Sunday, November 24, 2019

విశ్వాసం

Nov 23, Karimnagar
దైవం మీద అపేక్ష ,,దేవుణ్ణి, చూడాలన్న  కాంక్ష,, సేవ చేయాలనే ఆసక్తి , ఆసక్తి అందరికీ ఉంటుంది,..!! దైవారాధన కోసం డబ్బు, సమయం తీరిక ఓపిక చేసుకునే అవకాశం  నగరాల్లో బిజీ గా ఉన్న చాలా మందికి దొరకదు,!!,,
దైవభక్తి కొద్దో ,గొప్పో అందరికీ ఉండి తీరుతుంది,!! కానీ, జాబ్ చేస్తూ, కుటుంబం తో బిజీ గా గడుపుతూ, , దేవాలయం వెళ్లే టైమ్ కూడా దొరక్కుండా , ఉంటే, దేవుని సేవలో ఉత్సాహంతో పాల్గొంటూ  ఆ అనందాన్ని పోందాలనుకొడం  కష్టమే ,,!!
,, భక్తి ఉండాలంటే  దానికి తగిన ప్రయత్నం చేస్తూ ఉండాలి.
ఉదయం నుండి రాత్రి వరకూ తీరిక లేకుండా ఎన్నో కష్టతరమైన పనులు మనం  చేస్తుంటాం ,!
కానీ ఆలయానికి వెళ్ళడం కుదరదు , !టైమ్ ఉండదు,! జ్ఞాపకం రాదు,! ఏదో ఇబ్బంది వస్తూ నే వుంటుంది,!
కొందరికి ఆలయానికి రోజూ వెళ్లకపోతే తోచదు, !వారికి నిత్యకృత్యం లో అదీ ఒక ముఖ్య భాగం అవుతూ వుంటుంది!
ఇది ఇలా ఉండగా, ఆధ్యాత్మిక గ్రంధాలు చదువుతూ , సత్సంగం ఏర్పాటు చేసుకొంటూ చర్చించే వారు చాలా కొందరు మాత్రమే ఉంటారు,,
అదీ వృద్దులలో మాత్రమే !! రామాయణ ,భాగవత, భారత ,గీతా శాస్త్రాలు శ్రద్ధతో ఇంటా బయటా చదివే వారూ తక్కువ !!, ఏదైనా ఆరుబయట పార్క్ లో, ఏదైనా ఆలయంలో , లేదా ఒక స్నేహితుని ఇంటిలో నో,, భగవద్గీత గురించి చెబుతూ నో, వారిచే చెప్పిస్తు నో,, పురాణాలు ఎక్కడ జరుగుతూ ఉన్నా వెళ్ళి వింటూ నో,, తమ దైవ భక్తిని అందరితో పంచుకుంటూ నో, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు,
,,..ఏదైనా, దీనిపై అయిన గురి కలగాలంటే దైవం పై విశ్వాసం ఉండి తీరాలి,
, కళ్ళు లేనివారు మాత్రమే అంధులు కారు..! కళ్లుండి కూడా ఇంట్లో దేవుణ్ణి కానీ, ఆలయాల్లో దేవతా మూర్తిని గానీ చూడక పోతే, కళ్లు ఉన్నవారు కూడా అంధు లే కదా !!
నడుస్తూ ఉన్నప్పుడు హరినామ స్మరణ చేస్తూ ,,ఆ నడకను దేవాలయం చుట్టూ  చేసే ప్రదక్షణ అనుకోని వారు, కాళ్లుం డి కూడా కుంటి వారే,!!
ఎదుట అఖండ హరి నామ కీర్తన జరుగుతూ ఉన్నా కూడా, తమ నోటితో "నారాయణా "అన్న పదం కూడా అనకుండా ఉంటే, అట్లాంటి జనాలు, నోరు ఉండి కూడా  మూగవారే కదా !!
ఆలయానికి వెళ్ళడానికి కుదరకున్నా, ఇంట్లో దేవునికైన , లేదా గుడిలో కెళ్లైనా రెండు చేతులూ పైకెత్తి జోడించి ,  నమస్కారం పెట్టీ, కృతజ్ఞతా పూర్వక ప్రేమను భగవంతుని కి సమర్పించ లేకపోతే ,, ఇక ఈ చేతులతో పని ఏముంటుంది,,??
ఇంట్లో ప్రతిరోజూ వంట అయ్యాక వండిన పదార్థాల ఘుమ ఘుమ లు చక్కగా కమ్మని వాసన గలవంటలు ఆరగించే ముందు అంత గొప్ప రుచికరమైన ఆహారాన్ని వా అనుగ్రహించిన పరమాత్ముని కి నివే దించక పోతే, ఘ్రానించే ముక్కు  ఉండి కూడా ప్రయోజనం ఏమిటి
చక్కగా పురాణ ప్రవచనం జరుగుతూ ఉందని తెలిసి కూడా వెళ్ళి వినడానికి ఉపయోగించని ఈ రెండు చెవులూ ఉండి ప్రయోజనం ఏమిటీ,
ఈ విధంగా మనిషి తనలో ఉన్న పరమాత్ముని  గుర్తించక, ,పంచేంద్రియాలు పరమాత్మ కోసం ఉపయోగించకుండా, తన మనుగడకు ,ప్రాణ శక్తికి, బలానికి, తెలివికి, ఆయువుకు, అన్నింటికీ మూల కారణం అయిన భగవంతుని మరచి,పంచేంద్రియాలు ప్రాపంచిక సౌఖ్యాలకు వినియోగిస్తే జంతువుకు మనిషికి  జీవన విధానం లో ఏ బేధము ఉండదు కదా,!!
""తిండి ,నిద్ర ,మైధునం"" ఇవి కదా జంతువుల సాధారణ లక్షణాలు,,!! అద్భుతమైన జ్ఞాన బండారాన్ని మనిషికి కానుకగా అపురూప మైన వరంగా  అనుగ్రహించిన  ఆ పరమాత్మ ను మరచి, ఏమీ చేసినా అది కృతఘ్ణత అవుతుంది కదా!!
అమ్మ కూడా అడిగితేనే కానీ అన్నం పెట్టదు అంటారు,,!!
మరి అపెక్షించకుం డా, దైవానుగ్రహం ఎలా లభ్యం అవుతుంది ??
అందుకే ,, ""భగవాన్ ,! నేను నిన్ను తెలుసుకోలేని అఙ్ఞానిని !అమాయకుడ ను ,! దయ ఉంచి, నా బ్రతుకు లో నీ "కరుణ" అనే అమృత ధారను కురిపించి దన్యున్ని చెయ్యి! స్వామీ,,!
నిన్ను నిరంతరం తలచి కొలిచే స్ఫూర్తిని ,,శక్తిని, అవకాశాన్ని అనుగ్రహించు,!!
తండ్రీ జగదీశ్వర ! శరణు! శరణు !శరణు!

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...