Saturday, January 11, 2020

సుందిల్ల లక్ష్మి నరసింహ స్వామి వైభవం 1

Jan 9, 2020

గోదావరి ఖని NTPC  ,, సమీపంలో   గల సుందిల్ల గ్రామం లో వెలసిన  శ్రీ లక్ష్మి నర సింహస్వామి క్షేత్రంలో 4_1_ 2020  నుండి 11_01__2920 ఆదివారం వరకూ  జరుగుతున్న 110 వ భజన సప్తాహ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది ,
సుందిల్ల గ్రామస్తులే కాకుండా హైదరాబాద్ చెన్నూర్ మంథని మంచిర్యాల లాంటి వివిధ ప్రాంతాలనుండి  భజన పరులు స్వచ్చందంగా వచ్చి పాల్గొంటూ తమ దైవభక్తి , నీ ,లక్ష్మీ నరసింహ స్వామి పట్లతమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు,
ప్రతి రోజూ 24 గంటలు, రాత్రీ,పగలు అనకుండా ,నిర్విరామంగా , స్వామి సన్నిధిలో,స్వామి దివ్య విగ్రహానికి ఎదురుగా కూర్చుండి, ఆపకుండా  ఆగకుండా అనేక భక్త జన బృందాలు అఖండ  హరినామ సంకీర్తన  చేస్తున్నారు,keyboard తబలా సహకారంతో  వాయిద్యాల లో చక్కని ప్రావీణ్యం నైపుణ్యం కలిగిన వారు స్వచ్చందంగా ,, సమూహాలు గా కదలి వచ్చి  తమ ప్రతిభను ,భక్తిని ,ఐక్యతను చాటుతున్నారు ,,
భక్తి శ్రద్ధలు కలిగి వస్తున్న భక్తజన సందోహం అందరికీ ఉచితంగా అన్నదానం నిర్వహిస్తూ,వారికివుండ డానికి తగిన  వసతి కల్పిస్తూ ఉన్నారు ,,
ఈ దేవాలయం సనాతనమైన ది,స్వయంభువు గా  పవిత్ర  గోదావరీ తీరాన  వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి దక్షిణా భిముఖంగా దర్శనమిస్తూ నమ్మి కొలిచే భక్తుల ఇలవేల్పుగా కోరిన కోర్కెలు దీర్చే దైవంగా ఆరాధించ బడుతూ ఉన్నాడు,,
65 సంవత్సరాల క్రితం మా అమ్మ ఇక్కడ , ఇదే ఆలయంలో అనారోగ్యం వల్ల ,,రెండేళ్ల పాటు ఆశ్రయం పొందింది ,,
అప్పుడు  కరెంటు , బావి , ఫోన్ లు రవాణా సౌకర్యం ఏ మాత్రం లేవు ,,
రాత్రి  అయితే ,స్వామి ముందు గర్భగుడిలో పూజారి వెలిగించిన దీప కాంతి తప్ప, గుడి చుట్టూ అంతా అం ధకారమే,,!
ఆలయం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మింప బడి ఉన్నా,, చుట్టూ పొలాలు చేన్లు , చిన్న అరణ్యం లా ఉండడం తో, పాములు , ఎలుగు బంటి లాంటి వల్ల  భయం కూడా ఉండేది ,
నీటి వసతి కూడా ఆలయానికి 100 గజాల దూరంలో ఉన్న ఒక చెలిమె ద్వారా  మాత్రమే కలిగేది ,
మా అమ్మతో అక్కడ ఆ రోజుల్లో అంతగా కష్టపడుతూ ఉన్నా  కూడా స్వామి దయ వల్ల అమ్మ  దీక్ష ,సంకల్పం చక్కగా  నెరవేరాయి ,
మా అమ్మ ఆరోగ్యం చక్కబడింది ,స్వామి అమ్మకు స్వప్నంలో సాక్షాత్కరించి అందించిన అమ్మవారి భజన గీతం తో , అమ్మ స్వస్థత పొందింది
అంతవరకు బాధించిన కష్టాలు ఇబ్బందులు   తొలగిపోయి, జీవితంలో సుఖ శాంతులు లభించాయి ,
ఇదంతా స్వామి అనుగ్రహం వల్లనే,అని మా అనుభవ పూర్వకంగా తెలుసుకున్న నగ్న సత్యం! ఆ రోజునుండి మాకు పిలిస్తే పలికే ఇష్టదైవం మా ఇంటి ,ఇలవేల్పుగా , స్వామిని భావిస్తూ కొలుస్తూ దర్శిస్తూ ఉంటున్నాం ,,
ఇప్పుడు అక్కడ  అన్నీ రకాల వసతులు ఏర్పడినాయి,,
వేల సంఖ్యలో వచ్చే భక్తుల రాకపోకలకు రవాణా, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి,,
ఆలయం ఆధునీకరించ బడి ఉంది,,,
భజన చేస్తున్న భక్త బృందం తో. అందమైన స్వామి మూల విగ్రహం  ముందు ఒక్క గంట సేపు కూర్చుంటే చాలు  ,, మనకు అపారమైన అనందం ,ఉత్సాహం ,ఉత్తేజం , కలుగుతాయి
స్వామి విగ్రహం లో ఉండే  మహత్తు వల్లే,  దైవాన్ని విశ్వసించే భక్త జనానికి ఇంత శక్తి ,బలం ప్రగతి, ప్రతిభ , చదువూ,భక్తి శ్రద్ధలు  ప్రాప్తి స్తు ఉన్నాయి ,,,
స్వామి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు,తన జీవితంలో సంతోషంగా ,సంతృప్తిగా ఉండగలిగే  ఉపాధి అవకాశాలు ,ప్రగతి నీ పొందుతూ ఉన్నాడు,,
ఎంత విశ్వాసం మో అంత ఫలితంగా , ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత గా ,భక్తుల పాలిట కొం గుబంగారమై విరాజిల్లుతున్న శ్రీ సుందిల్ల లక్ష్మీ నరసింహుని అనుగ్రహం పొందడం కోసం, మన వంతు గా వెళ్లి స్వామిని దర్శించి జన్మ ధన్యం చేసుకుందాం,! మళ్లీ మళ్లీ రావాలి చూడాలి   అని  అనిపించే  ప్రభావం కలిగిన , అమోఘమైన లక్ష్మీ నరసింహ స్వామి మూర్తి వైభవాన్ని తిలకిస్తూ, ఆనందకరమైన అనుభూతిని పొందు తూ,,  స్వామి కృపకు పాత్రులం అవుదాం ,
సుందిల్ల లక్ష్మీ నరసింహ భగవానుని కి జై !!

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...