనుభవించడానికి. జీవితం సరిపోదు !  దేవుడు ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు  ? మనకు కనబడుతాడా..? ఇలాంటి అమాయక అజ్ఞాన సందేహాలకు సమాధానం సూర్యోదయ సూర్యాస్తమయ  రంగు రంగుల వివిధ వైవిద్యాల ప్రకృతి దృశ్యాలే  ! ...ఆ సుందర దివ్య సౌందర్య లావణ్యాల  రాగరంజిత సొగసులు , అనుభవైకవేద్యాలు ! ఆ నీలమేఘశ్యామసుందరుని అందాలు ఇలా ఉంటాయని చెప్పగలమా ?. కొండలు, కోనలు ,చేమంతి ,గులాబీ, మల్లె ,పుష్పాలు ,వాని సౌరభాలు.. ఇవన్నీ దేవుని ప్రతిరూపాలు !  ఋతువులు ,మాసాలు మారుతూ ఉంటే ,మార్చి , మార్చి రంగు రంగుల కుంచెలతో వినీలాకాశాన్ని , మబ్బులను, ప్రవహించే నదులను , విశాల సముద్రాన్ని ,ఇలా ఎన్నింటినో రోజూ  చిత్రీకరిస్తూ క్షణమైనా తీరికలేకుండా  మాకోసం సకల ప్రాణికోటి మనుగడ కోసం నిరంతరం శ్రమిస్తున్న సర్వాంతర్యామిని పొగడటానికి వేయి పడగల అదిశేషువుకు కూడా చేతగాదు కదా.!. ప్రభో! విశ్వరూపా !అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా.! శ్యామసుందరా ! నీవు ప్రదర్శించే అపురూపమైన కళాఖండాలకు , నైపుణ్యాలకు  ,నీకు శతకోటి  ప్రణామాలు.,,! సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ న్నాము.! తండ్రీ ! విశ్రాంతి అనేది లేకుండా భువిని దివి సీమగా ,ధరిత్రిని అపర స్వర్గ ధామంగా ,అందాల స్వప్న లోకంగా ,తీర్చిదిద్దుతున్నావు !  ప్రతి ప్రాణిఆత్మలో నీవు అంతర్యామిగా కొలువుంటూ ,వాని కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపింపఁ జేస్తూ  జగన్నాటకం నడిపిస్తూ వెనక సూత్రధారి గా కథను నడిపిస్తూ  నీవు మాత్రం సాక్షిగా చూస్తూ ,,ఈ జీవుల జీవన చక్రాన్ని  నడిపిస్తూ ఉన్నావు  ! అయితే మాఅంతరంగంలో  నిక్షిప్తమై , ప్రకాశిస్తూ ఉన్న నిన్ను మేము చూడలేము అని  ,మాకు ఎదురుగా కోటి సూర్యప్రభల వెచ్చదనం తో  ,,స్వచ్ఛమైన చంద్ర కాంతి  వెండి వెన్నెల చల్లదనం తో  ,ప్రత్యక్ష దైవంగా నిత్యం మా కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తూ ఉన్నావు కదా ! హే నారాయణా ! జగత్పితా ! జగదేక బందో ! మా ఎదుట కదలాడే ప్రతీ ప్రాణిలో ,కదలకుండా జడం గా ఉన్న కొండా , కోన ,చెట్టు, చేమలో కూడా నీ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్షింప జేస్తున్నావు కదా ! అయితే అంతటా నిండి ఉన్న నిన్ను నీ మంగళకర స్వరూపాన్ని మేము దర్శించుకోలేక పోతున్నాము  ! కారణం ఏమిటీ   ? అంటే   నీ స్వరూపమును భూమి , జలము ,అగ్ని ,వాయువు మొదలగు వాని రూపమున కమ్మివేసి మాకు  చిత్తభ్రాంతిని కలుగజేస్తున్నాయి  ! ఈ విధంగా , జీవులను బహువిధములగు కర్మబంధముల యందు ముంచి  ,అందు వివశులను జేసీ ,ఆ కర్మఫలములను అనుసరించి ప్రవర్తిల్ల జేయునదియు ,,వారిని దుఃఖములందు పడవేయు నదియు అగు నీ ""విష్ణుమాయ  "ప్రభావం వలన  ,,నీవు మాలో ఉన్నా ,, మా చెంతనే  ,మా చేరువలోనే ఉన్నా  ,,కృష్ణా ! నిన్ను గుర్తు పట్టలేని దౌర్భాగ్య దుస్థితిలో మేము  ఉన్నాము   ! ఆ మాయా ప్రభావమును అణచివేయాలి అంటే నీ పాద పద్మాల యందు నిరతిశయమైన భక్తిపారవశ్యాలే శరణ్యము కదా స్వామీ !  పైగా ""అవ్యక్తము "అగు  నీ శుద్ధస్వరూపము ఏ మాత్రము  ఎవరిని కూడా  తెలుసుకొనుటకు  శక్యము కానిది  ! అది కేవలము "శుద్ధస్వరూపము "అనగా జగత్తును బ్రహ్మాండము ను ప్రకాశింపజేయు సచ్చిదానంద తేజము ! అదియే తిరిగి జగద్రూపమున వ్యక్తమగుచున్నది .!అందుచే ఇట్టి వ్యక్త రూపాన్నే  అంటే ఎదురుగా కనిపించే భువనమోహన ప్రకృతి రమణీయ సౌందర్య దృశ్యాన్ని నీ అవతార మూర్తిగా భావించి ,ఆశ్రయించి ఉపాసించుకొనుటకు మాకు కావాల్సిన స్పూర్తిని శక్తిని భక్తిని భావ సంపదను దయతో అనుగ్రహించు దేవదేవా ! దీనజనబాంధవా ! జగన్నాథ !  మేము  కర్మబద్ధులం !అల్పులము! మందబుద్ది కలవారము !,అజ్ఞానులం! కరుణించి మాకు సద్భావన సన్మార్గ చింతనలను ప్రసాదించుము.!. నిన్ను మేము మరచినా ,నీవు మాత్రం మమ్మల్ని మరిచిపోకు ! తల్లీ తండ్రి గురువు దైవము అన్నీ నీవే!అలా, నిన్ను భజించి తరించే భాగ్యాన్ని  అందించు !.స్వామీ శరణు ! పరమేశ్వరా  శరణు   !పరమాత్మా శరణు ! సర్వే జనాః సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు ! స్వస్తి !

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...