Wednesday, February 20, 2019

జై జవాన్! జై భారత్ !

ఘోరంగా ఇంతమంది భారత వీరజవానులను హతమార్చిన పాకిస్తాన్ దుండగులకు మనమంటే భారత దేశమంటే  ఎంత ద్వేషం ఈర్ష్యా పగ కోపం , అహంకారం , కాశ్మీరును ఎలాగైనా అక్రమించుకోవాలన్న దురాపేక్ష ,ఎంత బలంగా  ఉందో దీనివలన తెలుస్తోంది ..ఇక ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు మారరు. ఒకనాడు కాశ్మీర్ పండితులను వేల సంఖ్యలో ఊచకోత కోసినపుడు   ప్రధానిగా ఉన్న నెహ్రూ.,, గాంధీ మహాత్ముడు .. చోద్యం చూస్తూ  మౌనంగా ఉండిపోయారు. ఇందిరమ్మ పుణ్యమా అని మనదేశంలో  అంతర్భాగంగా .ఉన్న మానస సరోవర నేపాల్ ప్రాంతాన్ని  చైనాప్రభుత్వం అక్రమించుకున్నారు.. ఇప్పుడు పాకిస్తాన్ కు కశ్మీర్ పై కన్ను పడింది. అందమైన దేశం. అందుబాటులో ఉన్న ప్రాంతం. కబ్జాకు అనుకూలం.. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న కొందరు పాకిస్తాన్ కు తమ  సంపూర్ణ మద్దతును సహాయాన్ని సహకారాన్ని అందించేవారే . పాకిస్తాన్ జిందాబాద్  .! అంటూ నినాదాలు చేస్తూ. అక్కడవుండే మన దేశ జవానులపై రాళ్లు విసురుతూ.ఉన్న ఘోరమైన  దృశ్యాలను మనం చూస్తున్నాం .మన దేశాన్ని కాపాడటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారి విధులను  ప్రతిఘటిస్తూ ఇబ్బంది పెట్టే ముష్కరులు పాకిస్తాన్ కు విధేయులు.. వీరే మన మొదటి శత్రువులు .నమ్మకద్రోహులు.. ప్రక్కలో బల్లెంలా  దేశ శాంతి  భద్రతల కు తీవ్రంగా ఆటంకం కలిగిస్తూన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ముస్లింలు అంతా తమకు వేరే దేశం కావాలంటే అప్పుడున్న ప్రధాని మౌనంగా తల ఊపాడు..  మనది ప్రజాస్వామ్య దేశం అంటూ ముస్లింలు  అందరూ వెళ్లిపోకుండా  గాంధీ గారు ఆపారు.   అలా రాజకీయనాయకులు  తమ వంతుగా శాంతియుత హిందూదేశాన్ని   ,అశాంతి పాలు చేస్తూ అభద్రతా భావాన్ని పెంచుతున్నారు..ఇప్పుడు అంతః కలహాలు ఇక్కడున్న కొందరు  పాకిస్తాన్ తో చేతులు కలిపి ,స్నేహం పేరుతో ఘోరంగా మారణ కాండ తో  రెండు మతాల మధ్య  యుద్దం సాగిస్తున్నారు. ఇది రావణ కాష్టం లా రోజురోజుకు పగలు ప్రతికారాలు పెరిగిపోతున్నాయి  పాకిస్థాన్ లో ఉన్నవారికి మనదేశ సమాచారాన్ని .సైనికుల మెలకువలు అందించే ముష్కరులు మనతో కలిసి ఉంటూ మన దేశం ఉప్పు తింటూ  మనకే నమ్మకద్రోహం తలపెడుతున్నారు.."భారత్ మాతాకి జై  !"అని మేము అనము  !!"అనే వారు  మనకు సోదరులు ఎలా అవుతారు.. ? పుల్వాన్ దాడిలో చంపబడ్డ జవానులకు మనం విషాదంతో  కన్నీటి నివాళులు సమర్పిస్తూ ఉంటే.. మన దేశంలోని కొందరు  యువకులు  జల్సా  చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు  ..అంతః కలహాలు ఆపడం  చాలా కష్టమైన పని..ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కదా.. అందుచేత మనముందు ఉన్న కర్తవ్యం దెబ్బకు దెబ్బ తీయడమే.. చర్చలు ,శాంతియిత రాయబారాలు ప్రక్కన పెట్టి.. సరిహద్దు సైనికుల భద్రత విషయంలో ,,తిరిగి ప్రతీకారాన్ని ఎలా తీసుకోవాలో. చూడాలి . పాకిస్తాన్ దుండగులకు మనదేశ కీలక సమాచారాలను రహస్యంగా అందించే ఫోన్లు ,ఇంటర్నెట్ ల వ్యవస్థను అరికట్టాలి.. అక్కడివారిని ఇలాంటి దుశ్చర్యలను చేయడానికి ఆయుధాలు అందిస్తూ  ,కీలకపాత్రను పోషిస్తూ. ఉన్న దేశద్రోహులను దొరికినవారిని దొరికినట్టుగా ఉరితీయాలి. అలా పాకిస్తానీయులకు అందే అందించే సమాచార సహాయకులను అంతమొం దిస్తేనే తప్ప పాకిస్తాన్ దుండగులకు మన సత్తా తెలిసిరాదు.  కార్చిచ్చు లా వ్యాపిస్తూ బోర్డర్ పై  మనకోసం తమ దేశం కోసం  తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టి పోరాడుతూ సోదర జవానుల చావుకు కారణం అవుతున్న మతోన్మాదులకు ,బుద్ది చెప్పాలి.. అందుకు మొదట  రాజకీయ నాయకులకు  తమ పదవుల ప్రయోజనం తెలిసిరావాలి దేశం కోసం ,ప్రతి పౌరుడు .ఇంటికి ఒక జవానుగా మారాలి..  వీరమరణం పొందిన జవానులకు విధిగా తమ తమ వేతనాలు ఆదాయాలనుండి విరివిగా విరాళాలు ఉదారంగా అందించాలి ఇది ప్రతి ఒక్కరి సమస్యగా.జవానులు తమ ఇంటి సభ్యులుగా  భావించాలి  ,, ఇలా సంఘటిత భావన తో  మనలో కలిగే చైతన్యమే దేశజవానుల ఆత్మార్పణకు నిజమైన హృదయపూర్వక నివాళి కాగలదు.. చనిపోయినవారి భార్యలు  ఏడుస్తూ ఉన్నారు. కుటుంబాన్ని పోషించే ఆసరా ,ఆధారం ,కోల్పోయి..వారి  పిల్లలు అనాధలై.తండ్రిని చూడకుండా తండ్రి ప్రేమకు నోచుకోకుండా దిక్కులేని వారయ్యారు.. వారి ఈ దుస్థితికి కారణం పాకిస్థాన్ దుండగులైతే.. వారిని ఇలాంటి నిస్సహాయ దుస్థితిలో  ఎదో ఒక రకంగా అదు కోలేకపోతే మనమూ దోషులమే అవుతాం కదా.అలా ఆదుకోలేని ,మద్దతు నివ్వని పరిస్థితిలో తిరిగి సరిహద్దుల్లో పోరాడటానికి సంసిద్ధం అయ్యే యువకులు కరువౌతారు కూడా.. అందుకే అక్కరకు రానివాడు  బ్రతికి ప్రయోజనం లేదు. తనదాకా వస్తే తెలుస్తుంది.. ప్రాణం తీపి ఏమిటో. !! మనం హాయిగా నిర్భయంగా ,సంతోషంగా ఉండటానికి  తమ ప్రాణాలను తృణప్రాయంగా  ఒడ్డుతూ బలియైపోయిన వీర సైనికులకు ధనం రూపేణా వారి కుటుంబాల కు  నేరుగా  పంపించుదాం.. చేతనైనంత సహాయం చేయడం మన విధి.! వారికి అండదండగా నిలబడటం మన తక్షణ కర్తవ్యం కదా !!జై జవాన్!  జై భారత్ !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...