Tuesday, August 13, 2019

జ్ఞానం

Aug 9, 2019
Austin
సృష్టిలో అత్యంత విచిత్రమైన విషయం ఏదైనా ఉందా ? అంటే అది కేవలం  "జ్ఞానం! అనే విషయ మే !!  ఎందుకంటే అది అగోచరం, !ఎవరికీ కనబడేది కాదు, , అది!అనిర్వచనీయం ,,! అద్భుతం!, అమోఘం,! పరమ పవిత్రమైన, దివ్య మైన, భవ్యమైన పరమాత్మ స్వరూపం!!,, జ్ఞానం ఇలా ఉంటుందని, అది ఇక్కడ ఉంటుంది , అనీ, ఇంతకాలం ఉంటుంది, అనీ   చెప్పలేని విజ్ఞాన ఖని,! ఎల్లలు లేనిది, అపరిమితం,అనంతము, అఖండము, అద్వితీయం ! దేనికైనా కొలత ఉంటుందేమో జ్ఞానాన్ని కొలవలేము,! అది గుప్త ధనం,!, ఎంత పరిశోధించిన దాని అంతు తెలియదు! అది అంతర్వాహిని, !మెదడు లో నిక్షిప్తం గా ఉండే పెన్నిధి!, అదే పరమాత్మ సన్నిధి ! అదే కైలాసం,! అదే వైకుంఠం!, అదే బ్రహ్మ పదం,! బ్రహ్మానందం,! పరమానంద భరితం! ఏది పొందితే మానవజన్మకు, మరేమీ అవసరం ఉండదో ఆ ఆనందమే జ్ఞానం , అదొక మహా యాగం, యజ్ఞం, తపము, జపము,,, మోక్షము,,పరమపద సోపానం, కూడా ! మనిషికి వెన్నుపాము లో  ఉండే ఏడు చక్రాలలో, మూలాధార చక్రం నుండి, శిరస్సు లోని సహస్రార చక్రం వైపు, యోగ సాధనతో,, నిరంతర పరిశ్రమ తో, ధృఢ సంకల్పం తో , దైవానుగ్రహం తో కదిలే, అందాకా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి యే జ్ఞానం! అంటారు.. అంతటి మహత్తరశక్తి సంపన్నుల ను" పరమహంస "లు అంటారు.!," మనిషి ఎన్నేండ్లు బ్రతికాడు?" అన్నది ముఖ్యం కాదు,! జ్ఞానంతో భగవంతుని సన్నిధానం లో, నిరంతర ధ్యాసతో , ఉన్న రోజులే అతడి "అయువు" గా పేర్కొన వచ్చును ,,,! మనిషి వృద్దుడు కావడం సహజం !, అది జంతు లక్షణం,! కానీ,జ్ఞానవృద్దుడు కావడం మనిషి లక్షణం ,! బాలురు కూడా బ్రహ్మ జ్ఞానులు కావచ్చును ! జ్ఞానానికి వయసుకు ఎలాంటి సంబంధం లేదు ; జ్ఞానం అనేది ఒక సంస్కారం! అది భగవద్ కృప! పితృ దేవతల అనుగ్రహం, ఎన్నో పూర్వజన్మ పుణ్య ఫలం,! ఇప్పటికీ అలాంటి కారణ జన్ములు, పుణ్యాత్ములు లేక పోలేదు, మన భారతావని సనాతన ధర్మ కర్మ, యోగ భూమి గా, ఆధ్యాత్మిక  జ్ఞాన భూమి గా , కూడా ప్రసిద్ది గాంచింది. !  మనిషికి ఉండే జ్ఞానం అతడిని దైవానికి దగ్గరకు చేరుస్తుంది ,,,! జీవుడు దేవుడు కావాలంటే , అంతటి గొప్ప జ్ఞాన సంపద అతడికి ఉండాలి, కదా ! రాముడు ,కృష్ణుడు లాంటి దేవుళ్ళు, మనుషులు గా పుట్టినా కూడా ,,వారు "గురు కృప"తో సంపాదించిన "  జ్ఞానం" తో పూజనీయులు అయ్యారు ,! పురుషోత్తములు గా పురాణపురుషులు గా గుర్తింపు పొందారు!.. అందుకే, ఏ విధమైన  శాస్త్ర విజ్ఞానం, లేదా ఆధునిక, పరికరాల ద్వారా కూడా కొలవలేని ది ఈ జ్ఞాన బాండారం!!.. దీని వైభవం చెప్పగలమేమో,, కాని స్వరూపం చెప్పలేము,! జ్ఞానం అనేది ,కేవలం అనుభవైక వేద్యం మాత్రమే!!, కొంత తక్కువ, కొంత ఎక్కువా తేడాతో ,సర్వ ప్రాణుల లో జ్ఞానాగ్ని నిండి ఉంటుంది,! ఇది సకల చరాచర జగత్తు లో  అంతర్యామిగా, అంతర్వాహిని గా ప్రవహిస్తూ ఉంటుంది.! మనిషి కి, ఇతర ప్రాణుల కు , ఈ "జ్ఞానమే "బేధం గా చెబుతారు. !ఆ మాట కోస్తే, మనిషి మనిషికీ కూడా ఉండే ప్రధాన వ్యత్యాసం కూడా జ్ఞానమే కదా,,! రూపం, లో మాత్రమే కాదు,, మిగతా స్వభావాలు, ఒకేలా ఉన్నా,ఏ ఇద్దరి మనుషుల్లో నైనా ,,జ్ఞానం విషయం లో మాత్రం" సమానులు "అని చెప్పలేం. !!ఎవరి ప్రతిభ పాటవాలు ,ప్రజ్ఞా, వారిదే,!, అందుకే జ్ఞాన స్వరూపిణి, సరస్వతీ నదీమ తల్లీ, త్రివేణి సంగమ ప్రాంతం లో అంతర్వాహిని గా కనబడకుండా పరమ పవిత్రంగా, ప్రవహిస్తూ ఉంటుందని చెబుతారు, శృతి స్మృతి, ఉపనిషత్తులు, పద్దెనిమిది పురాణాలు, నాలుగు వేదాలు బోధించేది ఈ" జ్ఞా నాన్నే"కదా !!  ఒక్క పరమాత్మ కు తప్ప సర్వం తెలిసిన వారు, సర్వజ్ఞుడు మరొకరు లేరు,! ఋషులు, మునులు, సాధువులు, పండితులు, యోగులు, సిద్దులు, వీరంతా తమ జీవితాలను తృణ ప్రాయంగా చూస్తూ, కేవలం జ్ఞానా ర్జన కోసం మాత్రమే శ్రమించడం విన్నాం,! చూస్తున్నాం!,  అలా తమ యోగ శక్తితో, దీక్షతో, దైవారాధన చేస్తూ సాధించిన యదార్థ జ్ఞానాన్ని, మనకు ఈ శృతి స్మృతి పురాణాల ద్వారా అందిం చి, వారు ధన్య జీవులయ్యారు,! జగద్గురువు శంకరాచార్యులు గారు , ఈ "జ్ఞానయజ్ఞం "లో ప్రధాన పాత్ర వహించి, సనాతన హిందూ ధర్మ శాస్త్ర, జ్ఞాన, ధర్మ, ఇతిహాసం పునరుద్ధరణ, చేసి, సాటిలేని ధర్మ ప్రబోధ గ్రంథాలను రచించి , హైందవ జాతికి ఎనలేని, తీర్చుకోలేని విధంగా, మానవజాతికి ""జ్ఞానభిక్ష "పెట్టారు.! కవులు, గాయకులు, జాతి గౌరవం కోసం దేశ భక్తులు, సంఘ సంస్కర్తలు, వేదాంతులు ఇలా, ఎందరో మహానుభావులు, తమకున్న "జ్ఞాన "శక్తిని సామాన్యులకు కూడా ఆనందంగా పంచిపెట్టారు,,! వారిచ్చిన జ్ఞానంతో, పరిస్తితి గమనించి, బ్రతుకు ల ను నవ నాగరికత, ఆధునికత లో కొత్త రీతిలో మలచుకుంటు ఉన్నాం,! నిజానికి." జ్ఞానం" అంటే ఏమిటి,? అంటే," నిన్ను నీవు తెలుసుకోవడం,!"" అది అంత సామాన్య విషయం కాదు,! అది తెలిసిన నాడు, నీవు అసాధారణ ప్రజ్ఞావంతు డిివి అవుతావు,!"" జ్ఞాననేత్రం"" అనబడే మూడవ కన్ను తెరచుకుం టుంది ,,,ఈ అజ్ఞానం, అవిద్య, అహంకార మమకారాలు తొలగి,, ఆ స్థానం లో బ్రహ్మ పదార్థం  నిలవడమే జ్ఞానం ! అది ఒక అఖండమైన , అద్భుతమైన, అమోఘమైన జ్ఞానజ్యోతి !వెలిగించడం. మాత్రమే నీ వంతు ! నిన్ను సదా కాపాడుతూ నిన్ను  చిరంజీవి లా,, సంరక్షించ డం నీలో ఉన్న  జ్ఞానం వంతు !!  ప్రతీ పదార్థంలో, అణువణువునా, ప్రహ్లాదునికి వలె దైవం గోచరిస్తు ఉంటుంది !, భక్తులంతా జ్ఞాన స్వరూపులు,;! అంటే దేహమంతా జ్ఞాన మయమే,! బ్రహ్మ, విష్ణు శివ స్వరూపాలు వేరని భావించ రు, ! పుట్టించిన వాడు తండ్రి ,,బ్రహ్మ,!! పాలిచ్చి,  గురువై , పోషించి, పెంచిన తల్లీ,, విష్ణువు,!! తాను పెరిగే , ఆయువును నియంత్రిం చే ,,కాల చక్రమే ,,శివుడు,,!! అలాంటి భావ సంపద తో,, జీవు డు ,,తానే ఒక "బ్రహ్మ పదార్థం" గా ప్రకాశిస్తాడు,! భూమిపై పెరిగేది, ఎప్పటికైనా విరుగుట కొరకే కదా!!, ఏ జీవి అయినా, పుట్టడం జరిగాక, ఇక మరణం కూడా క్రమక్రమంగా సమీ పిస్తు ఉంటుంది, ! దేహం పై న ,వెంట్రుకలు రాలడం, చర్మం లో ఉన్న  పొలుసులు ఊడటం, పాత రక్త కణాలు పోయి కొత్త రక్త కణాలు తయారు కావడం, ఇలా శరీరంలో మనకు న్న మిడిమిడి జ్ఞానంతో మనకు తెలియని. చేర్పులు మార్పులు రోజూ,ఎన్నో కదా,!! ఇదంతా "లయం" కావ డం , అంటే "మాయం" కావడమే,! ఏది శాశ్వతం కాదు,, నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన స్వరూపుడైన ఆ పరంధాముని గురించిన జ్ఞానం తప్ప !!! భారత యుద్దం లో మరణించిన పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం "లయం "కాకుండా ఉంటే, మనకు నిలువ చోటు ఉండేదా. ? ఎవరు పుట్టిస్తున్నారు,? ఎవ రు చంపేస్తున్నారు ?, ఏక్సిడెంట్ లో పోయేవారికి శత్రువులు ఎవరు!, ఎందుకు అలా జనాలు అకాల మరణాల పాలౌతున్నారు,? ఏమిటి సృష్టి వైపరీత్యం??, అనుకోని తుఫానులు, జల ప్రళయము, భూకంపాలు, బాంబుల యుద్దాలు, ఎందుకు జరగాలి? చంపడం, ఏమిటి? చావడం ఏమిటి,? ఎక్కడినుండి పుట్టుకొస్తున్నా రు ఈ జీవులు.? మరణించాక ఎక్కడికి వెళ్తున్నారు ఈ జీవులు ? అత్మ నిత్యం సత్యం కదా! మరి ఆత్మకు జ్ఞానం ఎలా వస్తుంది ?! ఎవరి ప్రకోపన, శాసన, సార్వభౌమ అధికారం తో ఇవన్నీ జరుగుతున్నాయి??, అపగలవారు ఎవరు,? అర్థం చేసుకునే వారెవరు,?? ఎందుకీ వినాశనం?, దేనికోసం, ఇదంతా ? ఎవరు ఎవరికి మిత్రులు, ,శత్రువులు,,??, ఇలా మానవుడే దానవు డై లయకారుడు గా మారితే, వాడికున్న జ్ఞానానికి విలువ ఉంటుందా? జంతువుల వలె స్వార్థం, ఈర్ష్యా ద్వేషాలు, కోపం, పగ ప్రతీకారం ప్రకటించడమే జ్ఞాన మా? అంటే,,"" కాదు! కాదు !!కాదు!!" అని అతి సామాన్యుడు కూడా చెబుతాడు!!, ఎందుకంటే "జ్ఞానం"" అంటే, కేవలం పాండిత్యము కాదు,! సర్వసంగ పరిత్యాగం కాదు,! భక్తి వైరాగ్య భావం కాదు, !యదార్థ జ్ఞానంతో బాటు పదార్థ జ్ఞానం కూడా అవసరమే, కదా అర్థం చేసుకోడానికి ,!ఆ మాత్రం "ఇంగిత జ్ఞానం ""ఉండాలి అంటారు కదా ! అందుకే అలాంటి పరి ప్రశ్నలకు సమాధానం చెప్పేది జ్ఞానవంతులే ! , ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవం, మర్యాద, సభ్యత, సంస్కారం, భూత దయ, పరస్పర సహకారం, లాంటి నైతిక విలువలు కూడా మనిషిగా అర్జించు కోవలసిన జ్ఞాన సంపద లో భాగమే !, తలిదండ్రుల ను ప్రేమించు, !గౌరవించు,! ప్రత్యక్ష దైవాలు గా గుర్తిం చు ,,! ఇలా భావించడం విజ్ఞానం అయితే,, జీవితాంతం తలిదండ్రుల ను అలా సేవిస్తూ, వారిని సంతృప్తి, సంతోషం తో బ్రతికెలా ఆదరిస్తూ ఉండడం నిజమైన" జ్ఞానం" అవుతోంది,! అలాంటి వారిని జ్ఞానులు అని పిలువ వచ్చును, , సత్యం చెప్పాలి , అహింస పనికి రాదు, పరోపకారం చేయాలి, మూగ జీవాలను సంరక్షించాలి , గోసేవ చేయాలి, తోటి వారిని ఆదరించి గౌరవించాలి , అందరినీ ప్రేమ భావంతో చూడాలి ,ఇలాంటి  ధర్మాలను ,తూ ,చా తప్పకుండా ఆచరించే వారు జ్ఞానులు !అలా మన అనుభవానికి, మనుగడకు, భగవంతు డు అనుగ్రహించిన ప్రతీ మనిషి నీ ,,వస్తువు, లను పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తూ, అంతటా ఉన్న సర్వాంతర్యామి నీ దర్శిస్తూ, అంతరంగం లో కొలువై, ఈ జీవనానికి వెలుగై,, జ్ఞాన జ్యోతికి నెలవై, అంతర్యామి గా దేహంలో ప్రకాశిస్తూ, ఒక దివ్యమైన దేవాలయంగా ప్రభావితం చేస్తూ ఉన్న ఆ దేవా ది దేవుని గుర్తించడమే జ్ఞానం !. ప్రాపంచిక జ్ఞానం వేరు,! పారమార్థిక జ్ఞానం వేరు,! నీవు ఎదిగే సమాజం చే నీకు గుర్తింపు రావడం నాగరికత, లేదా ఆధునీకరణ విజ్ఞానం అంటారు!, నీవు పరమాత్మని గుర్తించడానికి చేసే సాధనా సంపత్తిని ఆధ్యాత్మిక "జ్ఞానం "అంటారు !!  .ఇల్లూ వాకిలి, అస్తి, సంపద, డబ్బు, అర్జన , కీర్తి ప్రతిష్టలు గురించిన విషయాలను  "పదార్థజ్ఞానం "అనగా విజ్ఞానం అంటారు. వాటి, స్వరూపం, స్వభావం, వినియోగం గురించిన అనుభవాల సందేశాలు జ్ఞానానికి సంకేతం !! !., మనచే అనుభవింపబడేది విజ్ఞానం!, ఆర్థిక విజ్ఞాన ,, సాంఘిక, రాజకీయ, వ్యవసాయ ము మొదలగు శాస్త్రాలు వ విజ్ఞానాన్ని అందిస్తే, వాటి సారాన్ని, సారాంశాన్ని, పరమార్థాన్ని గ్రహించే ది  జ్ఞానం,!  ఆ సిద్ధాంతాన్ని విజ్ఞులు" వేదాంతం" అంటారు,,! అయితే సదా ఈ మారుతున్న జగత్తు లో ఏ ది పదార్థ మో,, ఏది యదార్థ మో వ్యత్యాసం , తెలియడమే జ్ఞానం, !రంగు రంగుల్లో పుష్పించే పువ్వుల్లో  , వాటి లో దాగిన మకరందాన్ని , గుర్తించడం జ్ఞానం,,! ప్రాణుల తాపాన్ని బాపే తీ యని అమృతవర్షజలధార పానంలో పొందే సంతోషం, సంతృప్తి లో,, ఉంది జ్ఞానం ,,! నిండు కుండ లా, తొనక్కుండ, ప్రశాంతంగా ఉండే సప్త సముద్రాల్లో గంభీరత లో  నిబిడీకృతమై ఉంది జ్ఞానం,!, నీలాకాశం లో అందంగా మెరిసే నీలి మేఘాల లో , నిత్యం వినూత్న ఆనందాన్ని అనుభ వింప జేసేఇంద్ర ధనుస్సు లో,, సూర్యోదయ , సూర్యాస్తమయ,, అరుణకాం తు లలో , ఉంది జ్ఞానం!!, చల్లని ,తెల్లని వెండి కాంతులను వెద జల్లే  పున్నమి వెన్నెల లో, ఉంది జ్ఞానం,!, అకు పచ్చని చీర కట్టులో , పచ్చని చేల లో,, కొండల్లో, కోనల్లో పరచిన అకు పచ్చని తివాచీ లా భాసించే ప్రకృతి మాత, అపర మహాలక్ష్మి సౌందర్య లావణ్య ము గా ఆగుపించే "అమ్మ ల గన్న అమ్మ "వైభవము లో ఉంది జ్ఞానం! కర్మసాక్షి సూర్య భగవానుని పసిడి కిరణాల లో ఉంది జ్ఞానం,,! ఆయురారోగ్యాల తో, చరాచర జగత్తును వర్దిల్లజేస్తున్న దివ్య ఔషధాలు వెదజల్లే చంద్రుని కరుణ లో ఉంది జ్ఞానం,! సకల జీవులకు నిరంతరం తన కృపతో ఊపిరి నందిస్తూ, బ్రతికిస్తూ ఉన్న ప్రాణ వాయువుల లాలన, పాలన, వీవన లో ఉంది జ్ఞానం, !!ప్రాణుల మనుగడకు, జీవన భృతిని, తన కృపతో పంటలను పండిస్తూ, అందిస్తూ, బ్రతుకులో ఆశను, శక్తిని ,చైతన్యాన్ని నింపుతున్న ఈ భూమాత ఓర్పు లో ఉంది జ్ఞానం,! ఇలా అనంతమైన విశ్వంలో, అనవరతం ,నియమానుసారం , భ్రమిస్తూ ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు ఇలా, ఇన్నింటీని నియంత్రిస్తూ, పరిపాలిస్తూ ఉంటున్న ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని గురించి తెలియాలంటే  పదార్థ జ్ఞానం తో సాధ్యమా,? , విష్ణు మాయ ను భేదించడం,పంచభూతాల ప్రభావాలను నిగ్రహించి, క్షణికం, అశాశ్వతం అయిన ఈ మానవ శరీరం తో  శాశ్వతము,, సత్యము నిత్యము, బ్రహ్మానంద కరము అయిన ఆ పరందామునీ ,పరమ ధా మా న్నీ ,  మనకున్న మామూలు విషయ జ్ఞానంతో  గుర్తించడం, భావించడం, అందులో జీవించడం సాధ్యమా !?? అంటే అసాధ్యం అని మనకు తెలుసు !! ఇంతకూ పరమాత్మ గురించిన ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది?  అంటే  ,,సత్పురుషులు, సజ్జన సాంగత్యం, నిరంతర తపన, ధృఢ సంకల్ప చిత్తం, దైవారాధన, త్రికరణ శుద్ధి తో చేసే, అత్మ సమర్పణ భావంతో , దైవ భక్తితో ,, జ్ఞానాన్ని సాధించ వచ్చును, శ్రీకృష్ణుడు గీతలో సూచించిన విధంగా , ఒంటరిగా, హిమాలయ, ప్రాంతం లో  హరిద్వార్, హృషికే శ్ లాంటి సిద్ధ పురుషుల క్షేత్ర ప్రాంతాల్లో , సద్గురువుల శుశ్రూష తో, నిర్మల హృదయం తో, సద్గురువుల ఆశ్రయం తో జ్ఞాన ప్రాప్తి  అవుతుంది,! రామకృష్ణ పరమహంస దేవి కాళీ మాత ఉపాసకులు , సమాధి అవస్ట లో ఆమె ను నిత్యం దర్శిస్తూ ఉండేవాడు,, అంతటి శక్తి సంపన్నుడు క నుక, అతడు  తన కరస్పర్ష మాత్రం తో , వివేకానంద స్వామి కి జ్ఞానాన్ని అనుగ్రహించాడు, గొప్ప జ్ఞానిగా చేశాడు, గురు కృప అంత మహనీయ మైనది.  జగద్గురువు శంకరాచార్యులు , కాశీ అన్నపూర్ణ మాత ను"", జ్ఞాన వైరాగ్య సిద్యర్థం, భిక్షాం దేహి చ పార్వతీ,!"" అంటూ, సాక్షా త్తూ, సదాశివునికి "జ్ఞానభిక్ష "ను ప్రసాదించే పరమేశ్వరి గా స్తుతించాడు. శ్రీకృష్ణుడు భీష్మునికి, ఉద్దవునికి, తల్లీ దండ్రులు దేవకీ వసుదేవులకు, అక్రూరుడు,ముచికుందుడు , ప్రహ్లాదుడు, అంబరీషుడు, నారదుడు,, కలియుగంలో అన్నమయ్య,  లాంటి భాగవతులకు,  గోపికలకు వారి భక్తి మార్గం ద్వారా, తనను తెలుసుకున్న వారి జ్ఞానానికి సంతసించి ముక్తిని కరుణించాడు . శ్రీకృష్ణుడు !!, జ్ఞానానికికావల్సింది, "ఆర్తి,!" అంటే అంటే పరమాత్మ కృప కోసం భక్తులు పడే ఆకలి లాంటి "తపన,",ఉండాలి ,,దానితో బాటు, ఆర్ద్రత, అంటే, పరమాత్మ సాక్షాత్కారం కోసం భక్తులు అనుభవించే ఆవేదనా, పరితాపం, ఆక్రోశం , ప్రతి స్పందన,, కూడా తోడు కావాలి .! జ్ఞాన అర్జనకు ,అర్హత ను కూడా  సంపాదించాలి . !!"" అనన్యా చింతయం తో మామ్, యే జనాః పర్యుపాసతే,,,,,!"  అని గీతాచార్యుడు సెలవిచ్చి నట్లుగా, వేరే ఇతర విషయాల వైపు మనసు పెట్టకుండా,, ధ్యాస మరల కుండా, ఏకాగ్రతతో, పరమాత్మను ఆరాధిం చాలి, ఇక పరమాత్ముని కృపకు నోచుకునే యోగ్యత ఉండాలంటే, అత్మ సమర్పణ భావంతో," అహం బ్ర హ్మోస్మి ""అనే విధంగా, పరమాత్మ తో విడదీయరాని అనుబంధం భక్తుడు ఏర్పరచు కోవాలి ..! స్వామీ,, నీ పాదాలే శరణ్యం!, లేదా మరణమే శరణ్యం!!"" అనబడే జ్ఞానం ," యోగ్యత" అనిపించు కుంటుంది,! అయితే,, ఎంతటి జ్ఞాని అయినా గురు కటాక్షము లేనిదే పరమాత్మ కృపకు నోచుకొడు కదా,,! ఎందుకంటే ,గురువే  తల్లీ దండ్రి,, దైవం కూడా ! అంతేకాదు,, గీతాచార్యుడు, శ్రీకృష్ణుని వలె జ్ఞానోపదేశం చేస్తూ, అర్జునుని వంటి శిష్యునికి కర్తవ్య నిర్వహణ బోధించిన, సద్గురువు,, శిష్యుని తలిదండ్రుల కంటే పూజనీయుడు అవుతాడు!,, జ్ఞానం తోనే మనిషి,, అనిపించు కుంటా డు,,అజ్ఞానం తో పశు తుల్యుడు అనిపిస్తాడు,, పరమాత్మను తెలిసినవాడే, నిజమైన జ్ఞాని కదా !"జీవితం" అనబడే యుద్ధరంగం లో," జీవుడు" అనబడే అర్జునుని మిషగా సూచిస్తూ,  "గురువు" స్థానం లో ఉండి జ్ఞాన బోధ చేశాడు,, శ్రీకృష్ణ పరమాత్మ !!విశ్వరూప ప్రదర్శన తో తన ఉనికి నీ, మహత్తును,, ఈ మాంస నేత్రాలతో కాకుండా, కేవలం జ్ఞాన నేత్రం తో, మాత్రమే తెలుసుకొన వచ్చును అనే నగ్నసత్యం తెలియజేస్తూ, మనిషిగా జీవుడు పాటించాల్సిన కర్మయో గ, భక్తి, యోగాలతో బాటు జ్ఞాన యోగాన్ని అనుగ్రహించాడు ,, కోట్ల మంది భక్తులలో, తనను తెలుసుకునే జ్ఞాని ఒక్కడే ఉంటాడు అని కూడా సెలవిచ్చాడు కూడా! ,,, ఇహలోక విషయాల పై, ఆసక్తిని,మమతానురాగాలు చంపుకొని,, దైవాన్ని తెలుసుకునే జ్ఞాన సముపార్జన మాత్రమే ధ్యేయంగా, పెట్టుకోవాలి,!, వేదాలు ఘో షించే ది, పురాణాలు ప్రవచిం చే వి ఇదే జ్ఞానం గురించి !;  ఈ భారతావని లో జన్మించిన ఎందరో జ్ఞానులు ,, భగవద్గీత ను  పఠించి, జీవితంలో ఆచరించి, పొందిన అనుభవాల సారమే,తరతరాలకు తరగని జ్ఞాన సాగరం !, సకల పురాణాల,,వేదాల సారం, భగవద్ గీత !!  తానే స్వయంగా, తన నోటిద్వారా చెబుతూ అందించిన అద్భుత, అపురూప జీవనప్రమాణ జ్ఞాన గ్రంధం  అది !  భగవంతుని ప్రవచనాలు, చక్కని మార్గ దర్షకాలు,! జీవన సాఫల్య ప్రమానికాలు, !మానవ జీవన ఉద్దరణ కు, భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ది కి  సోపానాలు ! మానవుడుగా జన్మించి నందుకు చేరు కోవాల్సిన ముక్తి ధామం పొందడానికి,అందుకోవాల్సినదివ్య అమృత ఫలం మన భగవద్గీత గ్రంధం,! భక్తి శ్రద్ధలతో, చదువుతూ, భవ బంధాల నుండి విముక్తిని పొందుదాం, మనిషిగా పుట్టించిన పరమాత్మ దయకు ప్రతిఫలంగా , గీతా మృత పానం చేస్తూ, జన్మను ధన్యం చేసుకుందాం!, గోపాలకృష్ణ భగవానుని కి జై,, గీతా మాతాకు జై, జ్ఞాన సరస్వతీ మాతా కి జై,,! స్వస్తి !, హరే కృష్ణ హరే కృష్ణా !!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...