Tuesday, April 28, 2020

త్యాగం అంటే ?"

Apr 26, 2020
హే రామచంద్రా !" అయోధ్యా నగర ప్రజలకు కావాల్సింది ,తమకు ఆదర్శంగా నిలి చే రాజు !
అతడి కష్ట ఇష్టాలతో వారికి పని లేదు !
మచ్చ లేకుండా ఉండాలి !
ఆ రాజు ఎంతటి వీరుడు ,శూరుడు ,పరాక్రమ శాలి ,శరణాగత వత్సలుడు ,, కరుణా సముద్రుడు ,,దర్మావతారుడు ,,మర్యాద పురుషోత్తముడు , ఆడిన మాట తప్పని వాడు ,పితృ వాక్య పరిపాలకుడు ,
ఇవన్నీ వారికి అవసరం లేదు
వారికి కావాల్సింది ,వారికి ఇష్టంగా ఉండే వ్యక్తి ,వారు మెచ్చిన వ్యక్తి !వారు చెప్పినట్టు గా నడుచుకునే వ్యక్తి ,రాజుగా ఉండేందుకు అర్హుడు !
వనవాస కాలంలో నీవు వద్దని అన్నా కూడా నేను నిన్ను అనుసరిస్తూ వచ్చాను
కానీ ,ఇప్పుడు ,నేనే నిన్ను నా వెంట రావొద్దు అంటున్నాను
ఎందుకంటే, రాముడు భార్యా లోలుడు ,
అందుకే ,చెరగని మచ్చ తో ఉన్న సీతను అడవిలో వదలి రాకుండా వెంట తెచ్చాడు
తగుదునమ్మా అంటూ  తనతో బాటు ,రఘువంశ సింహాసనం పై కూర్చో బెట్టాడు  ,అంటున్నారు
ఇక ఇప్పుడు ,నీవు నాతో బాటు  , అయోధ్య విడిచి వస్తె ,,
రాముడు ఎంత కాముకుడు అంటారు
ఈ నిందను నేను భరించలేను రాఘవా !;"
భార్యా భర్తల మధ్య ఉండాల్సింది అవగాహన
నేను అడవిలో ఉన్నా ,నీవు రాజ మందిరం లో ఉన్నా , తేడా రాదు
నాలో నీవు ,,నీలో నేను ,శాశ్వతంగా ఉంటాము ,
నీవు సంతోషంగా ఉంటే చాలు ,,నేను ఎక్కడ ఉంటున్నా ,ఎంత కష్ట పడుతున్నా ,నేను కూడా సంతోషంగా ఉంటాను
మన సంతానం  యొక్క భవిష్యత్తు  ఆరోగ్యంగా సంతోషంగా ,వీరత్వం ఉండేలా చూడాలంటే ,
హే , కరుణా సిం దొ, ___నేను నీ సమక్షంలో లేకున్నా   ,సంతోషంగా ఉండాలి
చింత తో బాధ పడేరాజు ,తనని నమ్ముకున్న ప్రజలకి సుఖ సంతోషాలు ఇవ్వగల డా ??
ఇవ్వలేడు కదా !
నీవు ఆత్మలో అనుభవించే వేదనా తరంగాలు ,నన్ను బాధిస్తూ,నా కర్తవ్య నిష్టను భగ్నం చేస్తాయి,
నేను చేస్తున్న త్యాగం సార్ధకం కావాలంటే ,రఘువరా ,నీ సంపూర్ణ సహకారం నాకు కావాలి
నా యందు నీకు గల ప్రేమను ,జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటూ ,,పై కి రానీయకుండా ,జాగ్రత పడుతూ , నిన్ను నమ్ముకున్న అయోధ్యా వాసులకు చక్కని పరిపాలన అందించు !!""
"త్యాగం"" అంటే  
బలి దానం !
"__ జరగబోయే  యజ్ఞం లాంటి ఉత్తమ కార్యం లో , తాను బలిగా మారుతూ ,తనను తానే ఎదుటివారికి దానంగా సమర్పించు కోవడం ,!!"
ఇన్నాళ్లు తనదై ఉన్న వస్తువును లేదా మనుషులను శాశ్వతంగా  ఇతరుల కోసం విడిచి పెట్టడం ,!"
"రాఘవా !
అయోధ్యా ప్రజలు నా శీలాన్ని శంకిస్తూ ఉన్నారు , పది నెలలు రావణుడి చెరలో బందీగా ఉన్న నన్ను ,ఇపుడు అయోధ్యా నగర పట్టపు రాణిగా అంగీకరించడం లేదు ,
ఎందుకంటే ,ధర్మాన్ని పాటించే రాజు అధర్మాన్ని ఆచరించడం వల్ల ,సామాన్య ప్రజలు కూడా ,అదే అధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారని  అయోధ్యా ప్రజల అభియోగం
హే రామభ ద్రా ,
రాజ్యాభిషేకం రోజున ,ప్రజల కోసం సన్యాసి ధర్మాన్ని అవలంబిస్తూ ,ప్రజా సంక్షేమం కోసం నీ సర్వస్వాన్ని  అవసరం అయితే భార్యను కూడా త్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా
హే నాథా !
నేను నీకు  సహదర్మ చారిని మాత్రమే   కాకుండా  నీకు మిత్రురాలిని కూడా
నీకు  ,నావల్ల కలుగుతున్న అపవాదు రాకుండా ,రఘువంశ కీర్తి ప్రతిష్టలకు మచ్చ రాకుండా ,నీవు రాజుగా చేసిన ప్రతిజ్ఞ  నిలబడేలా ,చూసే బాధ్యత నాపై పడింది,!
అయోధ్యా సింహాసనం పై మహారాణి గా నేను కూర్చోవడం వలన అది అపవిత్రం అవుతోంది!! అంటే , ,నాకు ఈ అయోధ్యా నగర వాసులపై  ఉన్న ప్రేమ  తగ్గుతోంది ,రామచంద్రా !""
ఏ ప్రజలకోసం రాజారాముడు దీక్షా కంకణం ధరించి ,,""నభూతో__ న భవిష్యత్ ""!
అనే విధంగా ,ప్రజా రంజంగా పాలన చేయాలని  సంకల్పించా డో , ఆ ప్రజలకు ,నేను వెళ్ళిపోయాక  ,నిజం తెలుస్తుంది ,, పశ్చాత్తాప పడుతా రు  , మన త్యాగాన్ని గుర్తిస్తారు ,!
,,___ఏదో ఒక రోజున ఈ అయోధ్యానగర వాసులకు  తమ తప్పు తెలిసి రాక పోదు !
జరిగిన తప్పిదానికి వారు నిన్ను క్షమాపణ చెప్పక పోరు !""
ఆ ప్రజలు నన్ను హేయంగ ,నీచంగా ,పతిత గా చూస్తుంటే , ,నాకు నా మీదనే అసహ్యం కలుగుతోంది !
ఏం చేయను ?
హే రామా ,! ఇపుడు ,
నీవూ నేనూ , విధి చేతిలో కీలు బొమ్మలుగా మారాం !
ఈ కాలానికి
మన ఇష్ట అయిష్టాలతో   పని లేదు !
నాకైతే  ఇప్పుడే ,ఈ క్షణమే జీవితం చాలించాలని ఉంది !
కానీ , ఆ ఘోరం ,
చేయలేను !!""
నా గర్భంలో పెరుగుతున్న రఘువంశ వారసులను  కని,పెంచి ,విద్యాబుద్దులు చెప్పించి ,నీవు గర్వపడేలా గొప్ప వీరులు గా తీర్చిదిద్ది ,తిరిగి నీకు సమర్పించే వరకు నా బాధ్యత తీరదు కదా ,,,
హే ప్రాణ నాథా ,!!"
అంతవరకూ నేను జీవించి ఉండక తప్పదు !!""
నీ వద్ద నుండి   అయోధ్యా నగరం బయటకు వెళ్ళేది శరీరం మాత్రమే !
నా ఆత్మలో నీవే ,!
నాలో నీవే నిండి ,ఉన్నావు !
అంతా రామమయం గా కనిపిస్తూ ఉంటుంది !
శ్రీరామా !
ప్రానేశ్వరా !
,నిన్ను మరవని ,నీ దివ్యమంగళ స్వరూపాన్ని క్షణమైనా విడవని ,భావ సంపద ను సదా  నాకు అనుగ్రహించు !""
నా గురించి ,నీకు మాత్రమే తెలుసు ,!
నీ హృదయం నాకు తెలుసు !
స్వామీ,!
నీ మదిలో మెదిలే ప్రతి స్పందన ,నాకు వినిపిస్తూ ఉంటుంది ,;
విధి మనపై గురుతర బాధ్యత ను భారాన్ని మోపింది !
పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ ,ఉన్న నేను  ,  మనసా వాచా కర్మణా  ,, ఏ ఒక్క క్షణము కూడా ,ఏ   దోషము ఎంచని నన్ను ,,,నీవు లేశ మాత్రం శంకించడం లేదని నాకు తెలుసు !"
కన్నీళ్లు కాలువ లై పారుతున్న ,గుండెలు బ్రద్దలు అవుతున్నా , ఈ సీతా రాముల వియోగ విరహానాల జ్వాలలు  నన్ను నిన్ను దహించి వేస్తున్నా కూడా ,  గుండె దిటవు చేసుకోవాలి !
కన్నీళ్లు కళ్ళలో నే  దాచేయ్యాలి ,!
తప్పదు !
ఏ నాడు , ఏ భార్యా భర్తలను విడగొట్టి న పాపమో ,ఇపుడు మనల్ని ఇలా నిర్దయగా వెడిస్తు , దేహాలను కాలుస్తూ ఉంది!!"
ఈ సీత లేకుండా  ,,ఈ రాముడు జీవించలే డని ,నాకు  తెలుసు ! స్వామీ !
అలాగే నీవు లేని నేను కూడా  ఉండబోదు ,,రఘుకులా తిలకా !!"" !!
___ నీ పై గల రాజ్యభారాన్ని నీవు ఏ విధంగానూ తప్పించుకోలేవు !""
సూర్య వంశ రాజుల వలె నీవు కూడా వారి అడుగుజాడల్లో  చక్కగా  పాలిస్తూ,ప్రజల మెప్పును పొందవలసి ఉంది !;""
అలాగే ఇపుడు నాపై కూడా   మన సంతానాన్ని కని,, పెంచి, ఈ అయోద్యనగరానికి  సమర్థులైన వారసులు గా తయారు చేసి మీకు అందజేసే  బాధ్యతను కూడా , నేను  నిర్వహించాల్సి ఉంది
కౌసల్యా తనయా ,!""
హే  ,నాథా !" పాపం !"
నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు ,?!
ఎంత మంది రాక్షసులను సంహరించావు ,?? అయినా బెదరకుండా , పరిస్తితులకు లొంగకుండా
ధర్మాన్ని తూ చా తప్పకుండా   ఆచరించావు కదా !?
మనిషిగా పుట్టడం వలన ,జీవితంలో  ,,అడుగడుగునా ,ఎన్ని పరీక్షలో  ,ఎన్ని కష్టా లో  చూశావా ,ప్రభో !!""
,,నీవు చూపించిన అపారమైన ప్రేమానురాగాలకు ప్రత్యుపకారం గా  నీకు నేను సమర్పించుకు నేది నాది అంటూ ఏమీ లేదు  , స్వామీ !""
ప్రస్తుత సమస్యకు  పరిష్కారం ,నీవు నన్ను వదలుకోడం తప్ప మరో దారి లేదు !""
అయోధ్య లో ప్రజల  మధ్య  నన్ను నిలబెట్టి ,,నాకు అగ్నిపరీక్ష  నీవు చేయలేవు !
చేసి నా కూడా  ఫలితం ఉండబోదు !"""
ఎందుకంటే ,
"",అలాంటి ఘోర పరీక్షలు  దేవతా స్వరూ పులు,, మీరు  మాత్రమే చేయగలరు ,!
మేము , అతి సామాన్యులం ! , మేము మీ వలె అగ్నిప్రవేశం  చేయలేము కదా !"__
అంటూ  నిజం కప్పి పుచ్చి ,,తప్పించు కుంటారు  !!""
ఒక స్త్రీ,  పరాయి పురుషు ని ఇంటిలో  విధి లేక ,ఇష్టం లేకున్నా ఒక రాత్రి   తలదాచు కొన వలసి వ స్తే , 
ఆమెను  కులట ,పతిత , గా ముద్ర వేస్తారు !పెద్దలంతా కలిసి  తీర్మానించి సంఘం నుండి  ఆమెను  వెలివేస్తారు !"
,సమాజం నుండి బహిష్క రిస్తారు !
నిలువ నీడ లేకుండా చేస్తారు !.
సాక్ష్యాలు ,పశ్చాత్తాపం ,ప్రాయశ్చిత్తం ఇవేమీ పని చేయవు !
అందరూ ఉండికూడా ,అనాధగా ,మారి ,చివరకు ఆత్మహత్య  చేసుకుంటూ ,,ఘోరమైన పాపానికి ఒడిగట్ట వలసి వస్తుంది !
ఇదేనా మానవ జాతి సంస్కారం ,సంప్రదాయం ,ఆచారం ,కట్టుబాట్లు ఇవేనా ?
ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే అధికారాన్ని ఏ ధర్మం ,ఒప్పుకుంటుంది ??"
ఏ రాజూ  ,, ఏ న్యాయ స్థానం కూడా దీనికి  తీర్పు  చెప్పలేదు !!
ఇది యుగ యుగాలుగా ఆడదానికి " శాపం ""గా,
""పురుషాధిక్యత   సమాజానికి కళంకం ""గా  మారు తూ వస్తోంది !
"""నేను పవిత్రురాలిని !
,నాకేమీ తెలియదు!
నేను ఏ పాపం ఎరుగను !"
నా వల్ల  ఏ తప్పు జరగలేదు  ;"అంటూ ఎంత మంది పెద్దల ముందు మొత్తుకున్నా  ,,ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా ,,కూడా లాభం ఉండదు !
ఏ దేవుడూ ఆమె దీన స్థితి పట్ల  కరుణించడు !!
భర్తా ,అత్తా ,మామ ,తల్లీ దండ్రి బంధువులు , తోబుట్టువులు ఆమెకు రక్షగా నిలబడే దైర్యం చెయ్యలేరు !!""
ఎందుకంటే , ఈ స్త్రీని చంపకుండా విడిచిపెడితే ,, రేపు వారి ఇంటిలో ఆడది కూడా , ఇలాగే   బరి తెగిస్తూ ఉంటుందని,,వారి  భయం !;""
అందుకే తమని కాదు అన్నట్టుగా   ఉంటారు !"
. ఇలా స్త్రీలు ,తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే నా ?
స్త్రీలు ఈ  దుర్మార్గ వ్యవస్థకు ఎదురు నిలిచి ,,తిరగబడే రోజు వస్తుందా !
ఆమె అపరాధి కాదు,అని రుజువు అయ్యేవరకు  ,, ఈ కరుణ లేని ఈ పాపపు సమాజం ఆమెను సజీవంగా ఉంచు తుందా ?!"
,,అందుకే ,ఆమెకు రక్షణ గా ఎవరూ రారు !"
తమను కూడా సమాజం వేలెత్తి చూపిస్తూ , ఘోరంగా అవమానిస్తుందని  వారి భయం !""
అంతవరకూ ఉన్న తనవారు ,బంధువులు ,ఆత్మీయులు  అందరూ ఆమెను  అసహ్యించుకోవడం  మొదలెడతారు !!""
,చివరకు,, ఇన్నాళ్లు తనతో కలిసి  సంసారం చేసి ,పిల్లలను  కన్నాక ,భార్య మనస్తత్వం తెలిసిన మొగుడు కూడా ,ఆమెను  అనుమానిస్తూ ఉంటాడు !!
ఇప్పుడు  , ఈ విశాల ప్రపంచంలో ఆమె ఏకాకి !"
  దిక్కు లేని బ్రతుకు !
హే రామ భద్రా !"
అయోధ్యా కు దగ్గర్లో   ,గంగానది ప్రవాహ పరిసరాల్లో  ,,వాల్మీకి లాంటి మునిపుంగవులు నివసిస్తూ ఉన్న ఆశ్రమ  అరణ్య ప్రాంతం లో నన్ను చేర్పించి ,,నా ప్రార్థన ను మన్నించు ,
భర్త అనుమతి లేకుండా ఏ స్త్రీ తన నిర్ణయాన్ని అమలు చేయలేదు కదా !
స్వామీ ,నీవు ధర్మ మూర్తి వి!
నీకు తెలియని ధర్మం లేదు !
దయచేసి ,నా ఈ ధృఢ సంకల్పాన్ని  , నెరవేర్చే చిత్తశుద్ధిని ,మనో బలాన్ని ,,ఆత్మ స్థైర్యాన్ని కలిగేలా నన్ను దీవించండి
హే రామా !
భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు
నా హృదయపూర్వక ప్రణామాలు స్వీకరించండి స్వామీ,
నీ పాదపద్మముల పై నా చిత్రాన్ని అనవరతము నిలిపి ఉండే లా నన్ను అనుగ్రహించండి
ప్రభో
నాకు ఆశ్రమాలలో ముని పత్నుల సహవాసం తో ఉండాలని  నా కు కోరికగా ఉందని ,చెబుతూ
లక్ష్మణుడితో  తోడుగా నన్ను రథం లో  ,  ఇదే రోజు ,ఇదే రాత్రి  పంపించండి
హే రామా!
నా ప్రణమాలు స్వీకరించు
స్వామీ, నాకు అనుమతి నివ్వండి !
సెలవు "
శ్రీ రామచంద్ర పరబ్రహ్మ నే నమః !
శ్రీ  సీతారామచంద్ర  భగవాన్ కి జై !
జై శ్రీరామ్ !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...