Aug 11, 2020
""మౌనంగా ఉండటం అనేది ఒకచోట _"అపరాధం__"" గా మారితే __మరో చోట , అదే మౌనం జీవన్ముక్తి కి సోపానం గా మారుతుంది .__
తన లోన బడబానలం దాచుకున్న సముద్రం , మహా గొప్ప నదులు సంగమించే సముద్రం , ప్రళయ తాండవం చేసే తుఫానులు సృష్టించే సముద్రం ,, మామూలు వేళల్లో ఎంత ప్రశాంతంగా ,, ఏమీ ఎరుగని అమాయకుడు వలె ఎంత మౌనంగా ఉంటుందో చూస్తూ ఉన్నాం _!
"తథాగతుడు , బుద్ద భగవానుడు _ విరాగియై ,వ్యామోహం పుట్టించే , రాజ్యాన్ని ,,భార్య బిడ్డలని,, సమస్త సుఖ భోగాలను,, త్యజించి , సత్యాన్వేషణ మార్గంలో సాధన సాగిస్తూ మౌనంగా ఉంటూ గయా క్షేత్రం లో__ఘోర తపస్సు చేసాడు__!
""మానవుడి జీవిత లక్ష్యం ఏమిటి ,??
__" ఎందుకు మనిషికి _ఇన్ని బాధలు __?
__ తప్పించు కొలేని ,,ఈ జరా రోగ మృత్యు భయాలతో __ అమృత తుల్యం లాంటి ఆనందమయ మైన ఈ మానవ జీవనం ,__ ఈతి బాధల మధ్య __అజ్ఞాన అంధకారం తో , సతమతం కావలసి న దేనా?""
__ బ్రతుకంతా ఇలా సంఘర్షణ తో పోరాడే ,ఈ జీవన్మరణ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా ,__?""
అంటూ ఏళ్ల పాటు ఒంటరిగా సత్యాన్వేషణ చేస్తూ,,ఒక బోధి వృక్షం క్రింద కూర్చుని , నిశ్శల సమాధిలో ,,,తన అత్మ విచారణ కొనసాగిస్తూ వచ్చా డు,__!
ఎట్టకేలకు ,,ఆయనకు సమాధానం లభించింది _!
__"అన్నిటికీ ఈ మనస్సే కారణం ,_"అంటూ
"ధర్మం, అహింస, సత్యం ,_" దారులు మాత్రమే మనిషికి __రక్షణ కవచం లా వుండి ,, సకల బాధలనుండి విముక్తిని ఇస్తాయి __"అని ప్రతిపాదించాడు
_"ధర్మం శరణం గచ్ఛామి _!
సంఘం శరణం గచ్ఛామి_!
బుద్ధం శరణం గచ్ఛామి_!
అంటూ తానే స్వయంగా పూనుకొని ,తన శిష్య బృందంతో,, కాలి నడకన, గ్రామ, గ్రామం తిరుగుతూ , ప్రశాంతమైన ఉద్యమాన్ని ఉధృతం చేశాడు __!
ఒకసారి ,,ఒక గ్రామంలో తన శిష్య బృందంతో అతడు ఉండగా __,గ్రామస్తులు కొందరు తమ పనులు మానేసి అతడి బోధలు కూర్చుండి వింటున్నారు__!
ఇది చూసి మిగతావారికి బుద్దుడి పై ఆగ్రహం కలిగింది __!
కోపంతో, వారు అతడిని నానా తిట్లూ తిట్టారు ,__!దుర్భాషలు ,రాళ్ళు విసరడం లాంటివి చేశారు _!
""నీవే ఏ పనీ చేయకుండా. __ఒక పనికిమాలిన వాడివి__" అనుకుంటే __,మా వాళ్ళను కూడా. దద్దమ్మ ల వలె పనిచేయకుండా బుద్దావతారాల వలె _ నీతులు చెబుతూ _ మా ఊరును పాడు చేస్తూ ఉన్నావా __?"
__వెళ్ళి పో__!" ఇక్కడినుండి __!""అంటూ అతడిని అవమానించారు __!
ఇంత గా నిందలు పడుతూ .కూడా __ వారికి ప్రత్యుత్తరం ఇవ్వకుండా
బుద్దుడు_" మౌనంగా"" ఉన్నాడు కళ్ళు మూసుకుని___!
__ అలా ఆయన ,ఎవ్వరినీ ఏమీ అనకుండా__ స్పందన లేకుండా _ కోపానికి రాకుండా మౌనంగా_ ఉంటే
శిష్యులకు కోపం వచ్చింది_!
_అడిగారు__ ఎందుకు వారికి తగిన సమాధానం చెప్పడం లేదని ?"
ఆయన మందహాసం చేస్తూ ,,
" నేను వారి మాటలు వింటే కదా ,ప్రతిగా స్పందించడానికి ,__?
__ఆ మాటల తీవ్రత ను నేను గ్రహిస్తే కదా ,నాకు బాధ __??"
. _కానీ నేను వాటిని గ్రహించలేదు __!"
_ , నాకు కాదు బాధ ,_!ఇప్పుడు వారికీ కలుగుతుంది సుమా ఆ బాధ _!
చిరునవ్వుతో అన్నాడు బుద్దుడు
అన్నట్టుగానే , క్రమంగా గ్రామస్తులకు తమ పొరబాటు తెలిసి వచ్చింది,_!
అందరూ అత డిని క్షమాపణ కోరారు ,__!
ఆ విధంగా ,
బుద్దు డి ""మౌనం"" వారిలో మార్పు తెచ్చింది _!
_వారి ప్రవర్తన లో పరివర్తన కలిగింది __!
_మన మహాత్మా గాంధీ గారు కూడా మౌన వ్రతం వారానికి ఒక రోజు చేసేవారు __! ఆ రోజున ఎంత గొప్పవాడు వచ్చినా , మాట్లాడేవాడు కాదు __!
సమయ పాలన లో ఆయన దురంధరుడు _!
_ వాస్తవానికి ,ఈ " మౌనం" ఒక గొప్ప సాధనా సంపద __!
ఎంతో కృషి చేస్తేనే గానీ ఆ సంపద ప్రాప్తించ దు కదా _!
మౌనం ఒక ఆయుధం _!
అది వ్యక్తిలోని సంకల్పాన్ని ధృఢ తరం చేస్తుంది _!
జీవుడిని దేవుణ్ణి చేస్తుంది కూడా _!"
ఏళ్ల పాటు మౌనంగా ఉంటూ చేసిన తపస్సు లేదా ధ్యానం వలన_ యోగులకు , అమోఘమైన శక్తి ప్రాప్తిస్తుంది _!
అందుకే రావణుడు , హిరణ్య కశిపుడు,లాంటి రాక్షసులు మాత్రమే కాకుండా ,,ధృవుడు ప్రహ్లాదుడు మార్కండేయుడు లాంటి ఎందరో భక్త శిఖామణి పుంగవులు మౌనాన్ని యజ్ఞం గా భావించి, ఇబ్బందులను సహించి ,, కృషి తో లక్ష్యాన్ని సంకల్పించి,,
అనుకున్నది సాధించారు__!
పరమాత్మ సాక్షాత్కారం పొందారు _!
మౌనం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది ,__!
ఆత్మకు తృప్తిని పరమానం దం ఇస్తుంది __! పరమాత్మ అనుభవాన్ని కలుగజేస్తుంది __!
మౌన దీక్షలో ఉంటూ ,,తమ అంతరంగం లో , రమిస్తూ _బాహ్య స్మృతి లేకుండా__ బ్రహ్మానందం పొందుతూ ఉంటారు
__,బ్రతికి ఉండగా నే బొందితో కైలాసం వెళ్ళే వారి పరమ పద సోపానానికి,, మౌన మార్గం _ సుగమం చేస్తుంది __!
__ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతంగా ఉండే సముద్రం వలె
ఈ మౌనం కూడా__ అప్పుడప్పుడు ,, అంతటి ఉపద్రవాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది __!
ఇప్పుడు ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తి వల్ల ప్రపంచంలో ఎక్కడి వారు అక్కడే స్వచ్చందంగా తమ తమ ఇండ్లలో గ్రామాల్లో నగరాల్లో స్వచ్చందంగా బందించ బడ్డారు _ కదా _!"
అంటే బయటి ప్రపంచం తో సంబంధాలు బాహ్యంగా తెగిపోయి నట్టే కదా__!
""దయచేసి మా ఇంటికి రాకండి __!""
అన్న బోర్డు తగిలిస్తూ ఒంటరి వారుగా జీవిస్తూ__ మౌనం గా ఉండడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు __!
నిజమే. కొడుకులు కూతుళ్ళు పెళ్లిళ్లు అయి కరోనా ధర్మమా___" అని _ పెద్దవారి దగ్గరకు రాకుండా దూరం దూరంగా ఉంటే ముసలి ప్రాణాల గతి ఏమిటి ?_
తమ సంతానం అలా,,మౌనంగా ఉండటం అనేది వారి పట్ల ఒక శాపంగా మారుతోంది__!
భార్యను కోల్పోయిన భర్త ,__!
భర్త లేని భార్య __! మౌన పోరాటం సాగిస్తూ ఉన్నారు __!
, తన ఆత్మీయులు దూరంగా ఉండడం ,, ఒంటరిగా సమాజం నుండి వెలువేసినట్టు గా,,వృద్దులు నాలుగు గోడల మధ్య మౌనంగా ఉండటం అంటే
_ స్వచ్ఛంద మరణం తో సమానం _!
కరోనా పీడ వల్ల బయట తిరగ రాదు_!
వారి అవసరాలు తీర్చే దిక్కు లేదు _!
అలా తమ
బాధ చెప్పుకునే దిక్కు లేక __ఎందరో అభాగ్యులు , ,, వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం మనకు తెలుసు కదా _!
అందుకే __మౌనంగా ఉండడానికి ""దమ్ము __ధైర్యం _సాహసం __ ఆత్మ విశ్వాసం_ ,పట్టుదల ,భగవంతుడి పైన నమ్మకం _ ఆత్మ గురించిన ,, జ్ఞానం ఉండాలి
__"మౌనం_" అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టడం ,__!
పరిసరాల ప్రభావానికి ప్రతీకార చర్య లేకుండా మనసును కట్టడి చేయడం __!!""
అంటే __ మౌనం " అంత సామాన్య మైన విషయమా__??""
ఎంతో కృషి ,సాధన చేస్తూ ధృఢ సంకల్పంతో గమ్యం తెలియని దారిలో,అంతం లేని ప్రయత్నం చేస్తూ పోవాల్సి వస్తుంది __కదా _!!
మౌన పోరాటం అనేది చాలా గొప్ప ఆయుధం __!
మహాత్ముడు గాంధీ గారు ఇదే అంకుశం తో ,,"" అహింసా పరమో ధర్మః__!""
అంటూ బ్రిటిష్ వా రి,అక్రమాలు అన్యాయాలను మౌనంగా ప్రతిఘటిస్తూ ,,, నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేస్తూ,, విజయాన్ని సాధించారు _!
స్వాతంత్ర్య సమర రంగంలో
గాంధీ గా రి ప్రవేశం కంటే ముందు__ శివాజీ ,కట్టబ్రహ్మన , అల్లూరి వంటి ఎందరో వీరులు __ దేశ భక్తులు కూడా స్వాతంత్ర్యం సంగ్రామ యజ్ఞంలో స్వచ్చందంగా ముందుకు వచ్చి , విదేశీ పాలకులను ఎదురించి దేశం కోసం ఆత్మార్పణ చేసుకున్నారు __!
అయితే. అప్పటి పోరాటం వారి సామ్రాజ్య హద్దులు వరకే పరిమితం అయ్యింది
కానీ
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచలం వరకూ ఏక చత్రం లో __ప్రశాంత ఉద్యమం నడిపించి , అహింసా మార్గం లో __ మౌన పోరాటం తో స్వాతంత్ర్య సముపార్జన గావించిన ఘనత మహాత్మునికి __దక్కింది __
ధర్మాచరణ కు కూడా మౌనం సహకరిస్తూ ఉంటుంది ,ఇలా _!
,ధర్మ రాజు __ కౌరవులు. తమకు ఎన్ని అన్యాయాలు_ అధర్మాలు చేసినా మౌనంగా భరిస్తూ వచ్చాడు__!
ఆ మౌనం __ ప్రళయం వలె _మహా భారత యుద్దం రూపంలో ఒక్కసారిగా. ఉప్పెన వలె పొంగి పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం ను వీరాధి వీరులను నిలువునా ముంచి పారేసింది __!
వివేకానంద స్వామి ,రామకృష్ణ పరమహంస యోగానంద,
రమణ మహర్షి లాంటి మహానుభావులు మౌనం గా ఉంటూ అద్భుతమైన శక్తులు మహిమలు ,వేదాంత దర్శనము,,తమ యోగ సాధన ద్వారా సాధించారు
అందుకే
మౌనం అనేది__ ప్రాపంచిక సౌఖ్యాలతో స్వార్థ భావన తో చూస్తే తననే కబలించే ఒక దెయ్యం అవుతుంది __! మౌనం గా ఆత్మ శాంతితో మనలేని వారు,,__
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము లకు గురి అవుతూ ఉంటారు _! __సంసార లంపటం లో చిక్కి, గమ్యం తెలియని దారిలో , సుఖశాంతి లేకుండా మనసు ఎప్పుడూ తింపుతుంటుంది
ఇదే మౌనం,, పరమాత్మ సాన్నిధ్యం చేరాలన్న తపనతో ఒక తపస్సు లా కొనసాగిస్తూ ఉంటే మాత్రం ,,అతడు , అమోఘమైన శక్తి సంపన్నుడు అవుతాడు __!
జీవుడు దేవుడు కావచ్చు__!
జీవాత్మ ను. పరమాత్మ తో అనుసంధానం చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది_!
జన్మ రాహిత్యమైన పరమాత్మ సాక్షాత్కారం సాధించాలి అంటే ""మౌనాన్ని" ఆయుధంగా ఉపయోగిస్తూ, నిరంతర_
యోగా భ్యాసం ద్వారా,మనస్సును నిగ్రహింప చేస్తూ , సాధన చేయాల్సిన అవశ్యకత,,ఎంతైనా ఉంటుంది ,,కదా _!
మౌనం ఒక యోగం _!
ఇంద్రియాలను మనస్సును బుద్దిని నియంత్రిస్తూ ,ఆత్మలో లయం చేస్తూ, పరమాత్మ ను ధ్యానిస్తూ, పరమానంద దాన్ని పొందే అద్భుత అపురూప అమోఘమైన ,, అంతర్ముఖ పరిశీలన,అవుతుంది_
,ఆత్మ విచారణ తో ఆత్మానందాన్ని పెంచుతూ
జీవుడి ని ,ఉద్దరిస్తుంది ,
దుర్గతిని ,,సుగతి గా మారుస్తూ ఉంటుంది ఈ మౌనం _!
మనసు పలికే భాష ఈ మౌనం _!!
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా
No comments:
Post a Comment