Friday, February 1, 2013

Anasuya Vemuganti

ఆమె  చాలా భాగ్య వంతురాలు -గొప్ప కుటుంబలో  పుట్టి - గొప్ప కుటుంబంలో  మెట్టి -గొప్ప వ్యక్తిత్వాన్ని - సంస్కారాన్ని  సంపాదించుకుంది -!పదకొండు  మందిని కన్నది - కడుపారా ! ఇద్దరు  పోయినా - మిగిలిన తోమ్మండుగురి  లాలనా పోషణా  -చూసింది -తన భర్త  సహవాసంలో  -తన ముగ్గురు ఆడపడుచుల  పిల్లలను కూడా తామే  తలి దండ్రులవలె  ప్రేమతో చూసింది   --! తోబుట్టువులను  - వారి పిల్లలను అంత గా  గారవించి  - పెళ్ళిళ్ళు చేసి-వారిని  కన్నతల్లి తండ్రులు  లేని కొరత  దీర్చి - అందరిని సమానంగా ఆదరించి  ఆప్యాయతను పంచిన ఘనత--  ఆ  దంపతులకే  చెల్లింది --!
                ముఖ్యంగా ఎ పూర్వ జన్మ పుణ్యమో -ఆమెకు సనాతన  సాంప్రదాయం ఒంటవట్టింది -! మడీ  -ఆచారం- అంటూ -ముట్టు-స్నానం దేవుని పూజా - ఇవన్నీ  తనకి పెళ్లయింది మొదలుకొని  అక్షరాల  అమలు చేసింది -అత్తవారింటిలో ! ఎనిమిదవ  ఏట  పెళ్ళయితే - 86 సంవత్సరాల వయస్సువరకూ  అలాగే -తన జీవనాన్ని  కొన సాగించింది! -తన జీవేన శైలిలో  -ఎలాంటి మార్పులేదు ! చలి -వాన  ఎండా  కాలాల్లో నిశ్చలంగా -తన మడి వంట  ఆచారాన్ని - తు -చ  -తప్పక  పాటించింది - అదీ గంపెడు పిల్లలతో - ఇంటికి  వచ్చే పోయే  అతిథులు - అభ్యాగతులతో- ! తన ఇంటిలోనే గాదు  ఎవరింటికి వెళ్ళినా- అక్కడ కూడా  అదే  తన దిన చర్య  కొన సాగించింది 
                                  ఉదయమే  ఐదు గంటలకు - గంట కొట్టినట్లుగా - లేవడం  ---వెంటనే చన్నీళ్ళ  స్నానం చేయడం -పూలు -పూజ సామాగ్రి ఏర్పరచుకోడం - మడి చీర   కట్టుకొని దేవుని పూజ చేసు కోడం--తరవాత  మధ్యాహ్నం మళ్ళీ మడితో-  వంటా వార్పూ -రక రకాల పచ్చళ్ళు  శాకాలు -కుర పప్పులు - చారు -పండగైతే  బూరెలు -పుణుకులు-- పాయసం  పరమాన్నం - పూరీలు బజ్జీలు -ఒకటేమిటీ ? ఎన్నో రుచులతో  తనే స్వయంగా వంట  చేసి  - అందరికి  తనే స్వయంగా వడ్డించి -అందరిని తన వంటకాలతో  సంతృప్తి  పరచి -- చిట్ట చివరకు తను భోజనం  చేసేది  ఆ  మహా సాధ్వి -గొప్ప  ఇల్లాలు -పుణ్యాత్మురాలు ! మధ్యాహ్నం  పడుకోనేది కాదు -దేవుని  వత్తులు చేసుకుంటూ  ఏదైనా మాట్లాడుతూ  కాలక్షేపం  చేసేది -
                                           వయసు పై బడినా - చేత గాక పొయినా - అలాగే  అంత ఖచ్చితంగా  ఆ మడీ  ఆచారాన్ని పాటించడం  ఆమెకే చెల్లింది! -ఆమె మానాన  ఆమెను స్వతంత్రంగా  విడిచి - ఉదారంగా చూడటం  ఆమె  భర్తకే  చెల్లింది -!" చేత గాకున్నా  ఎందుకీ మడీ  వంటా ? """
 అని ఎవరైనా  ఆడిగితే- ఆమె నవ్వుతు  జవాబు చెప్పేది - !   "ఎవరైనా  నాకు మడికి వంట చేసి  పెడితే - నాకు కష్ట పడే అవసరం ఏమిటి ?"
 దీనికి  సమాధానం  లేదు -అంటే అలా మడి కట్టుకొని  రోజు ఆమెకు వంట చేసి పెట్టె వారెవరు  ?  అంత దీక్ష ఎందరికి  ఉంటుంది? !ఆమె పై ప్రేమతో  చేయ వచ్చు ! కాని అంత ప్రేమ  - ఎంత మందికి  ఉంటుంది ? పైగా ఆమెకు అంత చాదస్తం ఎందుకు అని ఈసడించుకునే వారు లేక పోలేదు -ముసలి తనంలో  ఇంత పట్టింప! అని కొట్టి పారేసే  వాళ్ళు  ఈ  రోజుల్లో చాలా మంది ఉన్నారు !ఇలాంటి వ్యకులమధ్య  -ఇలాంటి సంప్రదాయంతో ఉండాలనుకోడం  సాహసమే - మనసు గాయ పడటం సహజమే - అయినా మొక్కవోని విశ్వాసం  అమెది -తను ఇలా చేయడం వల్ల ఇతరులు  ఎవరికీ  ఇబ్బంది కలుగడం లేదుకదా ! తను వారిని తన లాగే ఆచరించమని  - ఉండాలనీ బలవంత పెట్టడం లేదు కదా ! తన పని  తాను చేసుకొంటూ - ఇతరులపై ఆధార పడకుండా  - నొప్పించకుండా మౌనంగా  ప్రశాంతంగా  గడుపుతోంది కదా ! 
             ఆమె ఒక గంగి గోవులా నిస్వార్థ జీవి - తనకోసం ఎవరిని  ఏమి  ఎప్పుడు అడగకుండా  - తనకు ఎ విషయాలు ఎవరూ చెప్పకున్న  పట్టించు కోకుండా  సీదా - సాదాగా  నిరాడంబరంగా  కలం వెల్ల బుచ్చింది - కావాలని  కొడుకులను  కూతుళ్ళను  చేయి  చాచి ఎప్పుడు ఇదీ కావాలని  అడగలేదు - వందనోటుకీ-- పది రూపాయల నోటుకీ  తేడా తెలీని  అమాయక  పల్లెటూరు  గృహిణి -పదహారు అణాల  తెలంగాణా పడుచు -!దేవుడు పూజ - ఎంత మందికైనా  అలసట లేకుండా -  ఆ  యాస పడకుండా  వండి  విస్తర్లలో  తృప్తిగా కొసరి  కొసరి వడ్డించి తిని పించడమే  ఆమెకు పరమానందం - అదే ఆమెకు మృష్టాన్న  భోజనం ! 
          అయితే ఇదే ఆమె చివరి కోరిక ఆమె జీవితంలో ! ఇలాగే పోవాలని -ఎవరి మోతాదులో  లేకుండా -తనను ఎవరూ చీదరించుకొనే పరిస్తితి  రాకుండా  చేయమని భగవంతున్ని  నిరంతరం  ప్రార్తించింది -! ఆయన ఆమె మొర విన్నాడు - అలాగే కరుణించాడు  కూడా !
                               చాలా మంది  ఆడవాళ్ళలో  ఇలా మడి  ఆచారం గల వాళ్ళు  లేక  పోలేదు - ఉన్నారు ! కాని  - ఆమెలా ఏక భుక్తం తో 
 కడుపు నింపుకొని  -అంత మధ్యాహ్నం  మాత్రమె తిని  - రాత్రి  ఏమి తినకుండా - దొరికితే  ఎప్పుడైనా  అరటిపండు-  లేదా ఉపవాసం  తో  ఇన్నేళ్ళు  బ్రతుకుని  గట్టి కట్టు బాటుతో  గడపడం  ఆమెకే చెల్లింది  !
                 దసరా - దీపావళి - సంక్రాంతి  - ముక్కోటి  ఏకాదశి  - ఇలాంటి పర్వ దినాల్లో - ఉదయమే లేవడం -అదీ వేన్నీళ్ళ  స్నానం చేయడం  అందరు చేసే పనే  ! కాని అనుదినం  అలా చేయడం  ఎ కొందరికో  సాధ్యం ! అదీ ఇలాంటి ధృడ  సంకల్పం  గల వాళ్ళకే  సాధ్యం అవుతుంది -!  అయితే ఆమెను దేవుడు చిన్న చూపు చూశాడు - ఆమె కళ్ళ ముందే-- కన్న కూతురు  - కన్న కొడుకు ఒకరు కాన్సర్ తోనూ మరొకరు ఆక్సిడెంటు తోనూ మరణించారు - ఎదిగిన పిల్లలు ఇద్దరు బిడ్డల్ని కన్నవాళ్ళు -చూస్తూ  చూస్తూ వెళ్ళారు  రెండు  సంసారాలు కుప్ప కూలి పోయాయి అదే పెద్ద షాక్ - అనుకుంటే -! ఏడాది దాటిందో  లేదో  - కట్టుకున్న భర్త - తనను విడిచి పరలోకాలకు వెళ్లి పోయారు -! అదే  ఆమెకు  BP SUGAR HEART ATTACK  లా ఒకే సారి వచ్చి పడ్డాయి -దాంతో ఎ జబ్బు లేని ఆవిడ మంచాన మూలకు పది ఉండాల్సి వచ్చింది మడి  ఆచారం దూరమయ్యాయి - ఆమె మానసికంగా క్రుంగి పోయింది - భగవంతుని నిర్ధయతకు దిగులుతో మంచం పట్టింది - చివరకి కాలు విరిగింది-  రెండు రోజుల్లోతన భర్త సాన్నిధ్యం  చేరుకుంది  ! అయితేచివేరి ఘడియల్లో కూడా ఎవరి మోచేతి నీళ్ళు తాగకుండా - మల మూత్రముల   బాధ  లేకుండా - ఇతరులు రోయకుండా-  తన జీవితం  చాలించింది - దేవుడిచ్చిన  ఆమె  కళ్ళను  నేత్రదానం చేశారు  రేకుర్తి  కంటి ఆస్పత్రి వాళ్ళను  పిలిపించి -పెద్ద కొడుకు !     
                 ఒక్క మాటలో  చెప్పాలంటే  - పళ్ళ మధ్య నాలుకలా-- ఇప్పుడున్న జీవన వ్యవస్థ లో - మారుతున్న సమాజంలో - ఇంత గొప్ప మనసుతో  ఒక యోగిలా - మునిలా - గడపడం  అనితర  సాధ్యం - ఆమెకే  సాధ్యం ! దేవుడు  పూజా మడి  ఆచారం ! ఇదే ఆమె నిత్య  ఆరాటం -వాటికి  పోరాటం  కూడా ఇంటిలో  నిరంతరం -నచ్చని వారి మధ్య  విసుక్కొనే వారి  మాటల నేదుర్కొంటు తను మాత్రం అలసట లేకుండా - యాష్ట  పడకుండా  - ఆయాస పడకుండా  ఇంత మందికి  అదే మడితో  వాడి వడ్డించి - పెట్టింది  -తను ఒక్కతే  వండుకోకుండా ! 
   ఆమె తన పెద్ద కొడుకు గురించి  సగర్వంగా  సంతోషంగా ఉండేది - :"వాడు -నాకు కొడుకు గా కాక - నేను వానికి తల్లిని అని చెప్పుకుంటే  నాకు ఆనందంగా ఉంది -ఎందుకంటే  పది మందిలో ఒక గొప్ప విలువైన -పదవిలో ఉంటూ -మంచి పేరు -కీర్తి -మాత్రమె గాక -ఎంతో మందికి ఆదర్శం  గా  ఉంటూ - ఫలాని రామారావు  అంటే చాలు - మాకు తెలుసు  అని నగర మంతా  అందరు చెప్పుకునే విధంగా జనం లోకి చొచ్చుకుని పోయి  వారికోసం -అంకిత భావంతో  పని చేసి -జిల్లా స్తాయిలో - రాష్ట్ర స్తాయిలో - చివరకు దేశ స్తాయిలో - ఖ్యాతి గడించిన  కొడుకు గురించి  ఎ తలి దండ్రులు మాత్రం  సంతోషం పొంద కుండా  ఉండ గలరు -  ?-
                             లోపాలు ఉంటాయి  మనిషిగా పుట్టాక !అవి లేక పొతే మనిషే కాదు !-పైగా ఆడవాళ్ళకు  ఉండే అతి సహజమైన - గుణాలు  -ఈమెలోను లేక పోలేదు - కాని  అవగుణాల కన్నా సుగుణాలే  మిన్న  ఈవిడలో ! అందుకే ఆమె చేసిన పూజా  ఫలం-- అందరిని సంతోష పెట్టింది! - చివరి ఘడియల్లో  అనాయాస మరణం  సంప్రాప్తించింది! -బ్రతికినన్నాళ్లు-  ఎ వ్యాధి ఆమెను  బాధించ  లేదు-! తన భర్త వలె  తాను అంత మంచి పేరు  తెచ్చుకుంది !- ఆరోగ్యము - ఐశ్వర్యము - కీర్తి ప్రతిష్టలు కలిగిన కొడుకులు  - కోడళ్ళు - కూతుళ్ళు  అల్లుళ్ళు - ఏనాడు పల్లెత్తు - కాని మాట అనని భర్త - -బంధువులు -అందరు  కలిసి  ఆమెను ఆప్యాయంగా - గౌరవంగా చూసేవారు !-  ఇప్పుడు-- ఆమె బలగం --మనవలు  మనవరాల్లతో కలిసి ఈజీగా - వంద మందికి పైగా  ఉన్నారు -! -కుడి భుజంలా  పెద్ద అల్లుడు  - మేనల్లుండ్రు -ఎడమ భుజం వలె పెద్ద కొడుకు -
ఆమె ఇంట్లో ఎన్నో పుణ్య కార్యాలు చేయడానికి అండగా నిలిచారు ఆ దంపతులకు సహస్ర చంద్ర దర్శనం చేయించారు అద్భుతంగా  ఘనంగా వైభవంగా -ఇంత గొప్పగా ఎవరికీ ఎవరు చేయలేదేమో  ? అన్నంత బాగా జరిపారు అంతాకలిసి -!ఆరుగురు కుతుల్లకి  ముగ్గురు చెల్లెళ్లకి పీటల పై కూర్చుంది కన్యా దానం చేశారు - ఇంట్లో నోములు - వ్రతాలు -పురుళ్ళు -పుణ్యాలు అన్నదానాలు చేసి దైవ భక్తిని పెంచుకున్నారు నత్యం  సంద్యా వందనం చేసే భర్త -- ప్రతి రోజూ- మడితో వంట చేసి  దేవునికి నైవేద్యం పెట్టె  ఇల్లాలు -ఇదీ చాలదా ? ఆ ఇల్లు  స్వర్గం  కావడానికి - పిల్లా పాపలతో  -కల -కల లాడటానికి !  - ఇంతకంటే మహా భాగ్యం  ఏముంటుంది  మనిషికి ?  
                  తన సౌఖ్యం - త్యాగం- చేసుకొని --- ఆరుగురు  చెల్లెళ్ళ  పెళ్లి ధ్యేయంగా - తన పెళ్లిని శాశ్వతంగా వాయిదా వేసుకుని - పరోపకారమే  పరమార్ధంగా -అంకిత భావంతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి -  జిల్లా లోనే కాక -రాష్ట్ర -  -కేంద్ర  స్తాయిలో  మంచి గౌరవం-  పేరు -సంపాదించిన  కొడుకు -  కలగడం  వారు చేసు కున్న పూర్వ జన్మ పుణ్యం - ఇదీ వారు  అన్న  మాట ! నా మాట కాదు - !   
          ఎందరున్నా - పరిస్తితులు ఎలాఉన్నా  మొక్కవోని ఆత్మ బలం-- దైవం పై అచంచల విశ్వాసం  ఆమెకు ఉంది - అదే ఆమెకు జయాన్ని --శుభాన్ని- సంతృప్తిని  ఇచ్చింది - ఎంతటి వాడైనా దైవ బలం ముందు తల వంచ వలసిందే -!స్వధర్మం  మరవకుండా ఆచరిస్తే  చాలు ! 
                  -   తన కంటూ ఒక ప్రత్యేకత - ఒక చరిత్ర - ఒక కట్టుబాటు - ఒక విశ్వాసం - తన  ఆచరణ పై గట్టి నమ్మకం  -  చెక్కు చెదరని మనో నిగ్రహం  - ఇదీ ఒకరు  చెబితే  రాదు - నేర్చుకునేది అసలే కాదు - జన్మతహా  రావాలి - !ఆ సంస్కారం గల ఆమె మక్కువకు  జోహారులు హృదయ పూర్వకమైన  ప్రణామాలు ! శ్రద్దాంజలులు సమర్పిస్తున్నాము 

Vemuganti Narsinga Rao

sri Vemuganti Narsing rao of YALABAKA -- HIS  EXCELLANCY -
             An  excellent  individual -a golden  ancient paint of the  of the past -took birth in a corner village -got fame and name in all the  villages AND RELATIONS  by his generous nature - brought up kith and kin sons and daughters --fed a dozen children every day - with his love and affection - a generous man  with humility and abundant  knowledge -in every groud -most calculative - and talkative - - his wife being different in  attitude and thought - never spoke any hard or harsh words -to anybody -
        - A GOOD ADMINISTATOR -FATHER -PATWARI A VILLAGE HEAD -ALLIN ONE --
 and separated by the time - leaving her alone -WE ARE PROUD OF HIS INTIMACY AND RELATION
        No change in earth rotation- the sun- the moon- day and  night --everything is normal -  
          A STAR IS GONE -SETTING  A  REMARKABLE  LIFE HISTORY AS  A ROLE MODEL -SIMLE LIVING AND HIGH THINKING - A BEST MAN OF HIS AGE . 

శ్రీ ఖర నామ   సం-= మార్గశిర బహుళ పంచమి-  రోజు ! -కీర్తి శేషులు శ్రీ వేముగంటి నరసింగ రావుగారి  - స్మారకార్థం ! శ్రద్ధాంజలి   సమర్పణ -!
-------------------------------------------------------------------------------------------------------------------------------- ------
----మచ్చ  లేని మనిషి   ---!            -నిర్భయుడు  ! బుద్ది కుశలత గలవాడు -! కాదు యుక్తిగా  తీర్పులు  చెప్పువాడు !
 ధార్మిక చింతన చేయువాడు1 --అపకారము  ఎన్నడు   తలపడు! -చక్కని  యోచన  చేయువాడు -!
ఎప్పుడు ఆధ్యాత్మిక భావము చేయు వాడు-!- గ్రామ పెద్దగ   పదుగురి  మన్నన పొందినాడు-!- కుటుంబము పెద్దగ --
ఎల్లరిని  నియంత్రించు  పటిమ  గలవాడు! - నిరాడంబర  నిష్ట జీవి! --కడు యుక్తితో  కార్యము  దీర్చువాడు --!
వాదమ్మున  గెల్చువాడు !- హాస్య చతురోక్తుల నందర  మెప్పించువాడు !-తన  కష్టము ఇతరులకు  పంచువాడు కాడు!
బహుజన  హితాభిలాషి - !సుగుణాల రాశి - !స్నేహవాత్సల్య త  నందరి  నాదరించు  మితభాషి --!గంభీరుడు -!
ఉన్నదానితో  తృప్తి ని గనిన నిత్య  సంతోషి! --!నిత్య సంధ్యా వందనమ్మును  - పడి తప్పక ఒనర్చిన  సద్ బ్రాహ్మణ శ్రేష్టి !
సద్వర్తన  వినయ శీలి ! - నిరత  గంభీరత నొప్పు దయాశాలి !--!మేనల్లుర -  అల్లుర -  తమ పిల్లల వోలె ప్రేమించి -పోషించి --
వారికి  ఆత్మా విశ్వాసము  నేర్పిన  ప్రేమమూర్తి! --గ్రామస్తుల - పనివారలన్దరిని - అన్ని  అవసరముల  అన్ని విధముల --
మంచి  చెడ్డలను  విచారణ  చేసిన  వ్యవహార శీలి -! --అందరిని  ఒకే  త్రాటిపై -- ఒకే మాటగా - నడిపిన  మార్గదర్శి --!
ALL  IN ONE _ SIMPLE LIVING _  HIGH  THINKING _అని పించుకున్న  మహాను భావుడు !------------------------------------------------1
                    దొర వలె  పుట్టి  యలబాక గ్రామపెద్దగ-  దొరతనంబున  మిగుల  ఖ్యాతి  గాంచె!
                   తన   తలిదండ్రుల పున్యమనంగా  -- ఘన కార్యముల  నెన్నో - యిట్టె  జేసే --!
                     పురుడు -పుణ్యకార్యముల - నెన్నిటినో - అవలీల  జేసే -- నరసింగ రావు గారు !
                     ఎంతటి భాగ్య శాలియో !  చరితాత్ముడు - ! దివ్యము -  నీ  జీవనంబిలన్  !----------------------------------------------------------------2
  తన  ఆడపడుచులను అమితముగా - ఆప్యాయత  నాదరించి - కడు  ఇడుముల బాపి -  బ్రోచిన అనురాగ  సోదర మూర్తి --!
                                    --చక్కని  తండ్రి --చక్కని భ్రాత --!చక్కని పాటలు -గ్రామ  పెద్ద !పండితుడు -!వేదాంతి !ఒక  గ్రంధము !
ఒక నిఘంటువు !గొప్ప భూస్వామి -!అలసట నెరుగని మేటి వ్యవసాయ దారుడు -!బంధు జనా  బాన్దవుడు-- కార్య దీక్షాపరుడు !
          ----  వేయేల  ! ఒక  మహాను భావుడు ! -----------------------------------------------------------------------------------------------------------3
                                నోటిలో  నాలుక వలె - -పురజనులందరి  -మెప్పు బడసె  -మిక్కిలి మక్కువ  చూపి !
                                              ఎ   లోటును  రానీక     ----                             మేనల్లుర  -కన్న కుమారుల రీతిగా  ఆప్యాయత జూపి 
                                   చదువు  సంద్యలను -  బుద్ధియు  జ్ఞానము  -  విద్య  నేర్పే- పెండ్లి చేసే !
                                    సహస్ర  చంద్ర  దర్శనమున  అందరు  ఒక్కటి -- అను బంధము   వేసే -!
                                     ఆనంద మరీచికల   డెందము  ఊగిపోయి  --మీ పెళ్లి వేడుకలో  పాల్గొనగా  కడు ముచ్చ టాయే  ! ----------4
                                     
        కొడుకును గోలుపోయి  కోడలు మనవల - బేల ముగంబులన్  జూసే --!
        ఇంతలో  కూతురు  కన్ను మూయ- కూలిన   సంసారములన్  జూసే --!
       దైవము - అక్కట ! జాలిని కరుణయు-- లేనిదయ్యే --!
       విధి విచిత్రమో--!విధాత  రచించిన  మాయాజాలమో ?--------------------------------------------------------------------------------------------------5
                                                      చేసితి వెంతో  పుణ్యము --!సతీ అనసూయను ధర్మపత్ని గా  జే పట్టి --
                                                      ఆమె -ఇంటికడుగిడిన  సుముహుర్త బలమ్మో! పితృ దేవుల  దీవన  ఫలమ్మో!  
                                                      వైభావంములు పదిఒఅన్తలు సత్సంతానము- సత్బందువుల్ - 
                                                      సదాచారత-నొప్పె  మీ  గృహము  !  -చేసిన  పుణ్యము  రిత్త  పోవునే ?----------------------------------------6
      అల్లుండ్రు  కొడుకులైరి--తమ  తలి దండ్రులవోలె  మిమ్ము  సేవించి నారు  !
     కొడుకులతో  సమానముగా -మీరు పుత్రా వాత్సల్యము  పంచినారు -!
     వారలతి వైభవముగా -సహస్ర చంద్ర - దర్శన భాగ్య సేవ గావించినారు  -!
     పార్వతి పరమేశ్వర దర్శన ము - మన్మన్దిరంములో  ధృడముగా  నిలిపినారు !  -----------------------------------------------------------------------------7                                   
                                         కరుకుగా మాట లాడడు కదా !ఎన్నడు ఒరులను  బాధ  పెట్టడు -!
                                        అవసరానికి  మించిన  భాషణంబులు  చెయ్యడు- వృధా  ప్రసంగముల్--
                                        చెయ్యడు -! !పొరపాటు ననైన- ఎవ్వరిన్  తిట్టడు- కొట్టడు ! మాట  జారడు -!
                                        మిత భాషణంబులన్  రంజిల జేయునందరిని  ! - నవ్వుల కైన-
                                       ఎవ్వరిన్  వెక్కస మాడడు ఎన్నడున్ -  !మచ్చ లేని జీవనమును  గడిపెన్ -  !
                                      వేముగంటి వంశ భూషణుడు - శ్రీ  నరసింగరావు  ధీరతన్--!--------------------------------------------------------------8
   తాళి కట్టిన  భార్య - సతి అనసూయ --నిను గన లేక దుఖించు నోయి  !
  మావా -  మావా ! అనుచు మదన మొహనుడదిగో-       పెద్ద కొడుకు వోలె  వగచే నోయి --!
  బంధు జనులందరూ --బ్రాహ్మణోత్తము లంత ----శ్రద్ధాంజలి  సమర్పింతు రోయి-  !
 తోబుట్టువులు   అన్న - !  అన్నయ్యా ! అనుచును ఆర్తితో దుఃఖించి  క్రుంగిరోయి-- !
కన్న కొడుకులు  కన్న తండ్రిని  గోల్పోయి - కన్నుల నీరు పై గప్పెనోయి---
యలబాక  గ్రామము దొర లేని కొరతతో -- వెత జెంది  బాధ లో  మునిగె నోయీ----------------------------------------------------------------------------9
                                             ఎంత  లోటో- ! నీవు లేనట్టి  ఇల్లు ? ఎంత కోరతో  నీవు  రానట్టి  ఊరు  ?
                                             ఎన్ని  జ్ఞాపకాలో  ? ! --  ఎంత   గురుతో ?   !-- రంగా రావు గనిన - రాధా రమణి  గనిన -
                                            --  గుండెలు  చెరువులై--  నిండు నోయీ !--------------------------------------------------------------------------10
   ఎంత వారలైన  - విధికి  వంచితులే  - నిజము--!
 వెనక  వచ్చు వారెల్ల  -  వెనక  పోవుదురు  --నిజము -!
కాని  నీవలె - ఉత్తమ  చరిత  గలిగి --!
 పేరు గన్నట్టి  - జన్మ  ధన్యమ్ము  -- నిజము !----------------------------------------------------------------------------------------------------------------11
                                              మా  పాలిట  భాగ్యముగా  స్మరియింతు  మయ్య -! 
                                              మీ చల్లని దీవన  మాకు - మా  పిల్లలకు - శ్రీ  రఘు రామ  రక్షగా  భాసిలునయ్య  !
                                             ప్రేమ  పుష్పాంజలు  లివిగో --!  సమర్పింతుమయ్య   -!
                                             ప్రశాంత మైన  ఆత్మానందము  నందుమయ్య   - ----------------------------------------------------------------12
     విశిష్ట  వ్యక్తిత్వము  కలిగిన  నరసింగ రాయా --!  యలబాక  గ్రామ  పురంధరాయా --!
    సతీ  అనసూయ  ప్రాణ  ప్రియాయా -!
   సకల  బంధు జన  -గ్రామపురజనుల  స్నేహితుల    ఆత్మా బంధనాయా  --! 
   మగరాయా  ! గురువా రాయా  !    యశోధరాయ  !---------------------------------------------------------------------------------------------------------13
                                       మాటలు  జాల వాయే  -- నిను గొని యాడగ   !- హృదయము  భారమాయే --!
                                       ఈ  దుర్భర  దుస్తితి  లో  మీకు--  తీరని -   ఆరని గాయ మాయే  !
                                        కీర్తి  ప్రతిష్ట  లన్- గణుతి  కెక్కిన  వారల  బాధ  మీరె  !
                                       గతించిన   వారి  - జీవానోన్నతి గురించి   మదిన్  - క్రుంగి పోయే  గదా !-----------------------------------------------15
   అలసట  జెంది నావు కదా -! కన్న కడుపు తీపి   కోతతో --!
 విశ్రాంతిని  పొండుమయ్య    --! నమస్సులయ్య  --!
 మా  మనసు   రంజిలు నయ్య - మిమ్మెపుడు  తలచినచో--!
 ఆత్మ విశ్వ్వాసము  తల ఎత్తునయ్య  --! అందరి    ఆత్మ బంధువా !-----------------------------------------------------------------------------------------17
-------------------------------------------------------------------------------------------------------------------------------------------
                                                - వేద మూర్తుల  - బ్రాహ్మణోత్త ముల  ఆశీర్వచన  సమయములో వందన   సమర్పణ !
                                                                 15-12-2011- thursday 7-00pm-knr                                                                            
    

Gothram

పుట్టిన ప్రతి మనిషి - ముగ్గురికి రుణ పడి  ఉంటాడు --జన్మ నిచ్చిన  తల్లిదండ్రులకు -- ధార్మిక మైన జీవనం  గడపడానికి -శాస్త్రాలని అందించిన  ఋషులకీ--మరియు  ప్రాణుల్లో కెల్లా అతి  ఉత్కృష్ట మైన  మనిషి జన్మ   ప్రసాదించి --అందమైన ప్రకృతిని   అనుభవించి   ఆరాధించడానికి -కారకుడు అయిన  ఆ పరమాత్మ కు  రుణపడి ఉంటాడు -!
            1  --   తలిదండ్రులు       సజీవులుగా ఉన్నపుడు   వారిని  సేవించుకోడం ద్వారా - వారు గతించాక  శ్రాద్ధ కర్మల ద్వారా వారికి  ఋణం  తీర్చుకుంటాం 
                     2  --       ఇక రామాయణాది శాస్త్ర గ్రంధాలు  పఠించి  - సాంప్రదాయం -సంస్కారం  నేర్చుకుని గీత లో చెప్పినట్లుగా మానవ జన్మను సార్ధకం చేసుకోడం ఎలా ? జగద్గురువులు ఆది శంకరాచార్యులు  లాంటి వారు వ్యాస వాల్మీకి ఋషులు- మన భారత భూమిలోనే  ఆవిర్భవించి  ఆవిష్కరించారు  - మనిషి  ధార్మిక జీవనానికి  ఉపకరించే -విధంగా ఎన్నో స్తోత్రాలు కృతులు - -అందజేశారు--! చదివి -మననం  చేసుకుని - ఆలోచించి  ఆచరించి  తరించడానికి -- అమూల్యమైన   అద్భుతమైన  సంపదను మన  భారత జాతికి  అంద జేశారు - అవి లేకపోతె మనం లేము --
చరిత్ర లేని మనిషికి  మనుగడ లేదు --అట్టి  మహా ఋషుల ఋణం --వారు అందించిన సశాస్త్రీయమైన అనుకరించి  -అన్వయించుకుని --ఇహపరాలను సాధించడం  ద్వారా --ఋషుల  ఋణం తీర్చుకోవాల్సి  ఉంటుంది  -- గోత్రం ప్రసాదించింది  ఋషులే !గోత్రాభి వృద్ది రస్తు ! అంటే-
ఋషుల దీవన వల్ల  మన బ్రతుకు  ధన్యమౌతుంది 
                                 సంద్యావందనంలో --ఆ  ఋషుల  సంస్మరణ  ఉంటుంది --వారు మనకు జ్ఞానం ఇచ్చిన తోలి గురువులు - గురువు కరుణ వల్లే  మన దారి సుగమం  అవుతుంది -- హరితస -ఒక మహర్షి - యవనాశ్వ   మరొకరు -అంబరీషుడు  మూడవ మహర్షి   !
                          ౩--      ఇక దైవ ఋణం -- అనుదినం ఇస్తా దైవాన్ని స్మరించుకోడం -- ఆలయాలకి వెళ్లి -- మరువకుండా  మదిలో నిలుపుకోడం -- పూజలు - నోములు --వ్రతాలు -యజ్ఞాయాగాది క్రతువులు -చేయడం --పవిత్ర నదుల్లో స్నానం చేయడం --ప్రముఖయాత్రా స్తలాలను  దర్శించడం   ద్వారా దైవ ఋణం  తీర్చుకో వచ్చును 

               సర్వే జనాః స్సుఖినో భవంతు --సమస్త సన్  మంగళాని  భవంతు -- ఓం  శాంతి  !శాంతి ! శ్శాంతి !
                                  ---------        శ్రీ శుభమస్తు ---- 

Sandhya vandanam

this process needs --only 15 minutes time - I  MADE THIS BRIEF!
             advantages  are many
1- this is only  dyaanam - you may concentrate on any object -- but
one and only one --target NO OTHER THOUGHTS SHOULD  ENTER INTO THE
MIND
BEGINING IS TROUBLESOME - BUT ONCE WE EXPERIENCE IT -WE BECOME A
POWERFUL SUPERMAN - ANY WORK OR WORD WILL BE FRUITFUL AND SUCCESSFUL-
AND BECOME - A  YOGI -A  SADHAK- A RAMDEV BABA - A VIVEKANANDA -A
PARAMAHAMSA  AND A MAHATMA AND WHO HAD COMMITMENTS AND STRONG BELIEF
-AND AIM IN LIFE -THEY WORSHIPPED -AND SERVED -LIVED - FOR OTHERS -AND
BECAME ETERNAL WITH FAME AND NAME
2- needs -- a patra with water - another on floor -- a udharini --or
spoon - and  a mat to sit on the floor
                  a dhoti   and a towel on shoulders-- needless to say
 -- a JANDYAM- without knots pure and clean --it is UPAVEETAM_  a
thing lying close to our HEART-- A GARLAND-- AND WE HAVE TO GET BY
HEART THESE MANTRAS -I SHALL CONVEY WORD TO WORD MEANING  AT YOUR
DESIRE !
4-- this is a process of thanks giving A  GRATITUUDE  --to the GOD
-who has given-- everything ! what --NOT?
             mind - soul - body -  nature- relations- affections - all
luxuries and  comforts - parents --wife  -children   AND SO ON !
       mainly we are  born as MEN _  that is enough ! AND WE ARE
BRAHMAN  -IT IS MORE THAN ENOUGH  I  !  THIS IS OUR  BIRTH  RIGHT
GIVEN BY THE GOD   ! A BOON TO US !
         KARMASAKSHI   - the sun is  the living - moving - lifegiving
god - without HIM no universe no creature - and no  nature - we pour
water addressing HIM - in his front- two times
         he is GAYATRI  all the gods and goddess exist in his form
         one GOD  IS  WITHIN US   -- and another  GOD IS  SUN  we have
to unite these two !   where real  happiness  permanent sachidanandam
- gives us  light  and delight
5 -- if we know the meaning of these mantras - we   never forget to do
this holy yajnam -sandyavandanam
         which  means -- every day-- rising and setting sun is warning
us -- that  count down is started - and utilise the life not like an
animal -- but like a WISE MEN -  who prays for the welfare of  others
!
         MAIN PURPOSE OF  SANDYAVANDANAM     is a prayer to god to
bless all  mankind - all  creatures - entire universe - as a whole to
be good -peaceful merciful  and stomuchful  too
            SARVE JANAH SUKHINO  BHAVANTHU
             LOKAA  SAMASTHAA  SUKHINO  BHAVANTHU
 SARVE  BHADRAANI  PASHYANTHU

6- KNOWING  A  LITTLE BIT ABOUT  SANSKRIT WILL  DEFINITELY GIVE US
ENOUGH GRIP -- NOT ONLY THIS   SURYA VANDANAM

             last  -- but not  least - unless we -  so called
brahmin do this  great venture - we cannot get any returnby visiting
temples -doing yatras-- vratham- japam - yajnam -yagam and so on
      this is the KEY to become brahman not  by birth but by karma
anushtanam  - that is this sandya ( sandya ) vandanam
                                 MAY  GOD BLESS  ALL LIVING BEINGS

ఉద్ధరిని లోని  నీటితొ  తలపై  ప్రోక్షించు  కుంటూ -----
----------------------------------------------------------------------------------------------------------------------------
        శ్లో "  అపవిత్ర  పవిత్రోవా - సర్వావస్తాన్  గతోపివా - యస్మత్ పుండరీకాక్షం - సబాహ్యాభ్యంతర  శ్శుచి ::! పుండరీకాక్ష ! పుండరీకాక్ష --!పుండరీకాక్ష !"       -----  అనాలి 
 ---1 --ఆచమనం--- !    -- కేశవాయ  స్వాహా !-నారాయణాయ స్వాహా -! మాధవాయ  స్వాహా--! -------మూడు సార్లు  ఆచమనం  చేయాలి !-----    తర్వాత  గోవిందాయనమః -విష్ణవే నమః -- మధుసుదనాయనమః-- త్రివిక్రమాయనమః వామనాయనమః- శ్రీధరాయనమః-- హృశీకేశాయనమః-- పద్మనాభాయనమః-- దామోదరాయనమః-- సంకర్శనాయ నమః వాసుదేవాయనమః--  అనిరుద్దాయనమః-- పురుశోత్తమాయనమః- అదోక్షజాయనమః-- నరసింహాయనమః-- అచ్యుతాయనమః-- జనార్ధనాయనః మహా -  ఉపెంద్రాయనమః-- హరయేనమః--  శ్రీకృష్ణ  పరబ్రహ్మనే నమః !           ---   ------భూతో చ్చాటనము----
---------------------------------
           శ్లో!    "    ఉత్తిష్టంతు భూత పిశాచా :--ఏతే  భూమి భారకాః  !--ఏతేషా  మవిరోధేన  బ్రహ్మ కర్మ సమారభే !"
2 --  ప్రాణాయామము !--
--------------------------------------
-- పూరకము --కుడి ముక్కున  శ్వాస పూరించడం                !
                                 కుంభకం -----వాయువును బంధించి గాయత్రి జపించడం 
                                 రేచకం --ఎడమ ముక్కు ద్వారా శ్వాస విడవడం 
3 --సంకల్పం ---!
--------------------------
---శ్రీ గోవింద ! గోవింద ! మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్త మానస్య 
 ఆద్య బ్రాహ్మణే-- ద్వితీయ పరార్థే -- శ్వేత వరాహ కల్పే --వైవస్వత  మన్వంతరే - కలియుగే --ప్రథమ పాదే --  NORTH AMERICA _ క్రౌంచ ద్వీపే మేరోర్  ఉత్తర పార్శ్వే ---మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య --శ్రీ  పరమేశ్వర ప్రీత్యర్ధం  - శుభే  శోభనే ముహూర్తే -మహా విష్ణో  రాజ్ఞయా   ప్రవర్తమానస్యాద్య  బ్రాహ్మణ  -  ద్వితీయ  పరార్థే  శ్వేత వరాహ కల్పే  - వైవస్వత  మన్వంతరే - కలియుగే  ప్రథమ పాదే- వసతి గృహే -  సమస్త దేవతా  బ్రాహ్మణ  హరిహర  సన్నిధౌ  - అస్మిన్ వార్త మాన   వ్యావహారిక  చాంద్ర మానేన  ------
         నందన  నామ సంవత్సరే - ఉత్తరాయనే-- వసంత  ఋతౌ--  వైశాఖ మాసే -- శుక్ల పక్షే - సప్తమి  తిథౌ  --(శెని)   మంద వాసరే--  శుభా నక్షత్రే  శుభయోగే  శుభకరనే --- ఏవంగుణ  విశేషణ  విశిష్టాయాం - 
 శ్రీమాన్( హరితస  గోత్రః  రోహిన్ కుమార్  - నామధేయస్య  ధర్మ పత్నీ సమేతస్య --) మమోపాత్త  దురిత క్షయ  ద్వారా  శ్రీ పరమేశ్వర  ప్రీత్యర్థం   ప్రాతః స్సంద్యాం  ముపాసిష్యే  ! 
అంటూ ఉద్ధరినితో  నీటిని  పాత్రలో  వదలాలి ---
  -
 4 --మార్జనం !
-----------------------
-- దిగువ మంత్రము చెప్పుతూ -- కుడి చేయి బొటన వేలి తో - నెత్తిపై - నీరు చల్లు కోన వలెను --   -ఎడమ చేతిలో  నున్న ఉద్ధరిని  నుండి  నీటిని తీసుకుంటూ  --!
        శ్లో !" ఓం ఆపోహిస్టా మయో భువః --తాన ఊర్జే తదా చన--మహేరనాయ- చక్షసే    !
            యోవ శ్శివతమో  రసః --తస్య భాజన తే హనః --ఉశతీరివ మాతరః --  
           తస్మా ఆరంగ మామవో ---  యస్య క్ష యాయ జిన్వద--ఆపోజన  యధాచన ! !"
 5 -- --కుడి అరచేతిలో - ఉద్ధరిని తో నీరు  తీసుకుని దిగువ మంత్ర ము   చెప్పిన  తర్వాత పుచ్చు కోవాలి  --(---ఉదయం  సమయంలో )
           "  శ్లో !సూర్యశ్చ మా   మన్యుశ్చ - మన్యు  పతయశ్చ -మన్యు కృతే భ్యః --
                  పాపెభ్యో రక్షన్తాం   -యద్రాత్ర్యాం  పాపమకార్షాం  -- మనసా వాచా హస్తాభ్యాం        ------                     పద్భ్యాం ఉదరేన  శిష్నా - --రాత్రి స్తదవ  లుమ్పతు--
 యత్కించ  దురితం  మయి --ఇదమహం  మా మమృత యోనౌ   --  సూర్యే  జ్యోతిషి  జుహోమి  స్వాహా !"
             (  సాయంత్రం  సమయంలో --)
            శ్లో ! "అగ్నిశ్చ మామన్యుశ్చ   -- మన్యు పత యశ్చ - మన్యు కృతే భ్యః -యదాహ్నాత్ పాపమకార్షం -
                      మనసా వాచా హస్తాభ్యాం  పద్భ్యాం  ఉదరేన  శిష్నా -- అహస్తదవ   లుమ్పతు 
                       యత్కించ  దురితం   మయి - ఇద మహం   మా మమృత  యోనౌ -- సత్యే జ్యోతిషి  జుహోమి  స్వాహా!"
          ఈ మంత్రము చెప్పి నీటిని పుచ్చుకున్న  తర్వాత - ఉదయం  సాయంత్రం   దిగువ మంత్రాన్ని  కూడా  అనాలి --
              శ్లో !దధి క్రావన్నో అకారిషం-- జిష్ణో రశ్వస్య  వాజినః --సురభినో  ముఖా   కరత్ప్రన-  ఆయూగం షీ తారిషత్ --
                       ఓం అపో హిస్టా -------   -     -
                అంటూ 4 లో  ఉన్న మంత్రాన్ని తలపై నీటిని  కుడి చేతి బొటన వేలితో  చల్లుతూ -- చెప్పు కోవాలి --

 6 ---  ప్రాతః  కాల  మంత్రము
           ----------------------------------
          -- " ఉద్యంత  మంతం ---------------  అంత  మాదిత్యం   మభిద్యాయన్  --కుర్వాన్ బ్రాహ్మణో  విద్వాన్ --       ----------                       సకలం భద్ర  మశ్నుతే -----!
                అసావాదిత్యో    బ్రహ్మేతి  బ్రహ్మై వసన్ --- బ్రహ్మో ప్నేతి  య ఏవం  వేద  ---  అసావాదిత్యో    బ్రహ్మ !"
   7 ---అర్ఘ్యం
---------------------
  --!  ఉద్ధరినితో  నీటిని  పాత్రలో  వదలాలి  
 ---"-పూర్వొక్త  ఏవంగుణ   విశేషణ   విశిష్టా యాం --పరమేశ్వర  ప్రీత్యర్తం  -భగవదాజ్ఞాయా  ప్రాతః  సంద్యా వందన -  అర్ఘ్య ప్రదానం      కరిష్యే   !
 దిగువ  గాయత్రి  మంత్రం  మూడు సార్లు --  చెబుతూ  ఎడమ చేత చెంబు  ఉంచి కుడి అర చేతికి  ఆనించి   -- నీటిని   మూడు సార్లు  -- వదలాలి  దిగువన ఉన్న  పాత్రలో   !-

          
  8 ---ప్రాణాయామం
----------------------------
 ---------ఓం   ఇత్యేకాక్షరం  బ్రహ్మ -  అగ్నిర్దేవతా  బ్రహ్మ ఇత్యార్షం-- గాయత్రీం  చన్ధం-పరమాత్మ    స్వరూపం - ప్రాణాయామే  విని యోగః !
                 ప్రాణా యామం  చేయాలి   -- ఓంకార  మంత్రం చెబుతూ -- కేనీసం  ఆరు సార్లు !
9 --    గాయత్రీ మంత్ర  జపం --!
-----------------------------------
 ఆయాతు వరదా   దేవ్యక్షరం బ్రహ్మ సమ్మితం-- గాయత్రీం  ఛందసాం -  మాతేదం  బ్రహ్మ జుషస్వమే--ఒజోసి సహోసి 
 బలమసిభాజోసి  దేవానాం ధామనామాసి  విశ్వమసి  విషవాయు  - సర్వమసి   సర్వాయు రభిభురోం -- 
  గాయత్రీ  మావాహయామి -- సావిత్రీ మావాహయామి--  సరస్వతీ  మావాహయామి -- చందర్శీ మావాహయామి 
 శ్రియ  మావాహయామి  --గాయత్ర్యా  గాయత్రీ  ఛందో  విశ్వామిత్ర  రుషి స్సవితా  దేవతా  -- గాయత్రీ  మహా మంత్ర  జపం  కరిష్యే -- !

గాయత్రీ  జపము --
----------------------
           -"  ఓం భూర్భువ స్సువః   తత్స వితుర్వరేణ్యం  భర్గో దేవస్య  ధీమహి  ధియో యోనః  ప్రచోదయాత్ - "
( అని యధా శక్తి  జపించ వలెను )   
   గాయత్రీ  మాత  ధ్యానం  ! 
--------------------------------
    
 10 -- దిగ్దేవతా  నమస్కారము 
-------------------------------------
"ప్రాచ్యై   నమః !- దక్షినాయై  నమహా! -- ప్రతీచ్యై  నమహా !-- ఉదీచ్యై  నమహా! - ఉర్ధ్వాయై  నమః!  అధరాయై  నమః  !సంద్యాయై  నమహా  -!- సావిత్రై  నమః -! సరస్వతై   నమః ! సర్వేభ్యో  దేవేభ్యో  నమః!  - రుషిభ్యో  నమః!  మునిభ్యో  నమహా!  గురుభ్యో  నమహా !   పితృభ్యో నమహా -!-  మాత్రుభ్యో  నమః! -- కామో  కార్షీ మాన్యు రకార్షీ నమో నమహా -- !పృథివ్యాపస్తేజో   వాయు రాకాశాత్ ! "
                          సూర్య  నమస్కారం !
                        ------------------------------
 "ధ్యేయస్సదా  సవిత్రు  మండల    మధ్య వర్తీ! -- నారాయణ  సరసిజాసన   సన్నివిస్ట  !  
కేయూర మకర కుండలవాన్   కిరీటి!---హరి !  హిరణ్మయ వపుహు !  ధృత శంఖ  చక్ర గదా పాణే !
ద్వారక నిలయాచ్యుత! -  గోవింద !  పుండరీకాక్ష   ! రక్షమాం   ! శరణా గతం ! "
   11 ----- ముగింపు
------------------------------------
 -- రెండు చేతుల వేళ్ళతో వ్యతిరేకంగా చెవులకు తాకిన్చుకుంటూ  "ప్రవర "  చెప్పాలి !
  "   చతుస్సాగర  పర్యంతం  గోబ్రాహ్మనేభ్య  శ్శుభం భవతు !- !హరితస-  యవనాశ్వ-  అంబరీష - త్రయీ మహర్షి ప్రవరాన్విత - హరితస  గోత్ర - ఆపస్తంబ  సూత్ర-- యజుశ్శాఖా  ధ్యాయీ -  రోహిన్ కుమార్  అహంభో  - అభివాదయే!"
        ఆచమనం !           ---
 కాయేన వాచా  -- మనసేంద్రి యైర్వా -  బుద్ధ్యాత్మనేవా  -- ప్రకృతే  స్వభావాత్ 
కరోమి యద్యత్  సకలం   పరస్మై --  నారాయణా యేతి   సమర్పయామి   !!
              అంటూ నీటిని వదలాలి 
ఈ నీటిని  ఎవరూ తొక్కని  చోటున - అనగా చెట్టు మొదలు లో - గోడ పై గాని పోయాలి 
                                     ---   the end    ----

Jandhyam


   జందెము  వేసుకునే విధానం  రాస్తున్నాను --!   
    ఆచమనం  చేయాలి -- ప్రాణాయామం - సంకల్పం యదా విధిగా  చెప్పాలి  --
       మమ శ్రౌత  స్మార్త  విహిత  నిత్య కర్మానుష్టాన  యోగ్యతా సిధ్యర్థం బ్రహ్మ తెజోభి వ్రుధ్యర్థం --యజ్ఞోప వీత ధారణం   కరిష్యే   !
 అని నీళ్ళు  విడవాలి -- జంధ్యాన్ని రెండు మోకాళ్ళకు చుట్టి - మూడు చోట్ల కుంకుమ తో  అలంకరణ  చేయాలి -- !
                     మళ్ళీ ఆచమనం  చేసి -- ఒక జంధ్యాన్ని  రెండు చేతులా పట్టుకుని  ఈ మంత్రం అంటూ  ధరించాలి < కుడి భుజం పై నుండి  >
 యజ్ఞోపవీతం  పరమం  పవిత్రం - ప్రజాపతే  -సహజం  పురస్తాత్ -
ఆయుష్య  మగ్ర్యం  -ప్రతిముంచ శుభ్రం --యజ్ఞోపవీతం  బలమస్తు తేజః  !!
                                        తిరిగి  ఆచమనం -- మళ్ళీ మరొక జందెం --అదే  మంత్రాన్ని  అంటూ ధరించాలి 
                                   మూడవ  పోగు జందెం - కూడా అలాగే ధరించాలి  ! 
ఆ తర్వాత    పాత  కొత్త జంద్యాలను  కలిపి   దశ  గాయత్రి జపం  -చేయాలి ---
                                పాత జంధ్యాన్ని కుడి  భుజం పైగా  తీసి వేస్తూ   --ఈ మంత్రాన్ని  అనాలి --
   ఉపవీత  చిన్న తంతుం ---జీర్ణం కశ్మల  దూషి తం----!
  విసృజామి  యశో  బ్రహ్మ -వర్చో దీర్ఘాయు రస్తుమే---!
                                           తీసిన  జంధ్యాన్ని --ఎవరూ తొక్కని చోట వదిలేయాలి 
    నూతన యజ్ఞోపవీతం తో   -- యదా  శక్తి -- గాయత్రి జపం చేయాలి --
                                             జయం - శుభం 

Sri Ram

 నాగరాణి -శ్రీకాంత్ ల  పుత్ర రత్నానికి  - నామకరణం -శ్రీరాం అని జరిగింది --ఆ  సందర్భంలో  నేను- రామనామానికి  స్పందించి - చలించి రాసినపాట - అందరికి చదివి వినిపించాను -- 9/3/2012
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 ఏడుకొండలవాడ - వెంకటా రమణా !-    భద్రాచల వాసా-- శ్రీ సీతా రామ చంద్రా - !
శ్రీశైల వాసా -మల్లికార్జునా శివా ---!  !శ్రీకాళ హస్తీశ్వర--  జ్నాన ప్రసూ నాంబికా -హరా !
ముక్కోటి దేవతల ఆశీస్సుల ఫల మండి-- !బుద్ధవరపు శ్రీరాముని  మనసారా  దీవించండి !
పెద్ద మనసు కలిగిన  హితులారా !  బంధువులారా  !  --చిన్నారి  శ్రీరామునికి -- ఆశీస్సులు  అందించండి !  --   
          పితృదేవతలు - కీర్తి --శేషులు  తాతమ్మ --      శ్రీమతి  సరోజనమ్మ _ శ్రీరాముని   దీవించమ్మ !
          పితృ దేవులు - కీర్తి - శేషులు  తాతయ్య లైన -- సీనన్న - బాపన్న     -- తాతమ్మ - తారమ్మ - !
          పొత్తిళ్ళ  పాపడిని - శ్రీ రామ యనుచు  దీవించండి   !
శ్రీరామ   రామ అంటే - పాపాలు  తొలుగు నండి  !      శ్రీరామ నామము  - భవ తారక మంత్ర మండి  !
 స్మరించిన తరించును -- జన్మ ధన్య మగునండి -  !--గౌరికి  శివుడుపదేశించిన  శ్రీరామ నామమండి !
 మధురాతి  మధురము -  శ్రీరామ నామము ! -       సులభము - సరళము - దివ్యాతి  దివ్యము   !
           పుట్టిన పాపాలకు పేరు -- నామకరణ మహోత్సవము  ! -  -అనాదిగా ఆచారము  దేవుళ్ళ పేరు పెట్టుట  !
!           ఆడ పిల్లయితే  -వాణి - లక్ష్మి -గౌరీ యనీ -   --  !               -మగ పిల్లాడైతే  రాముడనీ --శివుడనీ-- --
           నోరార పిలచినా హరియించును   పాతకమని ! -                -కలియుగాన హరినామ స్మరణమే   మిన్న యనీ   --!-
           వింటిమి -- కంటిమి   !--నేడు చూచితిమి -- కనులారా   !
  శ్లో !!  " శ్రీరామ  రామ  రామేతి --రమే రామే  మనోరమే --!  సహస్ర నామ  తత్తుల్యం  -- రామనామ  వరాననే  ! "

Mithunam


మిధునం సినిమా ఒక రమణీయ దృశ్య కావ్యం -తనికెళ్ళ భరణి గారికి పెద్ద వయసైన వారి తరఫున అభినందనలు - తెలుపుకుంటూ -మమ్మల్ని ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుందో చెప్పకుండా ఉండలేక పోతున్నాను -
చక్కని గ్రామీణ వాతావరణాన్ని తలపించే సహజమైన తోటలో- ఒక ఇల్లు చెట్లు పూ లు -కూరగాయలు -తమలపాకుల లతలు పనస -సొర మామిడి లాంటి పండ్లరసాల చెట్లు-సావిత్రిఐన గోవు -అంజి లాంటి లేగదూడ-బావి --వీ ని మద్య -చెప్పులు కుట్టేవానిగా -సన్యాసిలా -ఈతగానిలా -సంగీత ప్రి యునిగా -పూ జారిలా -రసికత ఎరిగిన సరసిలా -చదరంగంలో -తాటా కుపీకల్లో పాటలు పలికించిన భావుకునిలా - నవరసాలు తమ బ్రతుకుల్లో పండించుకున్న- జంటగా-ఇలా ఆ రెండు గంటలు మమ్మల్ని నానా రసమయ సన్ని వేషాల్లో ఓలలాడించి - -మురిపించి -మంత్రింప చేసిన ఘనత భరణి గారికి దక్కుతుంది -
రేడియో లో పాత పాటలు -కాఫీ దండకం తాతగారిపై మనవడి కార్టూన్లు- పెళ్ళాం చీరల్లో భావుకత -కుంకుడు రసంతో తలంటు -నోరూరించే వంటకాలు -ఇడ్లి దోస పచ్చళ్ళు --ప్రేక్షకులకు కడు దగ్గరగా -కమనీయంగా -హృద్యంగా చూపించారు --ప్రేక్షకులకు తమ నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాల సారం కలబోసి నింపారు తమ ఈ చిత్రంలో-
సరసమైన డైలాగులు -నవ్వులు -పరిహాసాలు హాస్యాలు -ప్రతీ క్షణం పంచుకుంటూ -ఆనందం తమ దాంపత్యం లో- నింపుకుంటూ -అంతిమ ఘడియల్లో కూ డా - శరీరాలు వేరైనా తమ ఆత్మలు ఒక్కటే-అని నిరూపించారు -తమ అనురాగ మయ జీవితానికి ఇతరుల అనుబంధాలు ఆప్యాయతలు అడ్డు రాకుండా -తమకంటూ ఒక మరోలోకం-సృష్టించి- భరణి గారు ఇచ్చిన -మధురమైన జీవితం గడిపారు ఆ పుణ్య దంపతులు -
తాము కూడా తమ నిజజీవితంలో అలా ఉండగలమా ? అని తప్పకుండా అత్మవలోకనం చేసుకుంటారు ప్రేక్షకులు . మేము కూడా ఇలాగే ఒకరికొకరై -తోడునీడై ఉంటె బావుండును -అన్న ఊహ మనస్సులో మె దు లుతుంటుంది. కొంతమంది అలా ఆనందంగా ఉండాలని ప్రయత్ని స్తారు కూడా.
అది తమ జేవితమే అన్నంత గొప్పగా అన్వయం చేసుకునే విధంగా పాత్రల చిత్రీకరణ జరిగింది -అలాంటి సన్నివేశాలు సంభాషణలు చొప్పించారు కూడా తనికెళ్ళ గారు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి గారి పుష్ప విలాపం -"నేనొక పూల మొక్క కడ నిలిచి " అనే ఘంటసాల గారిగాత్రమాదుర్యంతో జాలు వారిన పద్యాన్ని ఎంతో హృద్యంగా ఎర్రగుల్లాబీ తో అ ద్భుతంగా చిత్రీకరించారు. బాలు గారు -లక్ష్మిగారు అద్భుతంగా నటించారు -కాదు -ఆ పాత్రల్లో చక్కగా జీవించారు -పాత సిన్మాలు చూస్తున్న భావన కలిగింది సుమా మాకందరికీ --కథ -మాటలు దర్శకత్వం -నటన పాటలు సన్నివేశాలు -చిత్రీకరణ అన్నీ బావున్నాయి- రమ్యంగా -మనోరంజకంగా -ఆహ్లాదంగా ఉన్నాయి.
ఇద్దరితోనే రెండు గంటల కథ నడిపించడం సాహసం. ముసలిపాత్రల్లోకూడా ప్రారంభం -అంతం తో బాటు -- ఒయ్యారాలు సరాగాలు జీవన రాగాలు -షడ్రుచులు ఖేదం -విషాదం మోదం రోషం కోపం ప్రేమ -అభిమానం -పంతం పట్టింపు -ఇలాఎన్నో నోరూరించే ఘుమ ఘుమలు పండించడం ధైర్యం. నేటి ఆధునికతకు దూరంగా ఈ జంటను ఉంచి పాత రోజుల్లో ఉండే సాంప్రదాయాలకి విలువ ఇస్తూ -కొడుకులు కూతుళ్ళు వారి ఆప్యాయతలకు అతీతంగా తమ స్వతంత్ర జీవనానికి అడ్డులేకుండా ఒక హద్దుల్లో ఉంచి - ఇలా చరమ దశలో -వృద్ధాప్యంలో -నిశ్చింతగా ఉండ వచ్చు అని చూపారు
attachment లో detachment తామరాకుపై నీటి బుడగలా -అలా ఉండగలమా /అన్న ప్రశ్న కు జవాబు ఈ సినిమా.
భర్త కు కాలిలో ముళ్ళు కుచ్చుకుంటే భార్య విల విల లాడటం -భార్య జ్వర పడితే భర్త వేదన -మౌన రోదన - ఒకరికొకరు ప్రాణంగా సేవ చేసుకోడం -ప్రేమించుకోడం -ఇలాచేయడం వల్ల వారిపట్ల గల అనురాగం మరింతగా పెరిగి పోవడం చివరి శ్వాస వరకు -ఒకరిని విడచి -మరొకరు ఉండ లేక పోవడం -ఇదే నిజమైన భారతీయ జీవనం -దాం పత్యంలోగల ఆధ్యాత్మిక వేదాంత అనుభవ సారం -మన హిందూ జాతి గర్వించదగ్గ సంస్కారం - ఆలుమగల మధ్య ఒక పసుపు తాడు కల్పించిన ఇంట గొప్ప అనుబంధం -ప్రపంచంలోని ఎ ఇతర దేశాల్లో కూ డా కనిపించదు -మరి మన శాస్త్రాల్లో - ధర్మంలో వేదాల్లో అంతట బలమైన బలం -మర్మం దాగి ఉంది -చిన్న చిన్న అపోహలతో =అపార్దా లతో విడి పోవాలనుకునే పడుచు జంటలకు ఈ సినిమా ఒక కనువిప్పు కలిగిస్తుంది -పొరబాట్లను సరిదిద్దుకోవాలనే తపన - దాంపత్యంలో మధురానుభూతులను ఆస్వాదించు కోవాలనే అవగాహన కలిగిస్తుంది.
ఎంతటి వారైనా రాగ ద్వేషాలకు అతీతులు కారు --అయినా ఒకరి పై ఒకరి కి గల అపారమైన నమ్మకం -ప్రేమ అవగాహన జయిస్తాయి.-ఇచ్చిపుచ్చుకోవడంలో నిజమైన సంతోషం -స్వచ్చమైన ప్రేమ ఉంటాయని చెబుతుంది ఈ కథ. దాంపత్యం కల కాలం వర్ధిల్లడానికి కా వలసిన జీవన సూత్రాలు -ఇందులో మనకి లభిస్తాయి కూడా.
భర్త తన చేతులతో భార్యకు సేవలు చేయడం -ఆమెకి కాలికి స్వయంగా -పట్టాగోలుసులు అమర్చడం - ఒళ్ళు సుస్తీ అయితే కాళ్ళు పట్టడం-సపరిచర్యలు చేయడం -కళ్ళ నీళ్ళు పెట్టు కొడం --ఆమెకి చెప్పులు కుట్టడం -చేతికి గాయమైతే కట్టువేయిన్చుకుని -చిన్న పిల్లాడిలా ఆమె ఒడిలో ఒదిగి పోవడం -తాటాకు పీకలతో చిన్న పిల్లల్లా -పాడుకోడం- భర్త సన్యాసం -భార్యకు పరిహాసం -అతనిపై ఆమెకున్న సత్తా -అధికారం ప్రేమ -అనురాగం అతన్ని కట్టి పడేస్తుంది -అంజి లేగ దూడ చని పొతే కన్న తల్లి దండ్రుల్లా దుఖించడం--గోవును తమ కుటుంబం లో ఒక సభ్యునిగా చూస్తూ - దానికి తమ బాధలు - గాధలు చెప్పుకోడం -అద్భుతంగా ఉంది -
వాలు కుర్చీ ఈ కథకి మూలం -వృద్ధ దంపతుల విశ్రాంతి మందిరం లా -అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది -కలుషితం చేయడానికి వచ్చే కారకాలను ఎప్పుడు తమ ఏకాంతానికి భంగం కలుగకుండా కనిపట్టుకుని ఉండటం- మాకు చాలా నచ్చింది -అవసరాల్లో ఉన్న ఆత్మీయులను ఆదు కోడం ద్వారా - అజ్ఞాతంగా భర్త కున్న ఉదారతకు భార్య కనబరచే కృతజ్ఞత -అతనికి చేతులెత్తి మొక్కడం -అపురూపం -అపూర్వం.
బాలుగారు లక్ష్మిని చేతుల్లో కెత్తి -మామిడి కాయలు అందించడం లాంటి సన్నివేశాలు కోకొల్లలు -భర్తను అటకపై కెక్కించిన భార్యకొంటె తనం భర్త దొంగ తనంగా భార్యకు తెలీకుండా పో[పు డ బ్బాల్లోంచి బెల్లం తీసుకోడానికి వెళ్లి బయట పడటం -అర్ధరాత్రివేళ కూడా ఆత నికిష్టమైన పండుముక్కను దాచి ఇచ్చిన అర్ధాంగిగా లక్ష్మి -నిజమైన గృహ లక్ష్మిగా -మహా లక్ష్మిలా కనబడు తుంది - ఇలా ఎన్నో మధుర ఘట్టాలు మనసునీ వయసునీ కదిలిస్తాయి -కవ్విస్తాయి -కన్నీరు తెప్పిస్తాయి కూడా.
అందులో మచ్చుకు కొన్ని మరపురాని మాటలు.
-----------------------------------------------------------------------
1-ఎంత చల్లని మాట చెప్పావే.
2- మొగుడి చావు కోరుకునే ఆడది ఈ ప్రపంచంలో నేనొక్క దాన్నే.
3- ద్రాక్షార సంబంధం లేదుట.
4--నాకు దొరికినంత గొప్పగా తోడునీడ --సాక్షాత్తు ఆ భగవంతునికి కూ డా దొరికి ఉండదు.
5--జన్మ -జన్మకీ నాకు మీరే కావాలి.
6-మన పెళ్లి మనం చూసుకున్నంత ఆనందంగా ఉంటుంది - నీ పెళ్లి చీర అది కట్టుకుంటే నేనెలా ఒప్పుకుంటాను ? అది మనవరాలైతేంటి ? మహారాణి ఐతేంటి ఈ సినిమాలో మళ్ళీ మళ్ళీ వినాలని పించే మధురమైన పాటలు కూడా .
------------- - -----------------------------------------------------------------------------------------------------
1-- ఎవరు గెలిచారిప్పుడు --? ఎవరు ఓ డారిప్పుడు ? -రెండు గుండెల చప్పుడు --నాదం ఒక్కటే ఎప్పుడు 1
2-ఆవకాయ పచ్చడి అందరిదీ --గోంగూర పచ్చడీ మనదేలే 1
సినిమా చూస్తున్నంత సేపు కమ్మని భోజనం చేస్తున్నంత ఆనందంగా -తృప్తిగా -ఉంటుంది - ఎన్నాళ్ళకు ఇలాంటి పాత సినిమాల్లోని -అనుభూతులు ఆత్మీయతలు ఆప్యాయతలు ఈ మిధునం సినిమాలో చూస్తున్నాంఅనిపిస్తుంది .
కుటుంబంలో ప్రతి ఒక్కరుకలిసి వచ్చి చూడ దగ్గ సినిమాఇది. భార్యా భర్తలను ఇంకా దగ్గరికి చేసి వారికి మా ర్గ దర్శకం--మధుర స్వప్నం -మానవతా దర్పణం -మమతానురాగాల దర్శనం - బాల గాంధర్వ రాగాలు పలికించే గాయకుడుగానే కాదు నటుడిగా కూడా -జీవన మధురిమలు పలికించి పండించడంలో సిద్ధ హస్తుడు -అనిపించాడు -వారిలో అంతర్లీనంగా అంతర్వాహినిగా సంచరించే ఆ కళామ తల్లికి జోహారులు హృ దయ పూర్వక నమస్కారాలు తెలియ జేస్తున్నాము.
జీవితంలో చరమాంకం -క్లైమాక్స్ ముగింపు -వాస్తవానికి దగ్గరగా ఉంది -భర్తను కోల్పోయిన భార్య దీనంగా -ఉంటుంది నిజమే , కాని భా ర్యను కోల్పోయిన భర్త జీవితం అంతకంటే దీనాతి దీనంగాఉంటోంది. ప్రస్తుతకాలంలో, స్త్రీ శక్తి స్వరూపి ఆమెతో పోలిస్తే ఒక్క దేహ దారుడ్య త లో తప్ప మగవాడు ఆమె సహాయ సహా కారాలు లేకుండా ఏ పని చేయడాని కైనా మనో నిబ్బరంసహజంగా అమెకున్నంతగా అతనికి ఉండదు దీపం లేని ఇంటిలా అతని జీవితం చీకటి మయం అవుతుంది.
అందుచేత ఆమె చేత కోరబడిన కోరిక వింతగా క నిపించినా వారి అన్యోన్య దాంపత్యానికి - అదే best solution. ఈ కథకే కాదు ఇలాంటి ఎ కథానిక కైనా ఆ పరిష్కారం అందాన్నిస్తుంది పొతే - నిజ జీవితంలో ఇది సాధ్య పడదు -విధి చేతుల్లో మనం కీళ్ళు బొమ్మలం -మన చేతిలో ఏది లేదు -మన జీవితాలను సాఫీగా సాగడానికి పరమాత్ముని కరుణించమని త్రికరణ శుద్ధితో కోరడం తప్ప.
ఈ సినిమా లో ఆ ఇద్దరిలో ఆ అనురాగ అన్యోన్య దాంపత్యంలో -దైవత్వం కరుణ -అనురాగం నిండుగా - మెండుగా ఉన్నాయి -- భరణి లా దైవాన్ని నమ్ముకున్న వారు పదిమందికి అవసరమౌతారు -ఆత్మ బంధువులౌతారు.
ఆ జంట వలె - ప్రతి జంట -ఆదిదంపతుల జంటలా అర్ధ నారీశ్వరులై -అర్ధాంగిని తన అర్ధశరీరంలో అంతర్లీనంగా అరాదిస్తూ -గౌరవిస్తూ తనలో తాను ఆమెతో రమిస్తూ నిత్యం ప్రశాంత చిత్తంతో -పరమానందంతో -జీవిస్తూ -పరమేశ్వర ప్రసాదితమైన జీవితాన్ని ఆనంద మయం చేసుకోవాలని నేటి దంపతులను కోరు కుంటున్నాము - ఆ స్పూర్తిని నేటి మానవాళిలో కలిగించమని ఆ భగవంతుడిని వేడుకొంటున్నాము.
సర్వే జనాః స్సుఖినో భవంతు

Gundi Kishtaiah

గుండి కిష్టయ్య గారు గుండి బలమున్న వాడు -గుండె కాయ లాంటి
వాడు  మన గుండె లోన గుడి అయినాడు
           గుండి గ్రామ వాసుల్లో గుండినే  తన ఇంటి పేరుగ  గలవాడు -1పేద
బాపడైనా  మంచి పేరున్న మొన గాడు -!
                        రామునికి  సీత లాగ -శివునికి లాగ  -కిష్టన్నకు
సతియై  సరోజనమ్మ కీర్త గాంచె -!
                        ఆలుమగలు  ఇద్ధరైనను - పని ఒకటే --మనసొకటే    -
                        పొ ర పొచ్చా లేన్నోచ్చినా -ఒడిదుడు కు
లేన్నున్నా -కలిసి కట్టుగున్నారు -1 తృప్తిగా  జీవించారు
                     అన్యోన్య  దాంపత్యం -అనురాగ మయ జీవనం--వారిది 1
                        అతిథి  అభ్యాగతుల మిక్కిలి  ప్రేమతో ఆదరించి
-ఆప్యాయతతో  పలుకరించి -వారికి కడుపు నిండా  -
                        అన్నం పె ట్టిన పుణ్య దంపతులు వీరు -!
            ఈ ఇంటిలో  ఎందఱో ఈ మాట సరోజనమ్మ చేత కడుపునిండా తిన్న వారు -
            కిష్టన్న నోట బాగోగులు కన్నవారు ఆ మధుర క్షణాలు  -మరచి పో
లేము -!-మరవ లేము !
                          వచ్చి పోవు వారే కాదు -వారి తోబుట్టువులు
-కొడుకులు కోడండ్రు -కూతుళ్ళు అల్లుండ్రు -బావలు బావ మరదులు   -
                           అందరి యోగక్షేమాలు అడిగి  తెలుసుకొనేడి
వాడు-మా ఇంటికి రండని  స్వాగతము పలుకు వాడు
                       అన్న దాత -సుఖీ భవ ! అనేది సూక్తి  నిజము గాన -ఈ
ఇల్లు సకల సంపదలతో చక్కగా వర్ధిల్లు తోంది -!
                          అలసట కానరాకుండా అన్నదానము  నిరతము
-నేరవేర్చిరీ పుణ్య దంపతులు !
             కోపతాపాలేన్నున్నా  -తన చిన్న నవ్వుతో పారద్రోలెను
             బంధు జనులనందరిని  తన చతురోక్తులతో మురిపించెను -
               కష్ట జీవి -నిష్ఠ  జీవి ! పిల్లల చక్కని భవితకై  కాదు
శ్రమించిన శ్రామికుడు -! కార్మికుడు !
               ఉత్తమ సద్బ్రాహ్మ ణుడు  సదా చారి ! నిరాడంబరి !
                                 సంత్రుప్తియే  తన ఊ పిరిగా- సంతోషమే
తన పరమావధిగా  -
                                 తన శాంతమే  తనకు రక్షగా -అందరి హితోభిలాషి గా -
                                 సర్వే  జనాః  స్సుఖినో భవంతు !
అన్నట్లుగా బక్క చిక్కిన ఆ దేహంలో -
                                 మెండైన -నిండిన తన ఆత్మా బలమ్మొ క్కటే
ధ్యెయముగా -
                                అ నలుగురికీ ఇంత తిండి పెట్టి -మిగిలిన
దానితో  తాము తృప్తి పడి -
                                 చివరి శ్వాస వరకు ఎవరి పై ఆధార పడకుండా
-ప్రశాంతంగా  -పరమానందంగా -
                                  తన జీవితాన్ని  పావనం చేసుకుని - ఆ
పరమాత్మునిలో  ఐక్యమైన
               ఆ శ్రీమతి సరోజనా పతికి -కీర్తి శేషులు  గుండి కృష్ణయ్య
గారి ఆత్మ స్వరూపానికి -
                 మా హృదయ పూర్వక ప్రణామాలు -అంజలి ఘటిస్తూ  -సమర్పిస్తున్నాము !
                               వారి కుటుంబం -దేవదేవుని కరుణ వల్ల
శాంతి సౌఖ్యాలతో చల్లగా వర్ధిల్లు గాక !
                               వారి  ఆత్మా శాంతిని పొందుగాక !
                                                       ఓం -శాంతి
-శాంతి -శాంతి :!
                                 -

Devi Maatha


   దేవి భాగవత  మహా  ప్రవచనము - వినుటకు   వచ్చిన 
   స్త్రీ  శిరోమణులు! -- అమ్మవారి రూపాలు  మీరు ! అఖిలాండేశ్వరి  ప్రతి రూపాలు  !
           భరత దేశ  సౌభాగ్య  సంస్కృతుల - వైభవాల  నిలయాలు  మీరు ! -   
       -పరాశక్తి వలె  ప్రకాశించి -  చైతన్యం జగతికి  తెచ్చారు  --1
                          అంగనలందరు అమ్మవారిని - సేవించుకొను  పండుగ రోజి  ది !
-- దేవి భగవతిని పూజించాలని   తహ లాడే  తరుణమిది  -!
                          మహా లక్ష్మి  -సరస్వతి ఉమ వలె -అపర దేవతా వనితల వోలె
 --అలంకరించుకొని వనితలందరూ -పరుగు పరుగున   అరుదెంచారు -!
            ఆహా 1 ఎంతటి  భాగ్యము మనదీ ! శ్రీ మాతను గని  -- ధన్యులౌదు మని --
-   లక్ష్మీవారము  మంగళప్ర దము -మంగళ గౌరీ రాజ రాజేశ్వరి! 
             లలిత1 శ్రీ మాత! -భగవతి!  భవాని! -ఎన్ని పేరులో ఎన్నిరూ పములో  -     
 -సాయంకాలపు  శుభ గడియ  ఇది! --దేవ దేవి1  వేంచేయు నో  ఏమో -1
                           మెల్ల మెల్లగా పిల్ల తెమ్మెరలు -హాయిని గొలుపుచు  వీచు చున్నవి -  
     -శుభ సూచకముగా -కళ్యాణ  రాగాన సంగత ధ్వని  విన బడు చున్నది -
                            అదిగో ! మణి  ద్వీప కాంతి పుంజములు -పురాణస్థలి  ప్రసరించుచున్నవి
 -- కాలి అందియ లు ఘల్లు ఘల్లు మను -మువ్వల  -సవ్వడి  అదిగో -అదిగో !
            దేవి  సమా రోహణ ము -జయము చేయుటకు   - తానే స్వయముగ వచ్చునో   -ఏమో  
     - ఏమో 1  ఏమో !   అందుర?ఆర్తిగ పిలిచినా రాకుండు టయా   ?
            అదిగో ! అదిగో  అదిగో - చూ డుడు  !  కళ్ళను  పెద్దవి చేసి చూడుడు   1    --   
  సాక్షాత్తుగా  ఆ పరాశక్తియే - అఖిలాండ కోటి బ్రహ్మాండ  జననియే -
             మనల  కరుణించ కదలి  వచ్చినది -స్వాగత మివ్వగ  కదలాలండి -  
  -కలలు  ఫలియించె  ! జన్మ తరియించే-కనులు చెమరించె -ప్రక్రుతి పులకించే -!
                             రండి ! రండి ! ఓ -తల్లుల్లారా  ! అక్కల్లారా ! చెల్లెల్లారా ! -     - 
   -కన్నె పడుచులు -వృద్ధ వనితలు -పెద్ద ముత్తైదు  పడతుల్లారా  !
                             అమ్మలగన్నా  అమ్మను-   పూజించ స్వాగత మివ్వగ   రారండి  !--
-  రత్న ఖచిత సింహాసనమ్మునే ఆసనమ్ముగా  వేయండి !
                              నాట్యము చేయుచు -పాటలు పాడుచు -ఆనందముతో  మ్రొక్కండి -!  
  అందమైన అందాల అమ్మను -ఆహ్వానించగ రారండి   !
              ఓ  శారదా ! బంగారు కలశము తెచ్చి పాదములు అభిషేకించమ్మా   !   
 ఓ భవానీ ! అర్ఘ్య పాద్యముల అమ్మకు అందించి -సేవించ మ్మా !
               కాత్యాయని 1 పారాణి తెచ్చి  బంగారు పాదము ల నలరించమ్మా   1- 
  -పద్మావతీ 1 పసుపు కుంకుమలతో  మాతను సేవించి తరించ వమ్మా 1
                             సావిత్రీ ! నీవు మెత్తని  కండువ  -దిండుల నమ్మకు  ఒనగూ ర్చవమ్మా 1   
--లక్ష్మె సరస్వతులారా ! మీరు- వింజామరతో  వీచండమ్మా  !
                             పెద్ద ముత్తైదువులంతా  కలిసి -జయ గీతాలు  పాడండ మ్మా  1   
       దేవి భాగవత కథా మహిమయో  1 మహేశ్వర శర్మ ప్రతిభ యో  ఏమో ! 
               ఆహా ఎంతటి భాగ్యము  మనదీ  --శ్రీ మాతను  గని  ధన్యుల మైతిమి  1 
   రాజీవ లోచని  1 రాజ రాజేశ్వరి - చల్లని చూపుల  కరుణించు  చున్నది 1
               కరమున బంగరు గాజులు -నడుమున వడ్డాణము  నలరించు  శ్యామలా 
 !కొప్పున మల్లెల -గళమున మందార పుష్ప హారము ల  నలరించు వాణీ !
                            సర్వాభరణముల నొసగి పన్నీరు--  చిలకరించమ్మా   ఓ  సీతమ్మా  !  
గంధము పూసీ  -చందన మందించి -తల్లిని  సేవించ మ మ్మ -భారతీ  !
                            కస్తూరి -జాజీ అగరు పరిమళ ము ల --- జ్యోతీ ! భక్తితో  అందించ వమ్మా  !
               మల్లెలు మొల్లలు సన్న జాజులు   --
 మందారాలు  కనకాంబర మ్ముల -విరి దండలతో మణి హారమ్ముతో -పరమేశ్వరి  నలరించగ  రారే 1
               కమ్మని వంటలు భక్చ్య భోజ్యముల  పాయస పరమాన్నములను   తెండి !
-పాలు పెరుగు -క్షీరాన్నము -పులిహోర  - పలు శాకమ్ముల  మరువక తెండి  1
                             కమ్మని నేతితో -చేసిన చక్కర పొంగలి --- శ్రద్ధగ  నైవేద్య మందించండి
 -మామిడి దానిమ్మ అరటి ద్రాక్షలు -- జామనారింజ-- ఆపిల్-పండ్లు 
                              విరివిగా దేవికి నివేదించుమా  ! 
పలు రుచుల పలు రకాల వంటల - పరమేశ్వరికి అర్పించండి!  తనువున మనసున భజియించండి  1
               పూర్వ జన్మలో చేసిన పుణ్యమో -కన్నవారి  ఆశీస్సు బలమ్మొ  !
గురువు గారు బోధించిన విధమో -ఫలియించెను నేడు -- మన నోము ఫలమ్ము ! 
                మహాలక్ష్మి -ఉమా- సరస్వతి -భవాని - శాంకరి  -
ఏ  రుపంమున కొలిచేవారికి  ఆ రూపమ్ము న అగుపించును   తల్లి 1
                             భగవతి సుందర దర్శన  భాగ్యము -అందరికీ  చెందాలమ్మా --1
పక్కవారినీ పిలవండీ  --తెలిసిన  వారికి చెప్పండీ   !
                            కన్నులు  విచ్చీ --మనసును పెట్టీ --హృదయము పొంగగ-స్తుతి యించండి 
--ముక్త కంఠమున   - మనోహరమ్ముగ --మధుర గీతముల పాడండి 
                కర్పూర మంగళ హారతులేత్తి -వరుసగ  నిలబడి  ఏక కన్థమున -
 జయ జయ శాంకరి -కౌమారి  యనుచు ఆనందమ్ముగ  వేడుకోనండి  1
                కోరిన తడవుగ  కొంగు  బంగారమై -కరుణించు   తల్లి  --వందన మమ్మా !
పసుపు  కుంకుమతో -పాడి పంటలతో పిల్లా పాపలతో చల్లగ ఉంచి -
                మరువక నిన్ను   సేవించు భాగ్యము అందించావమ్మా --కని కరించమ్మా !
దీవించవమ్మా   ! మరల   కనిపించ వమ్మా  1
                                  నిను దర్శించిన మా  భాగ్యమె  భాగ్యము --నిను  సేవించిన  మా బ్రతుకే  ధన్యము
                                 సాముహికముగా మేమొ నరించిన -పూజలో తప్పులు   క్షమించవమ్మా -!
                                   శరణు ! శరణు  జగదీశ్వరీ   !  పాహి 1 పాహి  !  పరమేశ్వరీ   !
                                   జయహో -రాజ రాజేశ్వరీ --జయహో ! జయహో  ! పరమ పావనీ   !                      -     
              '' శ్లో ''---కాత్యాయని  మహామాయే  --భవాని  భువనేశ్వరీ !-
                         సంసార  సాగరే  మాగ్నామ్ -మాముద్ధర  కృపామ యే  !!
                                              జగదంబా -విశ్వపాలిని  మాతాకీ  జై !--
గౌరీ శంకర  భగవాన్  కీ జై  !నమః  పార్వతీ పతయే  హర హర మహా దేవ హర  !!
                                                                                                  హరయే  నమః  !1     

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...