Saturday, May 25, 2019

దేవుడు ఎక్కడ ఉన్నాడు?

May 25, 2019
దేవుడు ఎక్కడ ఉన్నాడు,? అనే సందేహం అందరికీ కలుగుతుంది నా ప్రక్కన లేడు, మనల్ని చూడటం లేదు గదా అని అబద్ధాలు, తప్పుడు పనులు, చేస్తుంటాము, ! కాని అతడు మన హృదయం అనే పద్మం లో విరాజిల్లుతూ ఉన్నాడు! ఇది మనం గుర్తించడం లేదు, దానికై ప్రాకులాట లేదు. ఎంతసేపు ప్రాపంచిక మనస్తితి లో  బ్రతకడం అలవాటుగా మారింది!"", శ్రీ విష్ణు హృత్ కమల వాసిని, విశ్వ మాత, !""అనే లక్ష్మీ స్తోత్రం లో, మహావిష్ణువు తన హృదయ కమలం లో అనగాతన వక్షస్థలం లో లక్ష్మీ మాత అనగా పరమాత్ముని సన్నిధానం, లో ధరించి ఉన్నాడు.  అదే జీవికి అనాహత చక్రం లో ఉండే శాశ్వతఐశ్వర్యం, ముక్తి ధామం,, కూడా!,  హృదయం అనేది ఒక భావ సంపద, !అది "లబ్ ,డబ్" అని నిరంతరం కొట్టుకునే గుండె కాదు,! పద్మం లా  అత్యంత కోమలము, సుకుమార ము, సుమధుర ము, సుగంధ భరిత ము, పరమాత్ముని పవిత్ర నివాస స్థానము కూడా ! అందుకే హృదయాన్ని కమలం తో పోలుస్తారు,,! ఇది అనుభవైక వేద్యము,! అది చేతికి చిక్కేది కాదు,, చూపుకు కనపడేది కాదు! బాహ్యంగా, పదార్థంగా దొరికేది అంతకంటే కాదు,! అది కేవలం మనలో అంతర్లీనంగా ఉండే అద్భుతమైన దివ్య శక్తి సంపద, ! అన్నమయ్య లాంటి సంకీర్తనా చార్యులు, తాము పలికే కీర్తనలో ప్రతీ పదాల్లో, స్వామి పాదాలను, మూర్తి వైభవాన్ని , తమ హృదయంలో దర్శిస్తూ, రమిస్తూ, కీర్తిస్తూ, బాహ్య స్మృతి లేకుండా, వైకుంఠ లోకంలో, ఉన్న పరంధాముని వైభవాన్ని కూడా, పరమ అద్భుతంగా హృదయ అంతరాళం లో అనుభవించ గలిగారు,,! అలాంటి మహానుభావులు ఎందరో తమ హృదయ కమలాన్ని పరంధాము నీ, పాద పద్మాల ముందు భక్తితో సమర్పించి , జీవన్ముక్తి నీ పొందారు..!మనిషికి ఉన్న మహదై శ్వర్య భావన ఈ హృదయం,!, అది జీవునికి , దేవునికి అనుసంధానంగా పని చేసే భవ్య మైన, దివ్యమైన అలౌకిక బ్రహ్మానంద స్తితి  ,,;!! హృదయం ఉన్న ప్రతివాడూ, ప్రేమ అన్న పదానికి అర్థం తెలిసిన వాడు,  అయి ఉంటాడు, పరమాత్మతో పెట్టుకున్న అనుబంధమే నిజమైన, వాస్తవమైన ప్రేమను సూచిస్తాయి, జన్మ కర్మ బందనాల నుండి విముక్తి నీ ప్రసాదిస్తుంది కూడా ! ఈ భార్యాపిల్లలు బందువులు, స్నేహితులు, , సంసార లంపటాల యందు మనం చూపేది , "మోహం, లేదా వ్యామోహం, !"అవుతుంది,  ..ఎందుకంటే అవి, ఆ బంధాలు ,అనుబంధాలు, శాశ్వతంగా నిలిచేవి కాదు,, జీవుని ఉద్దరణ కు పనికి రావు ! పరమాత్మ ను హృదయం లో  ప్రతిష్టించి, పరమానందాన్ని  పొందడం , పవిత్ర ప్రేమ యొక్క లక్ష్యం,! ఆ ప్రేమ హృదయంలో నే , దైవానుగ్రహం తోనే  చిగురిస్తుంది,! హృదయం అనేది  దైవం మనిషికి , అనుగ్రహించిన ప్రసాదం ,! హృదయం ఎక్కడుందో తెలియాలంటే, మనసు పెట్టి్, కళ్ళు మూసుకొని,, ధ్యానించు,! అంటే దైవాన్ని అంతటా భావించు!, ఇప్పుడు నీ దృష్టి ,బాహ్య ప్రపంచం లో నీ వస్తువులు, లేదా మనుష్యుల పై స్మృతి ఉండరాదు, !, నీ శరీరాన్ని తాకే చల్లని గాలిలో, ఉన్నాడు పరమాత్మ! , త్రాగే నీటిలో, నదులు, సముద్రాల్లో,, ఉన్నాడు! లోన ఉండి ఆహారం జీర్ణం చేస్తున్న జఠరాగ్ని లో, ఉన్నాడు!, పచ్చని పైరు పంటలతో జీవకోటి నీ బ్రతికిస్తు న్న ధరణి లో, ఉన్నాడు! సూర్య చంద్రులు, నవగ్రహాలు, నక్షత్రాల పుంతలను అవలీలగా, ఒకదాని నొకటి తాకకుండా సునాయాసంగా, సులభంగా త్రిప్పే వినువీదిలో, ఇలా పంచభూతాల్లో తానై , అన్నీ తానై,, తానే అంతా అయ్యి, ఉన్న భగవంతుని వైభవాన్ని స్మరిస్తూ, పోతూ ఉండు!, అండ పిండ బ్రహ్మాండము అంతటా నిండి ఉన్న స్వామి, నీలో కూడా నెలకొని ఉన్నాడు, అన్న సంపూర్ణ విశ్వాసంతో నిరంతర సాధన కొనసాగించు,! నీ భావన లో పవిత్రత, నీ అంతరంగం లో చిత్తశుద్ది, నీ మదిలో, పరమాత్మ వైభవాన్ని పొందాలన్న తపన,, ఆర్ద్రత, ఆరాటం, ఆవేదన, కృష్ణయ్య దర్శనం కోసం ఆర్తి, గానీ ఉంటే, గోపాల కృష్ణుడు, కరుణా లోలుడు, భక్తజన హృదయ మందారుడు, గోవిందుడు తప్పకుండా నీ హృదయం కమలం లో ప్రత్యక్ష మౌతాడు,! ఆ నవనీత హృదయం గల నవనీత చోర బిరుదాంకితుడు, నీవు ఎప్పుడు పిలుస్తా వో,,! మూసుకొని పోయిన నీ హృదయ పద్మం, తనకోసం ఎప్పుడు తెరుస్తా వో ! తనకోసం  అనుకుంటూ , ఎల్లప్పుడూ నీ ఆరాధనా భావం తో పిలిచే నీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు!, నీలో ఉన్న తనను నీవు గుర్తించలేని దుస్తితి లో, ఉన్నందుకు జాలి పడుతూ, నిన్ను విడవకుండా,, నిన్ను ప్రేమిస్తు ఉంటాడు, గోపాల కృష్ణుడు, !అందుకే సర్వాంతర్యామి అయిన నందగోపా లుని చరణార విందాలు,, మన హృదయ పద్మం లో విరాజిల్లుతూ ఉండాలని కోరుకుందాం,! ఆ యశోదా తనయుడికి మన హృదయ మందిరంలో కి స్వాగతం, సుస్వాగతం పలుకుదాం,! వేణు గోపాలా,! నీవున్న ఈ శరీరం ధన్యం!, బంగారం,! పరమ అద్భుతం!, పరమానంద కరం,! నీవు లేని ఈ ఇల్లు శవం తో సమానం , నీవుంటే నే సత్యం, శివం, సుందరం ! నీ జగన్మోహన ఆకారంతో, సుందర సుకుమార అపురూప సౌందర్య లావణ్య అందాల ఆనందాల స్వరూపంతో, మౌక్తిక మణి హారంతో, కస్తూరీ తిలకం తో, శిఖీ పించమౌళి గా, వేణు వాద వినోద విశార దునిగా, సర్వాలంకార భూషి తు నిగా మా హృదయం లో నెలకొనవయ్యా గోవిందా,! నేను ఇష్టంగా భుజించే భోజనం, నీకోసమే, సుమా !నేను ఎది చేసినా,  అది నీకే "" సమర్పయామి !""అంటూ భావిస్తాను తండ్రీ,! నారాయణా, !వాసుదేవా,! జగదీశ్వర ! భక్త వత్సలా! అర్తశరణ్యా ! శరణు , !నా భారం నీదే,! నన్ను నీ వాడిగా చేసుకో, కృష్ణా! మనసా, వాచా, కర్మణా నిన్ను కొలిచి తరించే స్ఫూర్తిని ,భాగ్యాన్ని నాకు  అనుగ్రహించు శ్రీకృష్ణా,,! దేవకీ నందనా శరణు,,! శ్రీనివాసా శరణు,! అనాధ రక్షకా ,, శ్రీ వేంకటేశ్వరా శరణు ,! హరే కృష్ణ హరే కృష్ణా ! స్వస్తి !"

ఓ మనసా!

May 24, 2019

మానస సంచరరే, బ్రహ్మణి,,!""ఓ మనసా,! నా యందు కృప ఉంచి, నీవు, ఆ గోపాలకృష్ణ మూర్తి పరందాముని సన్నిధిలో  బ్రహ్మానందం పొందుతూ, చల్లని పున్నమి  వెన్నెల కాంతుల లో, పరమానంద భరిత డోలికల్లో తన్మయం తో, సంచరించే చకోర పక్షుల్లా, అద్భుత ఆనంద స్థితిలో మైమరచి ఉంటూ, దైవ ప్రసాది త మైన, నా ఈ జన్మను ధన్యం చేయవే మనసా! నిన్ను బ్రతిమాలు కుంటున్నాను, ఆ నండనందనుని. శిఖిపించ మౌలిని, మహనీయ కాంతులను విరజిమ్ముతూ ఉండే, శ్రీకృష్ణుని కపోలాల ను ,కుండలాల వెలుగుల్లో కోటి సూర్య కాంతులతో ప్రకాశించే ఆ రాధామాధవుని తనివార, మనసారా, కాంచి పులకించవే,, ఓ మనసా, నీవు కన్నయ్య పై గురి నిలిపితే, నా హృదయం, బుద్ది, ఆత్మ, కర చరణా దులు, సర్వం ఆ వేణు గాన విశార దుని, పెదాల నుండి జాలువారే, అమృతగాన మాధుర్యాన్ని, ఆస్వాదించే మహా మహా భాగ్యాన్ని, గ్రొలవచ్చునే, తల్లీ, నన్ను బ్రోవవే, జగన్మోహ నా కారుడు, గోపీ జన వల్లభుడు,, యశోదా కృష్ణుడు, కాళీ య మర్దనుడు, చల్లనయ్య మన నల్లనయ్య, చూపుల్లో కృతార్త త పొందే, అదృష్టాన్ని అనుగ్రవించవే   , కృష్ణా గోవిందా, నీపై బుద్దిని కరుణిం చి, నీ కోసం  చకోర పక్షిలా ఎదురుచూసే నన్ను కరునించరా తండ్రీ శరణు శరణు శరణు,, హరే క్రిష్ణ హరే కృష్ణా , స్వస్తి. !"

నరేంద్ర మోడీ అనే నేను

May 23, 2019
చాలా కాలానికి, మనదేశ చరిత్రలో ముత్యం లా వెలుగుతూ, ఒకే ఒక్కడు, వచ్చాడు,, వివాహితుడు అయినా,దేశం కోసం, మనసులో బంధాలు ఉంటే, మెదడు విజయసాధన , ధ్యేయం, త్యాగనిరతి , అనుకున్నంతగా చేయలేనని , కుటుంబ భారం, వ్యామోహం, దురాశ, బంధుప్రీతి లతో, ఆశయం బలహీన మౌతుంది అనీ, సంసార భావాన్ని త్యజించి,, కట్టుకున్న భార్య కు దూరంగా ఉంటూ,,బ్రహ్మ చర్యం పాటిస్తూ , మనకోసం శ్రమిస్తూ ఉన్నాడు..! ఒకే ఒక్కడు , ఆకుంటిత దీక్షతో, దేశభక్తి తో, , తనపైన , తాను నమ్ముకున్న సమాజం నుండి, ఎంతటి ఘోరమైన అపనిందలు, ఆక్షేపణలు, దుర్భాశలు, తిట్లూ ,వస్తున్నా లక్ష్యపెట్టకుండా, ప్రగతి మార్గంలో తన మాతృ భూమిని, ధర్మమార్గంలో  నడిపించాలి అన్న సంపూర్ణ విశ్వాసంతో అపర వివేకానంద స్వామి వారసునిలా ,పరాక్రమిస్తున్న తేజస్వి , ధృఢ సంకల్పం తో శ్రీ రామ బాణం లా దూసుకు పోతున్నాడు,!, ఒకే ఒక్కడు, ముష్కరుల దండయాత్ర లో, మత ఉన్మాదుల ఘాతుక చర్యలతో ఘోరంగా గాయపడుతున్న , పడుతున్న  మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని ఉద్దరిస్తూ, కాశీ విశ్వేశ్వరుని, గంగా మాతను, కేదారేశ్వర అనుగ్రహాన్ని  నమ్ముకుంటూ ,శిరసా వచసా, మనసా శిరోధార్యం గా భావిస్తూ  భక్త జనాలను ఆకట్టుకొని, పరమశివుని కింకరుని వలె, శిథిలావస్థ లో ఉన్న దేవాలయాలు ఉద్దరిస్టూ, భక్తిభావం తో ఆటు దైవాన్ని ఇటు తనను నమ్ముకొని గెలిపించి,ప్రోత్సహిస్తూ వస్తున్న తన హిందూ దేశ పౌరుల ఆకాంక్షలను నిలబెట్టడానికి మొక్కవోని ఆత్మస్థైర్యం, ప్రజాభిమానం, చెదరని చిరునవ్వు అనే ఆయుధంతో , అపర భీష్మ ఆచార్యుని వలె విరాజిల్లుతూ వస్తున్నాడు  !.. ఒకే ఒక్కడు మనదేశ సనాతన ధర్మాన్ని అక్షరాలా పాటిస్తూ, ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, తలపరా నీ తల్లి భూమి భారతిని, అంటూ, ఖండాంత రాలకు భరతమాత ముద్దుబిడ్డ గా చలామణి అవుతూ, హిందూ దేశ సంస్కృతిని, వైభవాన్ని వ్యాపింప చేస్తున్న మహనీయుడు ,మహానుభావుడు వస్తున్నాడు,,! మలి వయస్సులో కూడా, మానసిక శారీరిక బలాన్ని పుంజుకుం టూ, దేహదారుఢ్య త ను పెంచుకుంటూ, కన్నతల్లి పాదాల కు రెండుచేతులు అంటించి, డిల్లీ కి రాజైనా, తల్లికి మాత్రం కొడుకే అని, ప్రణమిల్లుతూ, తల్లీ దేవ నా బలం తో దేశసేవ కు,, నడుం బిగిస్తున్న అపర చాణక్యుడు గా, దేశ విదేశ నాయకులను తన వాక్ పటిమతో, అద్భుత చతురత తో మెప్పించి, తనదైన శైలిలో ఒప్పించి, శాంతియుత విప్లవ ఉద్యమాన్ని వర్దిల్ల జెస్తున్న ప్రతిభాశాలి గా , ప్రజ్ఞాశాలి మనకోసం దేశం కోసం, సంభవామి యుగే యుగే, అన్నట్లుగా అవతరించి వస్తున్నాడు,,! మన అదృష్టమా, భరత మాత అనుగ్రహ మా , ముక్కోటి దేవతల ఆశీర్వచన మా, అన్న ట్టుగ,ధర్మ అవతారుడు గా భాసిల్లు తూ  వచ్చేశాడు కూడా  ,, అందరం ఆదే ఆశయంతో సహకరిస్తూ , ఆ ఒకే ఒక్కడు , నిర్వహించే అత్యంత భారమైన , జటిలమైన, పనిని ఉత్తమ పౌరుని బాధ్యతగా సంతోషంగా అనందం తో చేయూత నిస్తూ వస్తున్న ఆ , ఒకే ఒక్కనికి మనమందరం ,అండ దండ గా నిలుస్తూ, ఐకమత్యం తో, దేశ పరిరక్షణ కోసం, మన భరతమాత, ముద్దుబిడ్డ వలె శ్రమిస్తున్న ఆ ఒక్కడికి సహకరించడం,, మన ముందు ఉన్న కర్తవ్యం! భారత్ మాతాకి జై,, వందేమాతరం! కాశీ విశ్వేశ్వర భగవాన్ కి జై,! ఒకే ఒక్కడు గా ఉంటున్న అతడి పాలనలో ఉన్న మన అందరం అంతటి దేశాభిమానం , గౌరవం, కర్తవ్య నిర్వహణ తో కలిసి మేము కూడా నీ వెంట ఉంటున్నాం అంటూ, ముందుకు నడుద్దాం,! సమర్థుడైన నాయకుడు ఉండగా,  ఇక మనకెందుకు బెంగ ! సాహసం మన ఊపిరి కావాలి !, స్వధర్మం మనకు  అవలంబన కావాలి, !దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషు లోయ్, స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి సాయ పడ వొయ్,,! అంటూ, దేశభక్తి తో అతడికి చేయూత నిద్దాం! అలా ముందుకు సాగుదాం!, సంఘటన్ మే శక్తీ హై,,! సర్వే జనాః స్సుఖినో భవంతు,! ఓమ్ శాంతి శాంతి శాంతిః ! స్వస్తి!"

Tuesday, May 21, 2019

ఆరోగ్యం

40 ఏళ్లు దాటిన వారి నుండి 90 వరకు , అమెరికా ఇండియా అనకుండా జనాలు, ప్రతిరోజూ వాకింగ్ విధిగా చేస్తూన్నారు!, బైక్, కార్, ఆటో ల ధర్మమా, అని నడక కరువై,, శరీరం బరువై,, అడా మగా , గృహిణులు,, రిటైర్మెంట్ తీసుకున్నవారు , పెద్ద వారు,, రోగస్తులు, పిల్లా పెద్దా, వీరు ,వారు అనకుండా, డాక్టర్ సలహా మేరకు, వాకింగ్ షూస్ తో రోడ్లు,, గ్రౌండ్లు, బజార్లు,, బీచ్ లలో, డామ్ లు, ఇలా ఎక్కడ వీలైతే అక్కడ, ఒంటరిగా, గ్రూపు లుగా ఉరుకులు, పరుగులతో , ప్రత్యక్ష మౌతుంటారు, ప్రతీ రోజూ ఉదయం...!!!!  తిరిగి ఆఫీస్, College,, వ్యాపారం, ఇంటి పనీ కోసం ,8 లోగా ముగిస్తూ, ఇల్లు చేరాలి, తప్పదు,! ఇలా ఈ వాకింగ్ తప్పనిసరి గా ,నేటి ఆధునిక మానవునికి దినచర్య గా మారింది,! ఉపవాసం ఉన్నా, రోజుకు ఒక పూట, తింటున్నా, సెలవైనా, పండుగ అయినా, పని దినం అయినా ఈ వాకింగ్ అనేది ఎవరికైనా తప్పడం లేదు,!, మంచిదే!, రక్త ప్రసరణ కోసం, కండరాలు గట్టి పడటం కోసం, వేప లాంటి చెట్ల నుండి వెలువడే ఆక్సీజన్, ప్రాణవాయువు పీల్చు కోడానికి, నలుగురి నీ కలవడానికి ఇలా ఎన్నో లాభాలు ఉంటున్నాయి,,! దానితో బాటు మనసు కు ప్రశాంతత అనందం కూడా లభిస్తూ ఉంటాయి,,! కారణం పల్లెల్లో ఉండే వారు పట్నాల పాలయారు,, కల్తీ తిండి,, పరిశుద్ద వాతావరణం లేక, చెట్లు తక్కువై, జనావాసాలు ఎక్కువై,, సహజమైన ప్రకృతి సంపద కరువై,, కృత్రిమ ఆహార అలవాట్ల తో, పొందిన అనారోగ్యం తో, ఈ మార్నింగ్ వాకింగ్ శరణ్యం అయ్యింది,దేవాలయానికి పోనివారు ఉంటారేమో, కాని, హాస్పిటల్ కు, మార్నింగ్ వాక్ కు పొనివారు ఉండరు కదా! గ్రామాల్లో ఉండగా లభించే నిర్మలమైన చెట్ల, గాలి, పొలాల్లో, ఇంటిలో పనీ, వల్ల లభించే ఆరోగ్యం,,  వ్యాయామం ఇప్పుడు కరువై, జీవనం బరువై,, మార్నింగ్ వాకింగ్ దిక్కై పోయింది,, ! ఆధునికనాగరికత లో మార్పు,, వల్ల, ఉపాధి కోసం, పల్లెలు విడవడం వల్ల, పెరుగుతున్న జనాభా వల్ల, తరుగుతున్న ఉద్యోగ అవకాశాల వల్ల ఇలా పెను మార్పు వచ్చింది,,వాస్తవమే! కానీ, మనసు హాయిగా, ఉల్లాసంగా, హుషారుగా ఉండాలంటే, వాతావరణం, పరిసరాలు, పచ్చని చెట్లు, పూలు, తోటలు,, స్వచ్చమైన నీటి కొలనులు ఉండాలి.  ఇలాంటివి మనిషికి కావాల్సిన ఆహ్లాదకరమైన , ఆరోగ్యకరమైన , మనః స్థితిని కలిగిస్తాయి.! ఏదో యాంత్రికంగా కాకుండా, సహజంగా మానసిక అనుభూతిని పొందు తుండాలి,! సూర్యోదయానికి ముందు పచారు కు వెళ్తే, చుట్టూ ఉన్న ఎత్తైన చెట్ల నుండి చల్లని పిల్లగాలు లు, శరీరాన్ని హాయిగా,మెల్లగా తాకుతుంటాయి.,! ఇరుప్రక్క లా చెట్లకొమ్మల లో నుండి , తల్లి తనఒడి లోనున్న బిడ్డను జోలపాటలు పాడుతూ, నునుపైన చేతుల్లో ఉయ్యాలలో ఊగిస్తూ అడిస్తున్నట్టు గా   ఆకు పచ్చని లేత లేత తమలపాకు లాంటి అందమైన నునుపైన లాలిత్య లావణ్య అందాల ఆకులను , పూవులను, లేలేత మొగ్గలను, రంగురంగుల లో చూస్తుంటే, వానిని అలవోకగా తాకుతుంటే పరమాత్ముని అద్భుత రచన చిత్రకళా నైపుణ్య చతురత వైభవాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఉంటే,, హృదయంలో అనిర్వచనీయ మైన బ్రహ్మానందాన్ని, ప్రాతః కాల వాకింగ్ సమయంలో ప్రతీ ఒక్కరూ అనుభవించ వచ్చును,,! చూసే కళ్ళు, తపించే మనసు, ఆనందించే సమయము, ఓపిక, కళాపోషణ మనకు ఉండాలి గానీ, ఉదయం చేస్తున్న వాకింగ్ , తో దైవాన్ని పరమాత్మ వైభవాన్ని ,అద్భుతంగా అక్కడి పరిసరాలలో దర్శించ వచ్చును, నిజానికి ఆధ్యాత్మిక చింతనకు, దైవ ఆరాధన కోసం మనం, దైవసన్నిధిలో ఉండాలి,! ఇప్పుడు అదే ఇది ! అంటే ఇదే దేవాలయ ప్రాంగణం అనుకోవాలి, ఏదైనా మన భావన లో ఉంటుంది పెన్నిధి ! ఈ అందమైన ప్రకృతి నిలయం. ఈ శరీరం, ఈ మనసు,, ఈ అవకాశం, పరిసరాల ప్రభావాలకు స్పందించే క్షోభ్యత,,, తదనుగుణంగా ఆనందించే హృదయం జ్ఞానం, దానిని వెలిబుచ్చి ఇతరులతో పంచుకునే ప్రతిభ, ఇదంతా దైవానుగ్రహం ! వాని అస్వాధన, కేవలం మనిషికి మాత్రమే సాధ్యం ,! మిగతా ప్రాణులకు వీలు కాదు కదా ;  అందుకు మనకు ఈ వరాన్ని ప్రసాదించిన పరంధామునికి కృతజ్ఞతలు అందజేయాలి కదా !,ఈ అభిరుచి, అనుభూతి, అనుభవం , మనిషికి మాత్రమే సాధ్యం!. పూర్వ కాలంలో బ్రాహ్మీ ముహూర్తం లో లేచి దైవారాధన,, పూజ, ధ్యానం, సద్గ్రందపఠనం , వ్యాయామం, యోగా, ఇత్యాదులు చేసేవారు,, మన పెద్దలు.! . నిజానికి విద్యార్థులకు , యోగాభ్యాసం కోసం,, ధ్యానం కొరకు,, దైవ ప్రార్థన, పూజ, సంధ్యావందనం మొదలగు ఆధ్యాత్మిక చింతన, సాధన కొరకు అతి ఉత్తమము, ఆరోగ్య శ్రేయోదాయకం,, భక్తి ముక్తి తత్వ సాధనకై దైవం అనుగ్రహించిన అమృత ఘడియలు, ఉషోదయానికి పూర్వ ఘడియలు, అవి ;! రైతులు తెల్లవారుజామునే  లేచి చేనులు, పొలాల పనులపై , వెళ్ళడం , గేదె, అవు పాలు పితకడం, వారికి వ్యవసాయ పనుల తో దినచర్య మొదలవడం ఇదే ప్రాతః కాల సమయం చక్కగా ఉపయోగ పడుతుంది.. ఉదయం 5 గంటల ముందే మేల్కొనే వారు ఉత్తములు, ఏకాగ్రత, జ్ఞానార్జన, కు అర్హులు. ,5 తర్వాత లేచిన వారు మద్యములు, ఆరోగ్యము, ప్రశాంతత  వారికి లభిస్తాయి,,6 అయ్యాక లేచేవారు మామూలు స్థాయి వారు, హుషారుగా, చురుకుగా  ఆ రోజు పనులు చేస్తారు ! ఉదయం నడకకు యోగ్యమైన,అనుకూలమైన వాతావరణం ఉదయం 5 గంటలకు లభ్య మౌతుంది. ! కుటుంబ సభ్యులతో కలిసి చేస్తే, ఇంకా మంచిది ! ఇలాంటి సదాచారం మనం మాత్రమే కాకుండా, సామూహికంగా నిర్వహిస్తే, ఫలితాలు అద్భుతం, అందరితో కలిసి పంచుకోవడం వల్ల పెంచుకునేది ఈ .అపురూప అనుబంధం! అందరితో కలిసి ఉదయాత్పుర్వమే మేల్కొని వాకింగ్ వెళ్ళడం, స్నేహబంధం తో మానవతా విలువలు పెంపొందించు కోవడం,నిజంగా ఒక వరం! అదృష్టం! మహా భాగ్యం కూడా! అందరితో  కలిసి ముందుకు అడుగు వెయ్యాలి ,,! ఇదే విజయానికి మొదటి సోపానం;!: ఇలాంటి పాజిటివ్ ప్రభావాలు అనుభవైక వెద్యం, ఆచరణీయం, అనుసరణీయం కూడా! మన సనాతన ధర్మం ప్రకారం, సూర్యోదయం అయ్యేలో గా , చేరువ లోని నదీ స్నానం, అర్చన లు ముగిం చి, ,ఆలయానికి వెళుతూ, క్షణ కాలం కూడా వృధా చేయకుండా, దేవతార్చన ముగించి, దైవారాధన కోసం, వినియోగించే వారు,! తదుపరి గృహ వ్యవహార,కార్యక్రమాల తో రోజు వారీ దినచర్యలో నిమగ్నం అయ్యేవారు. ! అందుచేత మనం కూడా ఈ మార్నింగ్ వాక్ నీ ,, దైవ ద్యానం తో, మానసిక ప్రశాంతత కోసం, శారీరిక బలం కోసం, మనస్సును ఏకాగ్రత తో ధ్యానం లో లీనం చేస్తూ,, మనలో నిద్రాణమై ఉన్న దైవిక శక్తులను జాగృతం చేసేందుకు ఉపయోగించాలి,! ఇది ఒక నిరంతర సాధనా ప్రక్రియ,! పాత కాలంలో, ఇలా క్రమం తప్పకుండా, చక్కగా కోడి కూ తకు ముందే, గోరు చుక్క పొడవక ముందే, లేస్తూ ,సమయ పాలన చేసేవారు, మన కర్మ భూమి యందు పుట్టిన ఎందరో ;మహాత్ములు, యోగులు, ఋషులు, మునులు, పండితులు,,! రోజూ  వాకింగ్ కోసం మనం ,నడిచే దారిలో గుంటలు,, చెత్త చెదారం, రాళ్ళు రప్పలు, లేకుండా,, ఎగుడు దిగుడు గా ఉండకుండా చూసుకోవాలి,,, ! కంటిచూపు ను భూమికి సమాంతరంగా ప్రసరింప జేయాలి,, నడుంవంగి పోకుండా ,నిటారుగా  రెండు చేతులూ చాపి ఊపుతూ, గుండె నిండా ఊపిరి పీలుస్తూ, హుందాగా, స్వేచ్చగా  నడవాలి,,! నేలపై చెప్పులు లేకుండా నడవటం ఉత్తమం;! హనుమాన్, అయ్యప్ప, భవానీ దీక్షల వలె  అదొక దీక్ష ! ఎన్నో ప్రయోజనాలు !, రక్ష కూడా ! కాళ్ళకు "షూ "లు వేసుకుంటే నడక కాస్తా సులభం అవుతోంది,! మనసూ, ధ్యానం, మన ఉష్వాస నిశ్వాసా లపై కేంద్రీకరిస్తూ ఉండాలి,! ఈ దివ్యమైన, దేవతా ఘడియల్లో, నిశ్శబ్దంగా ఉంటూ, ప్రాణాయామం అరగంట పాటు చేయడం అతి ఉత్తమం, అద్భుతం, కూడా!వివేకానందుడు, పరమహంస, భక్తులు ఇలా ఎందరో మొక్షకాముకులు ఇదే బ్రాహ్మీ ముహూర్త కాలాన్ని, తమ జీవన సాఫల్యత కోసం సద్వినియోగం చేసుకున్నారు !, మనో నిగ్రహం, అత్మ సంయమనం,, దైవ సాక్షాత్కారం, లభిస్తాయి ! ఇలా ఈ క్రమశిక్షణా యుత జీవన విధానాన్ని ఆచరణ లో పెట్టడం , దానితో నిత్యదిన చర్యను భగవద్ అర్పణ భావంతో, చిత్తశుద్దితో, ప్రారంభించడం వలననే , వారు గొప్ప జ్ఞాన వంతులు, మేధావులు, శాస్త్రజ్ఞులు, పండితులు, విద్యావేత్తలు,మహానుభావులు  అయ్యారు,! అందుకే,,సాధ్యమైనంత మౌనంగా,భగవన్నామ స్మరణ తో, ప్రాతః కాల సమయంలో, చల్లని గా లుల స్పర్శతో ,, ఎలాంటి సమస్యా పూరిత అలోచనలు చేయకుండా, మనసుని సంతోషంగా ఉంచుతూ, హృదయం లో దైవ భావన నింపుతూ, ఒక దేవాలయం లో నెలకొన్న ఆరాధ్య దైవం చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నట్టుగా, భావిస్తూ, ఉరుకులు పరుగులతో కాకుండా, నిదానంగా,  ప్రశాంతంగా నడవాలి! ఎవరితో కలిసి వెళ్తామో, వారి వల్ల మన ఏకాగ్రత, ధ్యానం, భావ సంపద,, దైవ భక్తీ, ఇనుమడించాలే కాని, ప్రక్క త్రోవ పట్టించకుండా, సహకరించే మంచి స్నేహితులను మార్నింగ్  వాకింగ్ లో తోడు చేసుకోవాలి,,! అనవసర రాజకీయాలు, ఎవరి మీదనో విమర్శలు, చెత్త జోకులు, చేయకుండా,, స్వచ్చమైన మన  మనసును పాడు చేయకుండా, చూసుకోవాలి, !సత్సంగ సభ్యులతో సంచరిస్తూ ఉన్నట్టుగా ఆ ఒకటి లేదా రెండు గంటలు మనం పరమానందం స్థితినీ అనుభవించడానికి  మాత్రమే కేటాయించాలి,;! మార్నింగ్ వాక్ అనేది, మన మానసిక శక్తిని, దేహ దారుఢ్యం, అత్మ సంయమనం,, పెంపొందించుకోడానికి మనం  అనుదినం చేస్తున్న సాధనాప్రక్రియ అని గుర్తుంచు కోవాలి.! . ఏదో "టైమ్ పాస్ !"అని కాకుండా,, అమూల్యమైన, అపురూపమైన, దైవ సంబంధమైన ,, అద్వితీయ మైన, బ్రహ్మానంద భరిత మైన, ఈ  ప్రాతః కాల నడక ప్రయోజనాన్ని , భగవద్ గీత శ్లోకాలు స్మరిస్తూ, లేదా, హరి నామాన్ని మనసులో ఉచ్చరిస్తు,, సంతోషంగా గడపాలి., మన బ్రతుకు నకు దశా దిశా నిర్ణయించేది ఇదే ! దీనితోనే మన జీవిత దృక్పథం , విశాలభావం, దూరదృష్టి , తో జీవనయాత్ర కు శ్రీకారం చుట్ట బడేది.!. చుట్టూరా వినిపించే పక్షుల కిలకిలా రావాలు, ఉషోదయ కిరణాలతో జగత్తును తేజోవంతం చేస్తూ, ఉదయిస్తు, సకల ప్రాణి కోటికి, ప్రకృతి సోయగాల కు ప్రాణం పోస్తు,, రంగురంగుల వర్ణాలతో, పూవులు ఆకులు చెట్లు,,, చూస్తూ ఆనందించాలి, మనం కూడా ప్రకృతిలో భాగంగా కలిసి పోవాలి కూడా !, జగత్తును, ధరణి పై, పచ్చని పచ్చిక బయల్లను,, నింగిలో అరుణ కిరణాల కాంతుల , రంగుల్లో శోభిల్లే మేఘాలను, భూమాత ఒడిలో,జలజలా పారె నదీ నదాల శక్తి చైతన్య వైభవాలను తన ప్రకాశం తో ప్రభావితం చేస్తూ, మనలో ఆనందాన్ని , మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఆహ్లాదాన్ని, తన ప్రసాదంగా అనుగ్రహిస్తు ఉదయిస్తున్న కర్మ సాక్షి ఆ  సూర్యభగవానునికి హృదయ పూర్వక సాష్టాంగ ప్రణామాలు భక్తితో సమర్పించు కుంటూ,, నిత్యం ఆదిత్యుని నుండి, అందుకున్న దైవిక శక్తితో, ఆ రోజు దినచర్యను, ఆనందంగా,   ప్రారంభించుకోవాలి, అందరం అనుదినం , అనుక్షణం అనవరతం !!! ఇలా ప్రతీ ఉదయం, మనకు దైవం పొడిగించిన ఒక రోజు ఆయువు గా భావిస్తూ, మనలో, ముందు, వెనక, అంతటా నిండి ఉండి, మనల్ని నడిపిస్తున్న ఆ సర్వాంతర్యామికి కృతజ్ఞతాభావం తో, రెండు చేతులూ ఎత్తి నమస్కారము చేద్దాం,! అద్భుతమైన మానవ మేథా సంపత్తిని అనుగ్రహించిన స్వామికి, ఉదయం లేస్తూనే, మనకు వచ్చిన శ్లోకాలు, రామా కృష్ణా, మహేశ్వర, మహాదేవా,, విగ్నేశ్వర, శ్రీ ఆంజనేయ, భగవతి జగన్మాత, ఈశ్వరి,, పాహిమాం, రక్షమాం!" అంటూ అంతః కరణ లో దైవాన్ని నిలుపుకొని, స్మరిస్తూ, భజిస్తు,, కీర్తిస్తూ, పూజిస్తూ, ఆలయ దర్శనం చేస్తూ,, మన ఇష్ట దైవాన్ని సేవిస్తూ, నిత్యం తరించు దాము,, ! హరే కృష్ణ హరే కృష్ణా !""

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...