Wednesday, February 19, 2020

బుద్ది లేని మనసు - 1

Feb 16, 2020
"బుద్ది లేని మనసు  !"1_
____&_______
""మనిషికి మనసే తీరని శిక్ష !
దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష ,!""
అన్నట్టుగా ,మనిషికి నిజమైన శత్రువు మనసే ,!మిత్రుడు అనుకున్నా కూడా  కష్టమే !!
,, , ఏ విధంగానూ ఈ మనసు వల్ల  మనిషికి సద్గతి లభించదు !!,
""మనసు చెప్పినట్టు మనిషి వినాలి కానీ , ఆ మనసు మాత్రం  మనిషి చెప్పు చేతుల్లో  ఉండదు కదా !!
, ఒక వ్యక్తిని ""తండ్రి "" అని పిలిచేది  కన్నతల్లీ చెబితేనే ,కదా ,!
దానికోసం ఒక certificate అంటూ ఒకటి ఉండదు ,!!బాల్యం నుండి అతడిని తండ్రీ అని పిలుస్తూ,, పిలుస్తూ ఉండగా అతడు తన "" తండ్రీ :""గా చెలామణి అవుతున్నాడు
తల్లీ విషయంలో  మాత్రం ఎవరికి కూడా ఈమె ""తల్లీ"" అని చెప్పే అవసరం లేదు,,ఎందుకంటే  జననం నుండి ఆమె వద్దనే  పెరుగుతుంది కాబట్టీ!!
అదే విధంగా , ఈ మనసు తో ఒకరిని అదే పనిగా స్నేహ భావంతో చూస్తూ ఉంటే,అతడు ప్రాణ స్నేహితుడు అవుతాడు!
లేదా ఒకరిని ద్వేశభావం తో చూస్తూ ,,అదే పనిగా మనసుతో కక్ష పెంచుకుంటే ,అతడు "బద్ద శత్రువు ""అవుతాడు
ఒక పిల్లిని , లేదా కుక్క ,జింక లాంటి  వాటిపై తమో గుణ సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటే ,మనసు వాటి పై పడితే,,వచ్చే జన్మలో వాటికి కొడుకై ,లేదా తండ్రి గా అదే జన్మ ఎత్త వల్సి ఉంటుంది!!
ఈ విధంగా మనసు తో ఎవరిని  అధికంగా ప్రేమించినా , ద్వేషించినా కూడా ,తర్వాత జన్మలో కూడా ఆ బంధం కొనసాగించా క తప్పదు కదా !!
అభిమన్యుడు పోయాక , ""హా,,!!నా ""కొడుకా ,,కొడుకా !""అంటూ నిద్రాహారాలు మాని ,చేస్తున్న యుద్దం మాని అర్జునుడు దిగాలుపడి,  ఏడుస్తూ  అంతటి మహా  వీరుడు , పరాక్రమ శాలి  అయిన కుమారుడు  చనిపోయాక ఇక చావే మేలు అనుకుంటూ,,మనసును కొడుకు పై పెడుతూ దిగాలు పడి పోతుంటే ,శ్రీకృష్ణుడు తన ప్రభావంతో చని పోయిన  అభిమన్యుని  ఆత్మను రప్పిస్తా డు !
అతడిని చూసి ""కొడుకా అభిమన్యు !"" నిన్ను విడిచి బ్రతకలేను రా !""అని ఏడుస్తూ , ఉంటే ,,
,ఎవరయ్యా నీవు,,? నేను నీకు కొడుకును కాదు,,!నీవు నా తండ్రివి కాదు !""  తెలుసా !""
నేను  ఒక పవిత్రమైన ఆత్మను అంతే !! ,,దీనికి ఏ బందాల్లు  ,సంబంధాలు ఉండవు ,,!!
ఇప్పుడు నేను  భగవంతుని బిడ్డను!""" అంతే ,,అంటూ వెళ్ళి పోతాడు !!
అర్జునిన కు  జ్ఞానోదయం అయ్యింది అపుడు !!!
అందువల్ల, మనసు దేని మీద. విపరీతంగా  పెంచుకుంటే ,వచ్చే జన్మలో దానికోసం, తండ్రీ ,తల్లీ బిడ్డా  ఇలా , ఏదో ఒక  బంధం తో ముడివడి  పునర్జన్మ ఎత్తల్సి ఉంటుంది ,జీవుడికి !;
రజో తామస గుణాలతో మోహం లో పడి "",జీవన చక్ర భ్రమణం"" అనే రంగుల రాట్నం ,, లో గమ్యం లేకుండా తిరుగుతూ ఉండడం ,,  స్థిరమైన బుద్ది లేని ఈ మనసు వల్లనే కదా!!
అదే మనసును సత్వ గుణ ప్రధానం గల జంతువు ,లేదా మనిషి ,లేదా మూర్తి,పై  ఉంచి పదేపదే  అదే ఆలోచిస్తూంటే , ఆ సత్వ గుణం అలవడుతుంది జీవాత్మ కు !!
భక్తులు , పరమ హంసలు ,ఋషులు మునులు ,మహాత్ములు తమ మనసుని కేవలం పరమాత్ముని పై, సద్గురువుల పై ఉంచి , అదే భావంతో  జీవించి. తరించారు!!
మనసు  తన ప్రభావం   చూపేది  పంచేంద్రియాల ద్వారానే !!
1,,రుచికరమైన పదార్థాలు కనిపించగానే నోటిలో లాలా జలం ఊరుతూ
""తినా లి "" అని మనసు పీకుతూ ఉంటుంది
2,,సినిమా, టీవీ, ఆకర్షణీయ ప్రదేశాలు  అశ్లీల దృశ్యాలు చూడటానికి కళ్ళు తెగ ఆరాటప డుతు ఉంటాయి!!
3,,చెవులు ముచ్చట్ల కోసం ఎగిరి గంతే సే పాటలు ,చెప్పుడు మాటలు,వినడానికి ఎప్పుడూ  రిక్కిస్తూ ఉంటాయి చెవులు ,!
4,,కమ్మని సుగంధ ద్రవ్యాల పరిమళాన్ని ,వంటకాల , మిర్చీ, మసాలా వంటి వాసనను పసిగడుతూ ఉంటాయి ముక్కు రంధ్రాలు !!
ఇక  5,, స్పర్శ , ,,__శరీర సుఖం కోసం ,చల్లని నీరు ,గాలి  నీడ ,వెచ్చని పడక ,,మైథునం   వాటినీ పొందడం  కోసం ఎప్పుడూ తహ తహ లాడుతు ఉంటుంది !
అత్యంత చంచల మైన స్వభావం కలది  ఈ మనసు , !!ఒకకొమ్మ విడిచి మరొక కొమ్మ మీద గెంతుతూ ఉండే కోతివలె , తాత్కాలిక సుఖాల కోసం  నిరంతరం  కదులుతూ, దానితో రగిలే కోర్కెలు పొందడానికి  మనిషిని పరుగు లు  పెట్టిస్తూ ఉంటుంది  !;
పగ్గాలు లేని  గుర్రాల్లా ఇంద్రియాలు , అదుపుతప్పి , మనసు చెప్పినట్టల్లా చేస్తూ పోతాయి !! అందుకు ఒక  ఉదాహరణ చూద్దాం !! ,
దుర్యోధనుడు ధర్మా ధర్మాలు , న్యాయా న్యాయాలు అన్నీ  చదివిన వాడు ,,తెలిసిన వాడే !! ఎప్పుడూ గురువుల మద్య ఉన్నవాడే !!
,కానీ అతడి లో ఉన్న బుద్ది నీ  పనిచేయనీయడు !! తన , మనసు చెప్పినట్టుగా వింటూ పోతాడు ,! అంతే !!
మెదడు లో ఉన్న బుద్ది సాక్షిగా చూస్తూ ఉంటుంది ,!!
అతడు  తన బుద్దిని ఉపయోగించకుండా  మనసు ఆడించినట్టు ఆడుతూ గొప్ప"" శాడిస్టు"" గా తయారయ్యాడు
పెద్దలు భీష్ముడు ,ద్రోణుడు ,చివరకు శ్రీకృష్ణుడు ఇలా ఎందరు చెప్పినా వినకుండా,మూర్ఖంగా ప్రవర్తిస్తూ ,ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేసే దుర్మార్గం తలపెట్టాడు !!
ఆమె ఏడుస్తుంటే వీడికి పరమానందం ,!!
పాండవులు వనవాసం చేస్తుంటే వీడికి బ్రహ్మానందం !!,పంచభక్ష్య పరమాన్నాలు భుజించిన సంతోషం !! వాళ్ళు చావాలని యుద్దం సంకల్పించాడు,, అంతగా కసి ,కక్ష ,ద్వేషం పెంచుకొని ,5 ఊళ్లు కూడా ఇవ్వలేదు !
అందుకే శ్రీకృష్ణుడు వాడిని నరునితోనే  చంపించాడు !తాను మాత్రం కేవలం రాక్షసులను మట్టు పెట్టాడు !
,ఎందుకంటే దుర్యోధనుడు , ఆ రాక్షసుల కంటే కిరాతకుడు ,!!
రావణుడు జన్మతః రాక్షసుడు ,!!అతడు చేసే పనులు రాక్షసంగా ఉంటే, అది సహజంగా తోస్తుంది !!
కానీ ఈ దుర్యోధా నాదులు ,మనుషులుగా పుట్టినా ,చేసింది రాక్షస కృత్యం !!, వీళ్ళు రాక్షసుల కన్నా  ఘోర ప్రమాద కరమైన క్రూర  మృగాలు !!
మానవత్వం నశించిన మృగాలు , !!నర రూప రాక్షసులు!! వారు పద్దెనిమిది అక్షౌహిణుల మానవ మారణ హోమానికి ఒడి కట్టింది , ఆ దుష్ట చతుష్టయం !!
, ఎదుటి వాడు ఎంత బాధపడితే అంత ఆనందపడే శాడిస్టు తత్వం ఉన్నవాళ్లు ,, వారు!!
అలాంటివారికి బుద్ది పనిచేయదు ,,!!
"న్యాయం ధర్మం  ,దైవం ,మానవత్వం , విచక్షణా జ్ఞానం ,వివేకం ,విజ్ఞత ,పెద్దలు , మహాత్ములు,పురాణాల పట్ల  భక్తి భావం ,ఇహ, పరాల గురించిన ఇంగిత జ్ఞానం , ఇలాంటి పట్ల ఆసక్తి ,అనురక్తి ,బుద్దిని ఉపయోగిస్తే గ్రహించవచ్చు ను !!
కానీ మనసు,మనిషిని అటు వైపు బుద్దిని  పెట్టనీయ దు, పెట్టినా గానీ, మరచి పోయేలా చేస్తుంది, ఆచరణ లోకి అస్సలు రానీయ దు,
బొడి పురాణాలు ,అక్కరకు వచ్చేవా,time waste !"అంటూ తేలికగా కొట్టి పారేస్తుంది మనసు,
బోర్డర్ పై పాక్ సైనికులు అడుగడుగునా అడ్డు తగులుతూ ప్రమాదాలు తెస్తున్నట్లు గా,,మనసుతో కూడా గంటకు 120 మైళ్ళ స్పీడుతో,, ""పోనీ, ఇంకా పోనీ !""అని రెచ్చగొడుతూ , బైక్, కార్ నడిపిస్తూ, మనిషి ప్రాణాన్ని కూడా బలి తీసుకుంటుంది ,కనపడకుండా లోన ఉన్న శత్రువు ఈ మనసు!!""
ప్రహ్లాదుడు అంటాడు ,, తండ్రీ !; నీ మనసే నీకు ప్రథమ శత్రువు!!,అది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల రూపంలో  ఉండి,నిన్ను తప్పు ద్రోవ పట్టిస్తూ ఉంది,  బుద్ధితో  ఈ పరమ రహస్యాన్ని గ్రహించు  తండ్రీ !
అంతటా,నిండి ఉన్న శ్రీహరిని గుర్తించు !"" వినమ్రత తో నమస్కరిస్తూ అంటాడు !
అందుకే ఈ  మనలో శత్రువు రూపంలో దాగి ఉంటూ ,అకృత్యాలు చేయిస్తూ ఉంటున్న ఈ మనసు గురించి జాగ్రత్తగా ఉండాలి అని   భగవద్గతలో  గీతాచార్యుడు  చెప్పనే చెప్పాడు !
""నన్ను మనసుతో పూజించు !, మనసు పెట్టీ భావించు ! నీ,మనసును నా కివ్వు!చాలు ,! ,, ఆ బుద్దిని అలవరచు కో  అర్జునా !""అన్నాడు,,,,
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!!""
________&____________
,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...